Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
TTD కీలక ప్రకటన..ఆ ఒక్కరోజు వారికి అనుమతి లేదు
తిరుమలలో జరిగే అతిముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి( sri ramakrishna theertha mukkoti)ఒకటి. ప్రతి సంవత్సరం మకర మాసంలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించనున్నారు. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో ఫిబ్రవరి 12న జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై తిరుమల గోకుల మీటింగ్ హాల్ లో TTD అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
ఈ ఏర్పాట్లు తప్పనిసరి
భక్తుల భద్రత, అన్నప్రసాదం, త్రాగునీరు, వైద్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో తిరుమల పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ ఈఈ సుబ్రమణ్యంచ వీజీవో సురేంద్ర, డీఎఫ్ఓ శ్రీనివాసులు తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈవో ఆదేశించారు. టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాపవినాశనం దగ్గర భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం దాకా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వారికి అనుమతి లేదు
ఈ సందర్భంగా ఆస్తమా ప్రాబ్లం ఉన్నవారిని అలాగే ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులను,వృద్ధులను అనుమతించబోమని తెలియజేశారు. తీర్థం దగ్గర పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు. ఫిబ్రవరి 12న ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
పౌర్ణమి గరుడసేవ
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12న తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ఈ రోజున రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.



Click it and Unblock the Notifications











