Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Sri Rama Navami Talambralu: కన్నుల పండుగగా భద్రాచలం సీతారాముల కళ్యాణం, కోటి ముత్యాల తలంబ్రాలు సిద్దం..
Sri Rama Navami Talambralu: భద్రాచలం, ఒంటిమిట్ట సితారాముల కళ్యాణోత్సవాలకు సర్వం సిద్దం చేస్తున్నారు. గోటితో ఒలిచిన కోటి ముత్యాలు సితారాముల కళ్యాణోత్సవాలకు సిద్దంగా ఉన్నాయి. ఓ యజ్ఞలా, ఎంతో భక్తిశ్రద్దలతో ఎంతో పవిత్రంగా పండించిన ముత్యాలను గోటితో ఒలిచి వాటిని శుభ్రం చేసిన ముత్యాలను సీతారాముల కళ్యాణోత్సవాలకు ఉపయోగిస్తారు.
భద్రాచలం, ఒంటిమిట్టలోని రాముడి ఆలయాల్లో కోటి తలంబ్రాలతో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించడానికి సర్వం సిద్దం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని తుర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలోి అచ్యుతాపురంలోని గ్రామంలోని వ్యవయాయ భూమిలో ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించకుండా ముత్యాల పంట పండిస్తారు.

మొదట విత్తనాలను తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలోని ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత ప్రత్యేక కళశాలలో వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి శ్రీరామరామస్మరణంతో వాటిని పంట పండిస్తారు. ఎంతో పవిత్రంగా పండించిన పంటను భక్తి శ్రద్దలతో పంటను కోసి, వాటిని విడిపించి వాటిని తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 3 వేల మంది భక్తులకు పంపిస్తారు.
శ్రీరామనామస్మరణంతోనే ఆ ముత్యాలను గోటితో ఒలిపిస్తారు. ఇలా గోటితో ఒలిపించిన కోటి ముత్యాలను తెలంగాణలోని భద్రాచలంకు. మరో కోటి ముత్యాలను ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట ఆలయానికి అందిస్తారు. ప్రత్యేక కళశాలలో ముత్యాలను భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలకు తరలిస్తారు. శ్రీరామనవమి సందర్బంగా సీతారాముల కళ్యాణోత్సవం చాలా ఘనంగా, వైభంగా నిర్వహిస్తారు.
సీతారాముల కళ్యాణోత్సవానికి ఉపయోగించిన కోటి ముత్యాల తలంభ్రాలను ముట్టుకుంటేనే ఎంతో పుణ్యం అని భక్తులు అనుకుంటారు. గత 12 ఏళ్ల నుంచి ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎంతో పవిత్రంగా పండిచిన ముత్యాలను గొటితొ ఒలిపించి వాటిని భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలకు పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శ్రీసీతారాముల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడానికి తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం. ఒంటిమిట్ట ఆలయాలు సర్వం సిద్దం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











