Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
భారత్ లో మాంసాహారాన్ని నైవేద్యంగా అందించే వింత ఆలయాలు ఏవో తెలుసా?
ఆలయ ప్రసాదం అనగానే మనకు గుర్తుకొచ్చేది లడ్డూ, పులిహోర, చక్కెర పొంగలి వంటి మధురమైన, సాత్విక నైవేద్యాలు. భగవంతుడికి సమర్పించే ప్రతి నైవేద్యం వెనుక అంతులేని భక్తి, ప్రేమ దాగి ఉంటాయి. కానీ మన భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి కొన్ని హద్దులకు, నియమాలకు మాత్రమే పరిమితం కాలేనంత విశాలమైనది, వైవిధ్యమైనది. దేవునికి మాంసాహారాన్ని నైవేద్యంగా పెడతారంటే నమ్ముతారా? భారతదేశంలోని కొన్ని శక్తివంతమైన ఆలయాలలో మాంసాహారం కేవలం నైవేద్యంగానే కాదు, పూజా విధానంలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో చూడండి.
దర్గులా దేవి ఆలయం, ఉత్తర ప్రదేశ్
యూపీ రాష్ట్రంలోని గోరఖ్ పూర్లోని ఈ దర్గులా దేవి ఆలయం చైత్ర నవరాత్రుల సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అమ్మవారికి మేకలను బలి ఇచ్చి, ఆ మాంసాన్ని ఆలయ ప్రాంగణంలోనే పెద్ద పెద్ద మట్టి కుండలలో వండుతారు. అనంతరం దానిని ప్రసాదంగా సామూహిక భోజన రూపంలో భక్తులందరికీ వడ్డిస్తారు. స్థానికులకు ఇది కేవలం పవిత్ర కార్యమే కాదు, ఒక పెద్ద వేడుక కూడా.

పరసినికాడవు ఆలయం, కేరళ
కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో వెలసిన ముత్తప్పన్ దేవుడు సామాన్యుల దేవుడిగా ప్రసిద్ధి. ఇక్కడి భక్తులు తమ దేవుడికి ఎంతో ఇష్టమైన వేయించిన చేపలు, కల్లును నైవేద్యంగా సమర్పిస్తారు. దేవుడు ఈ నైవేద్యాన్ని ఎంతో ఆప్యాయంగా స్వీకరిస్తాడని వారి నమ్మకం. ఇక్కడి ఆచారం కేవలం ఒక సంప్రదాయం కాదు..అది స్థానిక మత్స్యకార వర్గాల దైనందిన జీవితంలో దైవాన్ని భాగం చేసుకునే ఒక అందమైన ప్రక్రియ.
టాంటానియా కాళీబరి, కోల్ కతా
ఆధునిక మాల్స్, కాంక్రీట్ ఫ్లైఓవర్లతో నిండిన కోల్ కతా మహానగరం నడిబొడ్డున ఉన్న ఈ కాళీ ఆలయంలో శతాబ్దాల నాటి సంప్రదాయాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి జంతుబలి ఇచ్చి, ఆ మాంసాన్ని వండి పవిత్ర నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఆధునికత ఎంత వేగంగా విస్తరిస్తున్నా ఈ కాలాతీత ఆచారం నిశ్శబ్దంగా, నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.
విమల ఆలయం,ఒడిషా
ఒడిషా రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథుని ఆలయ ప్రాంగణంలోనే కొలువై ఉన్న శక్తి స్వరూపిణి విమల దేవి. ఈ ఆలయం చిన్నదే అయినా అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా దుర్గా పూజ సమయంలో అమ్మవారికి చేపలు, మేక మాంసాన్ని ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆచారం పూర్తయ్యాక, దానిని బిమల పరుష అనే పవిత్ర ప్రసాదంగా భక్తులకు పంచుతారు. ఆహారం ఏదైనా, సమర్పించే వారిలోని ఉద్దేశ్యం, భక్తి మాత్రమే ముఖ్యమని ఈ సంప్రదాయం మనకు గుర్తుచేస్తుంది.

మునియాండి స్వామి దేవాలయం, తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి సమీపంలోని వడక్కంపట్టి గ్రామంలో ఉన్న మునియాండి స్వామి ఆలయంలో జరిగే ఉత్సవం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఏటా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో వేలాది మేకలు, కోళ్లను స్వామివారికి బలి ఇస్తారు. ఇక్కడ స్వీట్లు, పండ్లు కాకుండా, వేలాది మంది భక్తుల ఆకలి తీర్చేలా ఘుమఘుమలాడే చికెన్, మటన్ బిర్యానీని వండి నైవేద్యంగా సమర్పిస్తారు. తెల్లవారుజామున వడ్డించే ఈ మహా విందును స్వీకరించడానికి చుట్టుపక్కల జిల్లాల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు.
తారాపీఠ్ ఆలయం, పశ్చిమ బెంగాల్
శక్తివంతమైన తాంత్రిక సంప్రదాయాలకు నెలవైన తారాపీఠ్ లో మాంసాహార నైవేద్యాలు సర్వసాధారణం. ఇక్కడ తారా దేవికి మేక మాంసం, షోల్ మాచ్ వంటి రుచికరమైన చేపల వంటకాలను వండి నైవేద్యంగా పెడతారు. సువాసనభరితమైన గ్రేవీతో కూడిన ఈ ప్రసాదాన్ని స్వీకరించడం ఒక సాధారణ భోజనంలా కాకుండా ఏదో ప్రాచీన, నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తిని పొందిన అనుభూతిని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications