Latest Updates
-
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
నవరాత్రులు: నాల్గవ రోజు దుర్గదేవి కూష్మాండ రూపం ప్రత్యేకత
మనస్సు నిర్మలంగా ఉండాలంటే మహర్షులు చెప్పిన మార్గాల్లో శక్తి ఆరాధన అతి ముఖ్యమైనది. శక్తి స్వరూపిణి పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే 'పరాశక్తి' ఒక్కటే. పరాశక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వయుజ మాసానికి ఇష మాసం అనే పేరు ఉంది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు.

ఈ మాసంలో నవరాత్రులలో నాల్గొవ రోజున అమ్మవారిని 'కూష్మాండ దుర్గ' గా అలంకరించి పూజిస్తుంటారు. ఈ అమ్మవారు పులిని వాహనంగా కలిగి వుంటుంది. అమ్మవారికి గల ఎనిమిది చేతులు ఆమె శక్తికి నిదర్శనంగా కనిపిస్తూ వుంటాయి. ఈ ఎనిమిది చేతుల్లో విల్లు .. బాణం .. చక్రం .. గద .. తామరపువ్వు .. జపమాల .. కమండలం .. అమృత కలశం కనిపిస్తూ వుంటాయి.
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

జ్ఞానరూపిణి, సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
కూష్మాండ దుర్గాదేవి 8 చేతులతో ఉండి కుడిచేతి వైపు పద్మం, బాణం, ధనుస్సు, కమండలాన్ని, ఎడమ చేతి వైపు చక్రం, గద, జపమాల, అమృతకళశాన్ని కలిగి ఉంటుంది. అష్ట భుజాలు కలిగి ఉన్నందున అష్ట్భుజాదేవిగా పిలుస్తారు. ఈదేవికి (గుమ్మడి కాయ) కూష్మాండ బలి ఎంతో ప్రీతిదాయకమైనది. అందుకే కూష్మాండ దుర్గగా పిలుస్తారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అక్కమహాదేవి అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అర్చక, వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈదేవి చిరునవ్వుతో చరాచర జగత్తును సృష్టించింది. సృష్టి లేకుండా అంతా చీకటిగా ఉన్న సమయంలో బ్రహ్మండాన్ని సృష్టించినందు వల్ల ఈదేవిని సృష్టాది స్వరూపిణిగా, ఆదిశక్తిగా కీర్తిస్తారని వేదపండితులు తెలిపారు. ఈ దేవి సూర్యమండలంలో అంతర్భాగంలో నివశిస్తూ ఉంటుంది. దేవి మేనిచ్చాయ సూర్యసమప్రభతో విరాజిల్లుతూ తేజోవంతంగా అన్ని దిక్కులా ప్రకాశిస్తుంటుంది. ఈదేవి ఉపాసన వల్ల సకల రోగాలు దూరమై ఆరోగ్యం, ఆయుష్సు, యశస్సు వృద్ధి చెందుతాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయని అంటున్నారు.
చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి వదనం ప్రసన్నంగా కనిపిస్తూ వుంటుంది. అలాంటి ఈ తల్లికి అల్లం గారెలు అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. సన్నజాజి పూలమాలికలతో అమ్మవారిని అలంకరించి ... ఆరాధించి .. ఆమెకి ఇష్టమైన అల్లం గారెలను నైవేద్యంగా పెట్టడం వలన ఆ తల్లి సంతోషిస్తుందని చెబుతారు. ఈ అమ్మవారి అనుగ్రహం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.



Click it and Unblock the Notifications