Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఒక్కసారి దర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం..అరుణాచలం వెళ్లాలనుకునేవారికి భారీ శుభవార్త
మనదేశంలోని అత్యంత ప్రసిద్ద శైవక్షేత్రమైన అరుణాచలంకి నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. శివుడి అనుగ్రహం పొందేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచలం వెళ్తారు. లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. శివుడు అగ్నిలింగంగా అవతరలించిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి సందర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు.
నిత్యం వందల మంది భక్తులు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి పరమశివుడి అనుగ్రహం పొందుతారు. ఇక్కడ గుడికి దగ్గర్లో ఉన్న రమణ మహర్షి ఆశ్రమం కూడా చాలా ఫేమస్. శివుడి దర్శించుకోడానికి అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరూ రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా విజిట్ చేస్తుంటారు. అయితే మీరు కూడా అరుణాచలం టూర్ ఫ్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలనుకునే వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ "HYDERABAD-ARUNACHALAM-Telangana Tourism "పేరుతో ఓ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 4 రోజుల టూర్ ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రకారం ప్రయాణం మొత్తం బస్సులోనే ఉంటుంది. ఈ ప్యాకేజీలోనే భాగంగా కాణిపాకం, అరుణాచలం,వేలూరు గోల్డెన్ టెంపుల్ ని సందర్శించే అవకాశం లభిస్తుంది. జనవరి 10, 2025 సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది. నాల్గవ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ కోసం టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్యాకేజీ ధర
ధర విషయానికొస్తే పెద్దలకు ఒక్కొక్కరికి రూ.8000,చిన్నారులకు రూ.6400గా నిర్ణయించారు. తెలంగాణ టూరిజం అధికార వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ కు కాల్ చేయవచ్చు. [email protected] మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.



Click it and Unblock the Notifications











