Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే..
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకుంటున్నారు. మహా కుంభమేళా ఎఫెక్ట్ తో కొద్దిపాటి సంఖ్యలో భక్తుల రద్దీ తగ్గినప్పటికీ మళ్లీ తిరిగి ప్రారంభమయింది. ఇవాళ మాఘపూర్ణిమ కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. సాయంత్రం వరకు భక్తుల రద్ధీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వామివారి దర్శనం కోసం ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని సమాచారం. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం శ్రీవారి దర్శనానికి సమయం పడుతుంది.

మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 67,192 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,825 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు. మంగళవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ప్రకటించింది. శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.



Click it and Unblock the Notifications