Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
అసలే శ్రావణమాసం, ఆపై శివ పూజ.. ఈ తప్పులు చేశారంటే అనుగ్రహం ఏమో కానీ ఆగ్రహం తప్పదు!
శ్రావణమాసం మొదలు కాబోతోంది. ఈ సమయంలో శివుడికి పూజలు చేసే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ప్రతీ సోమవారం ప్రత్యేక పూజలు, ఆరాధనలు, అభిషేకాలు, శివ మంత్రాల పఠనం ఇలా తమకు నచ్చిన రీతిలో శివయ్యను స్మరిస్తుంటారు. అయితే శివ పూజ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదని పూజారులు చెబుతున్నారు. పూజలు మనం చేసే ఈ చిన్న తప్పుల వల్ల శివానుగ్రహం ఏమో కానీ శివాగ్రహానికి గురవుతామని అంటున్నారు. ఆ శంకరుడి పూజలో అస్సలే చేయకూడని ఆ తప్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎట్టి పరిస్థితుల్లోనూ శంఖం ఊదకూడదు:
శివ పూజ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ శంఖం ఊదకూడదు. శ్రీ మహా విష్ణువుకు శంఖం అంటే చాలా ఇష్టం. సాంప్రదాయ పూజల్లో శంఖాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పూజ సమయంలో శంఖం ఊదుతారు. శంఖం ఊదిన ఆ కోనేరులో విష్ణువు, లక్ష్మీ ఉంటారని భక్తుల నమ్మకం. కానీ శివారాధన చేసేటప్పుడు మాత్రం అస్సలే శంఖం పూరించకూడదని చెబుతారు. శ్రావణ మాసం శివుడికి అంకితం. కాబట్టి ఈ నెలలో పూజ చేసేటప్పుడు శంఖం పూరించకూడదని అంటారు.
అసలెందుకు శంఖం పూరించకూడదు..?
ఒకప్పుడు శంఖచూడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో జన్మించాడు. అతని బలం కారణంగా అతడిని ఓడించడం చాలా కష్టం. అయితే అతని మాటలకు దేవతలే ఆశ్చర్యపోయే వారని అంతా అంటుండేవారు. అలాగే బ్రహ్మదేవుడి దయ, విష్ణువు అనుగ్రహం వల్ల శంఖచూడునికి కూడా శ్రీకృష్ణుడు కవచం లభించింది. దీంతో అతనిలో అహం పెరిగిపోయింది. దీనికి తోడు తులసితో వివాహం కూడా జరిగింది. తులసి కవచం కారణంగా అతడిని చంపడం కష్టంగా మారింది. అయితే దేవతలు శివుడి వద్దకు వెళ్లారు. అయితే ఆ రాక్షసుడి బారి నుంచి విముక్తి కావాలని వేడుకుంటారు. విష్ణువు కూడా ఆ భోళా శంకరుడిని ఇందుకు పరిహారం చేయమని కోరతాడు.
శివుడి బూడిదతో శంఖం ఏర్పడిందని ప్రతీతి:
దీంతో శివుడు తన త్రిశూలంతో శంఖచుడుడ్ని సంహరిస్తాడు. అప్పుడు అతడు తన శరీరాన్ని తినేస్తాడని అంతా నమ్ముతారు. ఈ సమయంలో శివుని బూడిద నుంచి ఈ శంఖం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే శివుడి పూజలో శంఖం లేదా దాని నీటిని ఉపయోగించరు. అలాగే తులసిని కూడా శివారాధనకు వాడరు.
మాంసాహారం, శృంగారానికి దూరం:
అలాగే శ్రావణ మాసంలో శివారాధన చేసే వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టుకోకూడదు. కేవలం మాంసాహారమే కాదు గుడ్లు, ఉల్లిపాయ, ఎల్లిపాయలకు కూడా చాలా దూరంగా ఉండాలి. మద్యపానం కూడా చేయకూడదు. ప్రతీ సోమవారం ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి. అలాగే పూజ చేసే రోజు, ముందు రోజు, తర్వాత రోజు శృంగారానికి దూరంగా ఉండాలి. వాటన్నిటిని విడిచి పెట్టి కేవలం ఆ శివయ్యపైనే మనసు ఉంచండి.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications