Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే..
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకుంటున్నారు. మహా కుంభమేళా ఎఫెక్ట్ తో కొద్దిపాటి సంఖ్యలో భక్తుల రద్దీ తగ్గినప్పటికీ మళ్లీ తిరిగి ప్రారంభమయింది. ఇవాళ మాఘపూర్ణిమ కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. సాయంత్రం వరకు భక్తుల రద్ధీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వామివారి దర్శనం కోసం ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని సమాచారం. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం శ్రీవారి దర్శనానికి సమయం పడుతుంది.

మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 67,192 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,825 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు. మంగళవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ప్రకటించింది. శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.



Click it and Unblock the Notifications