Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
ఈరోజు అమావాస్య.. ఈ విధంగా దీపం వెలిగిస్తే, సంవత్సరం అంతా అదృష్టం మీవైపే ఉంటుందట!
హిందూ ధర్మం ప్రకారం అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ అమావాస్య నుంచే కొందరు వ్యక్తులకు మంచి, మరికొందరు వ్యక్తులకు చెడు ఫలితాలు కలగనున్నాయి. అయితే అన్ని అమావాస్యల్లో కెల్లా చైత్ర అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ అమావాస్యను అత్యంత శక్తివంతమైన అమావాస్యగా పరిగణించబడతారు. అయితే ఈ ఏడాది ఈ చైత్ర అమావాస్య ఈరోజు అంటే ఏప్రిల్ 27వ తేదీన వచ్చేసింది. ఈ ప్రత్యేక అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలు పాటిస్తే సంవత్సరం అంతా శుభఫలితాలు పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్యపండితులు వివరిస్తున్నారు. ఇంతకీ ఈ చైత్ర సమస్య రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఎలాంటి పూజలు చేయాలి? ఈ అమావాస్య ప్రాధాన్యత ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
చైత్ర అమావాస్య యొక్క ప్రాధాన్యత:
ఈ అమావాస్య రోజున చేసే ప్రతి ఉపాసన, దానం, పుణ్య కార్యానికి ఎన్నో రెట్లు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఇంటిలో ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుని విగ్రహాలకు గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుభం పెరుగుతుంది.

గంగా స్నానం లేదా ప్రత్యామ్నాయం:
సముద్రం, నదుల సమీపంలో ఉన్నవారు గంగా స్నానం చేస్తే మేలని చెబుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తాము స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి "గంగా గంగా" అని స్మరిస్తూ స్నానం చేస్తే సమాన ఫలితం పొందవచ్చు.
అఖండ దీపం వెలిగించే విశిష్టత:
ఈ రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆరిపోని దీపాన్ని వెలిగించడం ప్రత్యేకమైన శుభచిహ్నం. ఈ దీపాన్ని ఇంటి హాలులో ఈశాన్యం మూలన ఏర్పాటు చేయాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యితో మూడు వత్తులతో దీపం వెలిగించాలి. దీని వల్ల ఇంట్లో శాంతి, సంపద కలిసివస్తాయి.
ప్రత్యేక ధన దీపం:
దేవుని గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తూ అందులో రెండు లవంగాలు, కుంకుమ పువ్వు పొడి వేసి ఎర్ర వత్తులతో దీపం వెలిగించాలి. ఇది నవగ్రహ అనుగ్రహం పొందేందుకు, కుజ దోష నివారణకు, గృహ శాంతి కోసం ఎంతో శుభప్రదం.
రావి చెట్టు వద్ద పూజా విధానం:
ఉదయం స్నానం తర్వాత రావి చెట్టు వద్ద నీళ్లు పోయాలి. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించి విష్ణుమూర్తి కటాక్షం కోరుకోవాలి.
దానాలు మరియు ధూపం ప్రత్యేకత:
ఈ రోజున నీటి కుండలు, తెల్లటి వస్త్రాలు దానం చేయడం, గోసేవ చేయడం ద్వారా పుణ్యప్రాప్తి కలుగుతుంది. మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఇంట్లో గోమయం, ఆవు నెయ్యి, బెల్లం పొడి, సాంబ్రాణీతో ధూపం వేసుకోవడం ద్వారా నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు.
ముగింపు:
చైత్ర అమావాస్యను సద్వినియోగం చేసుకొని పూజలు, దానాలు, ప్రత్యేక దీపాలు వెలిగించడంతో సంవత్సరం మొత్తం సానుకూల శక్తులు, శుభ సంఘటనలు మన జీవితాన్ని ఆనందంగా మార్చతాయని జ్యోతిష్య నిపుణులతో పాటు, హిందూ ధర్మ అనుసరికులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











