Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
ఒక్కసారి దర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం..అరుణాచలం వెళ్లాలనుకునేవారికి భారీ శుభవార్త
మనదేశంలోని అత్యంత ప్రసిద్ద శైవక్షేత్రమైన అరుణాచలంకి నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శివుడి అనుగ్రహం పొందేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచలం వెళ్తారు. లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. శివుడు అగ్నిలింగంగా అవతరలించిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి సందర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు.
నిత్యం వందల మంది భక్తులు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి పరమశివుడి అనుగ్రహం పొందుతారు. ఇక్కడ గుడికి దగ్గర్లో ఉన్న రమణ మహర్షి ఆశ్రమం కూడా చాలా ఫేమస్. శివుడి దర్శించుకోడానికి అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా విజిట్ చేస్తుంటారు. అయితే మీరు కూడా అరుణాచలం టూర్ ఫ్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలనుకునే వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ "HYDERABAD-ARUNACHALAM-Telangana Tourism "పేరుతో ఓ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 4 రోజుల టూర్ ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రకారం ప్రయాణం మొత్తం బస్సులోనే ఉంటుంది. ఈ ప్యాకేజీలోనే భాగంగా కాణిపాకం, అరుణాచలం,వేలూరు గోల్డెన్ టెంపుల్ ని సందర్శించే అవకాశం లభిస్తుంది. జనవరి 10, 2025 సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది. నాల్గవ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ కోసం టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్యాకేజీ ధర
ధర విషయానికొస్తే పెద్దలకు ఒక్కొక్కరికి రూ.8000,చిన్నారులకు రూ.6400గా నిర్ణయించారు. తెలంగాణ టూరిజం అధికార వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ కు కాల్ చేయవచ్చు. [email protected] మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.



Click it and Unblock the Notifications