Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
Sri Rama Navami Talambralu: కన్నుల పండుగగా భద్రాచలం సీతారాముల కళ్యాణం, కోటి ముత్యాల తలంబ్రాలు సిద్దం..
Sri Rama Navami Talambralu: భద్రాచలం, ఒంటిమిట్ట సితారాముల కళ్యాణోత్సవాలకు సర్వం సిద్దం చేస్తున్నారు. గోటితో ఒలిచిన కోటి ముత్యాలు సితారాముల కళ్యాణోత్సవాలకు సిద్దంగా ఉన్నాయి. ఓ యజ్ఞలా, ఎంతో భక్తిశ్రద్దలతో ఎంతో పవిత్రంగా పండించిన ముత్యాలను గోటితో ఒలిచి వాటిని శుభ్రం చేసిన ముత్యాలను సీతారాముల కళ్యాణోత్సవాలకు ఉపయోగిస్తారు.
భద్రాచలం, ఒంటిమిట్టలోని రాముడి ఆలయాల్లో కోటి తలంబ్రాలతో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించడానికి సర్వం సిద్దం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని తుర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలోి అచ్యుతాపురంలోని గ్రామంలోని వ్యవయాయ భూమిలో ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించకుండా ముత్యాల పంట పండిస్తారు.

మొదట విత్తనాలను తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలోని ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత ప్రత్యేక కళశాలలో వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి శ్రీరామరామస్మరణంతో వాటిని పంట పండిస్తారు. ఎంతో పవిత్రంగా పండించిన పంటను భక్తి శ్రద్దలతో పంటను కోసి, వాటిని విడిపించి వాటిని తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 3 వేల మంది భక్తులకు పంపిస్తారు.
శ్రీరామనామస్మరణంతోనే ఆ ముత్యాలను గోటితో ఒలిపిస్తారు. ఇలా గోటితో ఒలిపించిన కోటి ముత్యాలను తెలంగాణలోని భద్రాచలంకు. మరో కోటి ముత్యాలను ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట ఆలయానికి అందిస్తారు. ప్రత్యేక కళశాలలో ముత్యాలను భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలకు తరలిస్తారు. శ్రీరామనవమి సందర్బంగా సీతారాముల కళ్యాణోత్సవం చాలా ఘనంగా, వైభంగా నిర్వహిస్తారు.
సీతారాముల కళ్యాణోత్సవానికి ఉపయోగించిన కోటి ముత్యాల తలంభ్రాలను ముట్టుకుంటేనే ఎంతో పుణ్యం అని భక్తులు అనుకుంటారు. గత 12 ఏళ్ల నుంచి ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎంతో పవిత్రంగా పండిచిన ముత్యాలను గొటితొ ఒలిపించి వాటిని భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలకు పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శ్రీసీతారాముల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడానికి తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం. ఒంటిమిట్ట ఆలయాలు సర్వం సిద్దం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











