Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఇంతకీ దసరా ఏ రోజు జరుపుకోవాలి 12న లేదా 13న? పండితులు ఏం చెబుతున్నారంటే?
దసరా పండగ దగ్గపడింది. ప్రతి ఒక్కరూ పండగ మోడ్లో విహరిస్తున్నారు. షాపింగ్ నుంచి మొదలుకొని, పిండి వంటలు చేసుకోవడం వంటి పనుల్లో మునిగిపోయారు. అయితే ఈ సంవత్సరం దసరా రెండు రోజులు వస్తుండడంతో ఏ రోజున పండుగ జరుపుకోవాలనేది సందిగ్ధంగా మారింది. ఇంతకీ పండగ ఏ రోజున జరుపుకోవాలి? పండితులు ఏం చెబుతున్నారు అనేది ఇక్కడ చెప్పాము పూర్తిగా చదవండి..
దసరా ఏ రోజున వస్తుందంటే?
దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగల్లో దసరా పండగ ముఖ్యమైనది. ఈనెల 3వ తేదీ నుంచే దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులందరూ దేవి శరన్నవరాత్రుల్లో, అమ్మవారి పూజలో మునిగితేలుతున్నారు. అయితే ఇంతకీ దసరా ఎప్పుడనే సందిగ్ధం భక్తుల్లో నెలకొంది. నిజానికి ఈ ఏడాది దసరా రెండు రోజులు వచ్చింది. ఈనెల 12వ తేదీ ఉదయం 10.58 గంటలకు విజయదశమి ప్రారంభమవుతుంది. అలాగే ఈనెల 13వ తేదీ అంటే అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9.08 గంటలకు వరకు దసరా ఘడియలు ఉండడనున్నాయి.

పండగ ఏ రోజున జరుపుకోవాలంటే?
దసరా పండుగ రెండు రోజులు వచ్చాయి. అయినప్పటికీ దశమి ఘడియలు 12వ తేదీన ప్రారంభమవుతున్నాయి. అంటే అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.58 గంటల తరువాత విజయ దశమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దశమి ఘడియలు ప్రారంభమైన రోజునే పండుగ జరుపుకుంటే.. ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు, శ్రయోభిలాషులకు తెలియజేసేందుకు ఈ స్టోరీని షేర్ చేయండి.
దసరా ప్రాముఖ్యత తెలుసా?
హిందూ సంప్రదాయంలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దసరా పండుగ. రావణాసురుడిపై రాముడు విజయం సాధించడం, అలాగే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ పద్ధతుల్లో ఈ పండుగను జరుపుకుంటారు. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి రావణుడి దహనం వరకు.. దేశమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా చెడుపై మంచి విజయానికి గుర్తుగా నిర్వహించుకునే పండుగే ఇది.



Click it and Unblock the Notifications