Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఇంతకీ దసరా ఏ రోజు జరుపుకోవాలి 12న లేదా 13న? పండితులు ఏం చెబుతున్నారంటే?
దసరా పండగ దగ్గపడింది. ప్రతి ఒక్కరూ పండగ మోడ్లో విహరిస్తున్నారు. షాపింగ్ నుంచి మొదలుకొని, పిండి వంటలు చేసుకోవడం వంటి పనుల్లో మునిగిపోయారు. అయితే ఈ సంవత్సరం దసరా రెండు రోజులు వస్తుండడంతో ఏ రోజున పండుగ జరుపుకోవాలనేది సందిగ్ధంగా మారింది. ఇంతకీ పండగ ఏ రోజున జరుపుకోవాలి? పండితులు ఏం చెబుతున్నారు అనేది ఇక్కడ చెప్పాము పూర్తిగా చదవండి..
దసరా ఏ రోజున వస్తుందంటే?
దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగల్లో దసరా పండగ ముఖ్యమైనది. ఈనెల 3వ తేదీ నుంచే దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులందరూ దేవి శరన్నవరాత్రుల్లో, అమ్మవారి పూజలో మునిగితేలుతున్నారు. అయితే ఇంతకీ దసరా ఎప్పుడనే సందిగ్ధం భక్తుల్లో నెలకొంది. నిజానికి ఈ ఏడాది దసరా రెండు రోజులు వచ్చింది. ఈనెల 12వ తేదీ ఉదయం 10.58 గంటలకు విజయదశమి ప్రారంభమవుతుంది. అలాగే ఈనెల 13వ తేదీ అంటే అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9.08 గంటలకు వరకు దసరా ఘడియలు ఉండడనున్నాయి.

పండగ ఏ రోజున జరుపుకోవాలంటే?
దసరా పండుగ రెండు రోజులు వచ్చాయి. అయినప్పటికీ దశమి ఘడియలు 12వ తేదీన ప్రారంభమవుతున్నాయి. అంటే అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.58 గంటల తరువాత విజయ దశమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దశమి ఘడియలు ప్రారంభమైన రోజునే పండుగ జరుపుకుంటే.. ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు, శ్రయోభిలాషులకు తెలియజేసేందుకు ఈ స్టోరీని షేర్ చేయండి.
దసరా ప్రాముఖ్యత తెలుసా?
హిందూ సంప్రదాయంలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దసరా పండుగ. రావణాసురుడిపై రాముడు విజయం సాధించడం, అలాగే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ పద్ధతుల్లో ఈ పండుగను జరుపుకుంటారు. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి రావణుడి దహనం వరకు.. దేశమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా చెడుపై మంచి విజయానికి గుర్తుగా నిర్వహించుకునే పండుగే ఇది.



Click it and Unblock the Notifications