Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
Diwali 2024: దీపావళి ఎప్పుడు.. అక్టోబర్ 31నా లేక నవంబర్ 1నా? పండితులు ఏం చెబుతున్నారంటే?
హిందువులు జరుపుకునే అదిపెద్ద పండుగల్లో ఒకటి దీపావళి పండుగ. చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ ఇది. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ రోజు.. దేశంలోని ప్రతీ ఇల్లు దీప కాంతులతో నిండిపోతుంది. లక్ష్మీ పూజ, బాణాసంచాల మోతలతో ప్రతి ఇల్లు సందడిగా ఆనందానికి నిలయంగా మారుతుంది. ఇలాంటి గొప్ప పండగను జరుపుకునే రోజు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది.
ఎందుకంటే కొందరు దీపావళి అక్టోబర్ 31న జరుపుకోవాలని అంటుంటే, మరికొందరు నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలని అంటున్నారు. పండితులు సైతం ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. అయితే ఇంతకీ పండుగ 31న జరుపుకోవాలా? లేదా 1వ తేదీన జరుపుకోవాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి ఎప్పుడు వస్తుందంటే:
నిజానికి దీపావళి పండుగ రోజు లక్ష్మి దేవి భూమిని సందర్శించడానికి వస్తుందని నమ్ముతుంటారు. అందురు లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ప్రతీ ఇంటిని అందంగా అలంకరించి.. దీపాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. నిజానికి దీపావళిని ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఆ అమావాస్య ఎప్పుడు వచ్చిందనే దానిపై క్లారిటీ లేదు.

పండితులు ఏం చెబుతున్నారంటే?
నిజానికి దీపావళి ఆశ్వయుజ మాసంలో వచ్చే ప్రదోష అమావాస్య రోజు జరుపుకుంటారు. అయితే ఈసారి అమావాస్య అక్టోబర్ 31వ తేదీతో పాటు నవంబర్ 1వ తేదీన కూడా వచ్చింది. అయితే నవంబర్ 1న ఆయుష్మాన్ యోగం.. స్వాతి నక్షత్రం కలయిక జరిగింది. అందుకే దీపావళిని నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలని, ఆరోజు జరుపుకుంటేనే శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.
వేదం పంచాంగం ఏం చెబుతుందంటే?
వేద పంచాగం ప్రకారం దీపావళి దీపావళి నాడు లక్ష్మీ పూజ.. అమావాస్య తిథి, ప్రదోష కాలాలను అనుసరిస్తూ.. సాయంకాలం నుంచి అర్థరాత్రి వరకు జరుగుతుంది. దీని ప్రకారం.. అమావాస్య తిథి, ప్రదోష కాలాలతో పాటు శుభసమయాలున్న అక్టోబర్ 31వ తేదీనే దీపావళి జరుపుకోవాలని వేద పంచాగ నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు దీపావళికి కచ్చితమైన తేదీ ఖరారు కాలేదు. దీపావళికి కూడా ఇంకో పది రోజుల సమయం ఉండడంతో పంచాంగ నిపుణులు కూడా ఎదో ఒక తేదీని ఖరారు చేసే అవకాశముంది. ఆ తేదీ ఖరారు అయితే బోల్డ్ స్కై తెలుగులో మేము మళ్ళీ అప్డేట్ చేస్తాము.
దీపావళి రోజున ఏం చేస్తారంటే?
హిందువులు జరుపుకునే అతిపెద్ద అత్యంత విశిష్టమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. ఈ పండుగ రోజున గణేశుడు, సరస్వతి దేవి, కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తారు. ఇల్లంతా అలంకరించి, దీపాలు వెలిగించి, బాణాసంచాలు కాల్చి పండుగను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications