Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Diwali 2024: వింత ఆచారం.. ఆ గ్రామంలో దీపావళి జరుపుకోరట! కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాధారణంగా దీపావళి రోజు దేశం మొత్తం అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటారు. దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి దీపావళిని జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, పిల్లా పాపలతో కలిసి ఈ వేడుకను చూడముచ్చటగా అందంగా నిర్వహించుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తూ తమ కోరికలు కోరుకుంటారు.
ఇంతటి పవిత్రమైన దీపావళిని దేశం మొత్తం జరుపుకుంటే.. ఏపీలోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని జరుపుకోరు. ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామంలో ఎందుకు దీపావళిని జరుపుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ గ్రామం ఎక్కడుందంటే?
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో సుమారు 70 సంవత్సరాల నుంచి దీపావళిని, నాగుల పంచమిని జరుపుకోవడం లేదు. ఈ రెండు పండగలను జరుపుకోవడం వల్ల తమ గ్రామానికి కీడు సోకుతుందని, ఎదో ఒక అపాయం జరుగుతుందని ఆ గ్రామస్థుల నమ్మకమట. అందుకే సుమారు 70 సంవత్సరాల నుంచి ఈ పండగలను జరుపుకోవడం లేదట.

దీపావళిని ఎందుకు జరుపుకోకపోవడానికి కారణం ఏంటంటే..
ఈ దీపావళిని జరుపుకోకపోవడానికి కూడా ఓ కారణం ఉందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. పూర్వం ఆ గ్రామస్థులు దీపావళిని జరుపుకొని నాగుల చవితిని జరుపుకుంటారు. దీపావళి పండగ జరుపుకొని నాగ దేవతను పూజించే వారు. అయితే గతంలో దీపావళిని పూర్తి చేసుకొని నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఇంటి వద్ద ఉన్న ఓ చంటి బిడ్డ మరణించాడు.
మరో ఏడాది ఇలానే నాగుల పంచమి రోజు నాగు పాముకు పుట్టలో పాలు పోసి ఇంటికి వస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన పశువులు.. అంటే ఎద్దులు, ఆవులు మృతి చెందాయట. దీంతో అప్పటి నుంచి ఆ గ్రామస్తుల్లో భయం నెలకొంది. దీపావళి, నాగులపంచమిని నిర్వహించుకుంటే తప్పనిసరిగా తమ గ్రామంలో కీడు జరుగుతుందని నమ్మారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు దీపావళి పండగను, నాగుల పంచమి పండగను జరుపుకోరు.
యువత పండగ జరపడానికి ప్రయత్నించినప్పటికీ..
గ్రామ పెద్దలది మూఢ నమ్మకమని పండగను జరుపుకుంటే ఎలాంటి హాని జరగదని ఆ గ్రామ యువత, కొత్తగా వచ్చిన కోడళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు. విద్యావేత్తలు, యువత, కోడళ్ళు పండగను నిర్వహించుకోవాలని పట్టు బడుతున్నప్పటికీ ఆ గ్రామంలోని పెద్దలు దీనికి ఒప్పుకోవడం లేదట. తాము అనాదిగా ఈ పండగను జరుపుకోవడం లేదని, పండగను జరుపుకుంటే కచ్చితంగా ఎదో కీడు జరుగుతుందని ఆ గ్రామ పెద్దమనుషులు చెబుతున్నారట.
సుమారు 70 సంవత్సరాల నుంచి తమ గ్రామంలో దీపావళి, నాగుల పంచమి పండగను జరుపుకోమని, ఆ రెండు పండగలు మినహా ప్రతీ పండగను ఘనంగా జరుపుకుంటామని అక్కడి గ్రామస్థులు పేర్కొంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలు, అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. అవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వాటిని విశ్వసించడం అనేది మీ బాధ్యత. అందుకే ఇలాంటి విషయాలను విశ్వసించడం, అనుసరించే ముందు తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాలి. లేదా నిపుణుల నిర్ణయాలు, సలహాలు తీసుకోవాలి. అదే ఉత్తమమైన నిర్ణయం.



Click it and Unblock the Notifications