Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
ఈ కొత్త ఏడాది శివ జపంతో ప్రారంభించండి
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల్లో పరమశివుడు ఒకరు. విశ్వాసంతో పూజించే భక్తులకు ఉదారంగా మోక్షాన్ని ప్రసాదించే స్వామి ఆయన. జనన మరణాల కాల చక్రం నుంచి విముక్తిని ప్రసాదించే దేవుడిగా ఆయన్ను సదా భక్తులు ప్రార్థిస్తారు. పరమ శివుడికి 'మహేశ్వరుడ'ని పేరు. అంటే 'లయకారుడు' అని అర్థం. దయా స్వరూపుడిగా ఆయన్ను కొలుస్తారు.
ప్రశాంత జీవితానికి జపించాల్సిన మంత్రాలు: పరమ శివుడి శక్తిమంతమైన మంత్రాలు జపిస్తే ఈ ఏడాతంతా ప్రశాంతగా సాగిపోతుంది. అదృష్టం కలిసివస్తుంది. సంసార సాగరాన్ని నడిపించే శక్తి వస్తుంది. ఈశ్వరుడి మంత్రాలు పఠిస్తే ఆ స్వామి జీవితంలో వచ్చే కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. ఈ ఏడాది మీ సుఖమయ జీవితం కోసం అందిస్తున్న పరవేశ్వరుడి పవిత్ర మంత్రాలు ఇవి.

'పంచాక్షరీ మంత్రం': 'ఓం నమః శివాయః'. ఈ మంత్రం పటిస్తే మనసులో ద్వేషం, కోపం, స్వార్థం, ఈర్ష, అసూయ, తొందరపాటు పోయి మనసంతా ప్రేమ, సంతోషంతో నిండుతుంది. 108 సార్లు ఈ మంత్రం జపిస్తే ఆత్మ పరిశుద్ధమవుతుంది. దేవుడి అనుగ్రహం కలుగుతుంది.

'రుద్ర శివమంత్రం': 'ఓం నమో భగవతే రుద్రాయ': ఈశ్వరుడి అత్యంత శక్తిమంతమైన మంత్రాల్లో ఇది ఒకటి. భగవంతుడు కరుణించి అనుగ్రహించి కోరికలు తీర్చాలనుకుంటే రోజుకు కనీసం ఒక్కసారైనా ఈ మంత్రం పఠించాలి. కోరిన కోరికలు ఫలించాలంటే ఇంతకు మించిన మరో అద్భుత మంత్రం లేదని అంటారు.

జీవితంపై ప్రభావం చూపే గణేశ మంత్రం: 'ఓం మహాదేవాయ విద్మహే రుద్ర మూర్తయే ధీమహి తన్నో శివ ప్రచోదయాత్': ఈ గాయత్రీ శివ మంత్రం చాలా శక్తిమంతమైంది.ఈ మంత్రం పఠిస్తే పరమ శివుడు సుప్రసన్నుడు అవుతాడు. మనశ్శాంతి కలుగుతుంది.

'శివధ్యాన శివ మంత్రం': 'కర్చరాంకృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా పరధాం విహితం విహితం వా సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహదేవ్ శంభో'
ఈ మంత్రం పఠిస్తే పరమశివుడు తృప్తి చెంది పాపాల నుంచి పరిహరిస్తాడు. ఆత్మ శుద్ధి చేసి జీవితంలో నెలకొన్న నకారాత్మకత అంశాలను తొలగస్తిఆడు. ఈ కొత్త ఏడాది పరమేశ్వరుడిని ప్రార్థించి ప్రశాంతతను పొందండి మరి!



Click it and Unblock the Notifications