Latest Updates
-
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.!
ఈ కొత్త ఏడాది శివ జపంతో ప్రారంభించండి
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల్లో పరమశివుడు ఒకరు. విశ్వాసంతో పూజించే భక్తులకు ఉదారంగా మోక్షాన్ని ప్రసాదించే స్వామి ఆయన. జనన మరణాల కాల చక్రం నుంచి విముక్తిని ప్రసాదించే దేవుడిగా ఆయన్ను సదా భక్తులు ప్రార్థిస్తారు. పరమ శివుడికి 'మహేశ్వరుడ'ని పేరు. అంటే 'లయకారుడు' అని అర్థం. దయా స్వరూపుడిగా ఆయన్ను కొలుస్తారు.
ప్రశాంత జీవితానికి జపించాల్సిన మంత్రాలు: పరమ శివుడి శక్తిమంతమైన మంత్రాలు జపిస్తే ఈ ఏడాతంతా ప్రశాంతగా సాగిపోతుంది. అదృష్టం కలిసివస్తుంది. సంసార సాగరాన్ని నడిపించే శక్తి వస్తుంది. ఈశ్వరుడి మంత్రాలు పఠిస్తే ఆ స్వామి జీవితంలో వచ్చే కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. ఈ ఏడాది మీ సుఖమయ జీవితం కోసం అందిస్తున్న పరవేశ్వరుడి పవిత్ర మంత్రాలు ఇవి.

'పంచాక్షరీ మంత్రం': 'ఓం నమః శివాయః'. ఈ మంత్రం పటిస్తే మనసులో ద్వేషం, కోపం, స్వార్థం, ఈర్ష, అసూయ, తొందరపాటు పోయి మనసంతా ప్రేమ, సంతోషంతో నిండుతుంది. 108 సార్లు ఈ మంత్రం జపిస్తే ఆత్మ పరిశుద్ధమవుతుంది. దేవుడి అనుగ్రహం కలుగుతుంది.

'రుద్ర శివమంత్రం': 'ఓం నమో భగవతే రుద్రాయ': ఈశ్వరుడి అత్యంత శక్తిమంతమైన మంత్రాల్లో ఇది ఒకటి. భగవంతుడు కరుణించి అనుగ్రహించి కోరికలు తీర్చాలనుకుంటే రోజుకు కనీసం ఒక్కసారైనా ఈ మంత్రం పఠించాలి. కోరిన కోరికలు ఫలించాలంటే ఇంతకు మించిన మరో అద్భుత మంత్రం లేదని అంటారు.

జీవితంపై ప్రభావం చూపే గణేశ మంత్రం: 'ఓం మహాదేవాయ విద్మహే రుద్ర మూర్తయే ధీమహి తన్నో శివ ప్రచోదయాత్': ఈ గాయత్రీ శివ మంత్రం చాలా శక్తిమంతమైంది.ఈ మంత్రం పఠిస్తే పరమ శివుడు సుప్రసన్నుడు అవుతాడు. మనశ్శాంతి కలుగుతుంది.

'శివధ్యాన శివ మంత్రం': 'కర్చరాంకృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా పరధాం విహితం విహితం వా సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహదేవ్ శంభో'
ఈ మంత్రం పఠిస్తే పరమశివుడు తృప్తి చెంది పాపాల నుంచి పరిహరిస్తాడు. ఆత్మ శుద్ధి చేసి జీవితంలో నెలకొన్న నకారాత్మకత అంశాలను తొలగస్తిఆడు. ఈ కొత్త ఏడాది పరమేశ్వరుడిని ప్రార్థించి ప్రశాంతతను పొందండి మరి!



Click it and Unblock the Notifications