Latest Updates
-
చర్మ నిగారింపు కోసం.. వీటిని ముఖానికి పూయడమే కాదు, తిన్నా ప్రయోజనమే.! -
ఒక్కసారి ఈ గుజరాతీ స్టైల్ ఆలూ కూర వండారంటే.. చపాతీలు, పూరీలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
ఈ విటమిన్ లోపంతో నిరంతరం అలసట, తిమ్మిర్లు.. ఈ హెల్తీ ఫుడ్స్తో ఉపశమనం -
షుగర్ వ్యాధికి చెక్ పెట్టే జ్యూస్ ఇదే..తాగితే 100 ఏళ్లు హ్యాపీగా బతికేస్తారు! -
ఉదయం చట్నీ టెన్షన్ వద్దు.. ఈ టొమాటో తొక్కు ఉంటే ఇడ్లీ, దోసెల్లోకి పండుగే..ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ -
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.! -
ప్రసవానంతరం తల్లుల్లో విపరీతంగా డిప్రెషన్.. బిడ్డ పుడితే ఇన్ని మార్పులా.? -
పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్న జెన్ జెడ్ యువత.. భాగస్వామి కంటే ముందు వాటికే ప్రాధాన్యత.! -
ఉదయం నిద్రలేవగానే మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఇలా చేస్తే రిలీఫ్! -
100 కి.మీ స్పీడ్ లో బస్సు..ఫోన్ లో లీనమైపోయిన డ్రైవర్, కండక్టర్..వైరల్ వీడియో చూడండి
రంగవల్లలకు గొబ్బెమ్మల అలంకరణ ఎందుకు ?
ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి ముంగిట్లో రంగవల్లులు, మధ్యలో గొబ్బెలు పెడతారు. నెలరోజులూ రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇల్లులన్నీ చాలా కొత్త శోభ సంతరించుకుంటాయి. అయితే ఈ కాలంలో నెలంతా పెట్టే ఓపిక, తీరిక లేని వాళ్లు.. కేవలం పండుగ మూడు రోజులు మాత్రం పెడతారు.
కర్మ సిద్ధాంతం గురించి ఆసక్తికర అంశాలు ?
ముగ్గు మధ్యలు గొబ్బెమ్మలు పెట్టి అలంకరించడం హిందూ సంప్రదాయం. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి పసుపు, కుంకుమ పెట్టి, పూలతో అలంకరించి, నవ ధాన్యాలు వాటిలో పోసి.. ముగ్గులపై అలంకరిస్తారు. ఇలా పెట్టిన తర్వాత అమ్మాయిలంతా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడతారు. ఈ విశేషమంతా.. సంక్రాంతి పండుగ సమయంలో చాలా సరదాగా, సంతోషంగా ఉంటుంది.

అయితే గోవు పేడతోనే గొబ్బెమ్మలు తయారు చేసి పెడతారు. ఆవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం ఉంది. అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇందులో క్రిమీ కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుకే గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి ముగ్గులపై అలంకరిస్తారు.
గొబ్బెమ్మలు గోపికలను, పూలరేకులు, పసుపు, కుంకుమలు సౌభాగ్యాన్ని సూచిస్తాయి. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు. సాధారణంగా గొబ్బెమ్మలను పెళ్లికాని అమ్మాయిలు తయారు చేసి, అలంకరించాలి. అలా చేస్తే.. త్వరగా పెళ్లి అవుతుంది. అలాగే మంచి భర్త వస్తాడని నమ్మకం ఉంది.

సంక్రాంతికి భోగిపళ్ల సంప్రదాయం ఎందుకు వచ్చింది ?
నెలరోజులూ రంగురంగుల ముగ్గులు వేసి.. గొబ్బెమ్మలు పెట్టి తర్వాత ఎండబెడతారు. చివరిరోజైన కనుమరోజు గొబ్బెమలను పొయ్యిలో వేసి.. ఆ మంటపై ప్రసాదం తయారు చేసి.. ఆ సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా గొబ్బెమ్మల సంప్రదాయం తెలుగువాకిట్లో సందడి చేస్తోంది.
ఉత్తరాయణం మహా పుణ్యమైంది. ఈ కాలంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, దేవతలకు మహా ప్రీతికరమైనదని చెప్తారు. అందుకే ధనుర్మాసంలో చేసే నదీస్నానం, పూజలు, దానధర్మాలు వెయ్యిరెట్ల ఫలితాన్నిస్తాయి.



Click it and Unblock the Notifications