Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Diwali 2024: వింత ఆచారం.. ఆ గ్రామంలో దీపావళి జరుపుకోరట! కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాధారణంగా దీపావళి రోజు దేశం మొత్తం అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటారు. దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి దీపావళిని జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, పిల్లా పాపలతో కలిసి ఈ వేడుకను చూడముచ్చటగా అందంగా నిర్వహించుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తూ తమ కోరికలు కోరుకుంటారు.
ఇంతటి పవిత్రమైన దీపావళిని దేశం మొత్తం జరుపుకుంటే.. ఏపీలోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని జరుపుకోరు. ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామంలో ఎందుకు దీపావళిని జరుపుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ గ్రామం ఎక్కడుందంటే?
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో సుమారు 70 సంవత్సరాల నుంచి దీపావళిని, నాగుల పంచమిని జరుపుకోవడం లేదు. ఈ రెండు పండగలను జరుపుకోవడం వల్ల తమ గ్రామానికి కీడు సోకుతుందని, ఎదో ఒక అపాయం జరుగుతుందని ఆ గ్రామస్థుల నమ్మకమట. అందుకే సుమారు 70 సంవత్సరాల నుంచి ఈ పండగలను జరుపుకోవడం లేదట.

దీపావళిని ఎందుకు జరుపుకోకపోవడానికి కారణం ఏంటంటే..
ఈ దీపావళిని జరుపుకోకపోవడానికి కూడా ఓ కారణం ఉందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. పూర్వం ఆ గ్రామస్థులు దీపావళిని జరుపుకొని నాగుల చవితిని జరుపుకుంటారు. దీపావళి పండగ జరుపుకొని నాగ దేవతను పూజించే వారు. అయితే గతంలో దీపావళిని పూర్తి చేసుకొని నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఇంటి వద్ద ఉన్న ఓ చంటి బిడ్డ మరణించాడు.
మరో ఏడాది ఇలానే నాగుల పంచమి రోజు నాగు పాముకు పుట్టలో పాలు పోసి ఇంటికి వస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన పశువులు.. అంటే ఎద్దులు, ఆవులు మృతి చెందాయట. దీంతో అప్పటి నుంచి ఆ గ్రామస్తుల్లో భయం నెలకొంది. దీపావళి, నాగులపంచమిని నిర్వహించుకుంటే తప్పనిసరిగా తమ గ్రామంలో కీడు జరుగుతుందని నమ్మారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు దీపావళి పండగను, నాగుల పంచమి పండగను జరుపుకోరు.
యువత పండగ జరపడానికి ప్రయత్నించినప్పటికీ..
గ్రామ పెద్దలది మూఢ నమ్మకమని పండగను జరుపుకుంటే ఎలాంటి హాని జరగదని ఆ గ్రామ యువత, కొత్తగా వచ్చిన కోడళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు. విద్యావేత్తలు, యువత, కోడళ్ళు పండగను నిర్వహించుకోవాలని పట్టు బడుతున్నప్పటికీ ఆ గ్రామంలోని పెద్దలు దీనికి ఒప్పుకోవడం లేదట. తాము అనాదిగా ఈ పండగను జరుపుకోవడం లేదని, పండగను జరుపుకుంటే కచ్చితంగా ఎదో కీడు జరుగుతుందని ఆ గ్రామ పెద్దమనుషులు చెబుతున్నారట.
సుమారు 70 సంవత్సరాల నుంచి తమ గ్రామంలో దీపావళి, నాగుల పంచమి పండగను జరుపుకోమని, ఆ రెండు పండగలు మినహా ప్రతీ పండగను ఘనంగా జరుపుకుంటామని అక్కడి గ్రామస్థులు పేర్కొంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలు, అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. అవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వాటిని విశ్వసించడం అనేది మీ బాధ్యత. అందుకే ఇలాంటి విషయాలను విశ్వసించడం, అనుసరించే ముందు తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాలి. లేదా నిపుణుల నిర్ణయాలు, సలహాలు తీసుకోవాలి. అదే ఉత్తమమైన నిర్ణయం.



Click it and Unblock the Notifications











