Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఇంతకీ దసరా ఏ రోజు జరుపుకోవాలి 12న లేదా 13న? పండితులు ఏం చెబుతున్నారంటే?
దసరా పండగ దగ్గపడింది. ప్రతి ఒక్కరూ పండగ మోడ్లో విహరిస్తున్నారు. షాపింగ్ నుంచి మొదలుకొని, పిండి వంటలు చేసుకోవడం వంటి పనుల్లో మునిగిపోయారు. అయితే ఈ సంవత్సరం దసరా రెండు రోజులు వస్తుండడంతో ఏ రోజున పండుగ జరుపుకోవాలనేది సందిగ్ధంగా మారింది. ఇంతకీ పండగ ఏ రోజున జరుపుకోవాలి? పండితులు ఏం చెబుతున్నారు అనేది ఇక్కడ చెప్పాము పూర్తిగా చదవండి..
దసరా ఏ రోజున వస్తుందంటే?
దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగల్లో దసరా పండగ ముఖ్యమైనది. ఈనెల 3వ తేదీ నుంచే దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులందరూ దేవి శరన్నవరాత్రుల్లో, అమ్మవారి పూజలో మునిగితేలుతున్నారు. అయితే ఇంతకీ దసరా ఎప్పుడనే సందిగ్ధం భక్తుల్లో నెలకొంది. నిజానికి ఈ ఏడాది దసరా రెండు రోజులు వచ్చింది. ఈనెల 12వ తేదీ ఉదయం 10.58 గంటలకు విజయదశమి ప్రారంభమవుతుంది. అలాగే ఈనెల 13వ తేదీ అంటే అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9.08 గంటలకు వరకు దసరా ఘడియలు ఉండడనున్నాయి.

పండగ ఏ రోజున జరుపుకోవాలంటే?
దసరా పండుగ రెండు రోజులు వచ్చాయి. అయినప్పటికీ దశమి ఘడియలు 12వ తేదీన ప్రారంభమవుతున్నాయి. అంటే అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.58 గంటల తరువాత విజయ దశమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దశమి ఘడియలు ప్రారంభమైన రోజునే పండుగ జరుపుకుంటే.. ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు, శ్రయోభిలాషులకు తెలియజేసేందుకు ఈ స్టోరీని షేర్ చేయండి.
దసరా ప్రాముఖ్యత తెలుసా?
హిందూ సంప్రదాయంలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దసరా పండుగ. రావణాసురుడిపై రాముడు విజయం సాధించడం, అలాగే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ పద్ధతుల్లో ఈ పండుగను జరుపుకుంటారు. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి రావణుడి దహనం వరకు.. దేశమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా చెడుపై మంచి విజయానికి గుర్తుగా నిర్వహించుకునే పండుగే ఇది.



Click it and Unblock the Notifications