Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
వెంకటేశ్వర స్వామి మహాత్యం..పులిహోరలో భక్తులకు దర్శనం
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులను కలిగిన వెంకటేశ్వరస్వామిని కలియుగ ప్రత్యక్ష దైవమని అంటారు. శ్రీమహావిష్ణువు కలియుగ అవతారమే వెంకటేశ్వరస్వామి అని చెబుతారు.వెంకట్వేశ్వరస్వామిని తమిళనాడులో బాలాజీ అని, కర్ణాటకలో తిమ్మప్ప అని ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. మన దగ్గర కూడా శ్రీనివాసుడు, వెంకన్న, వెంకటేశ్వరుడు, వేంకటా చలపతి అని వివిధ పేర్లతో వెంకటేశ్వర స్వామిని కొలుస్తుంటారు. దేశంలోని చాలా చోట్ల ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి 10 మందిలో ఇద్దరి పేర్లు వెంకటేశ్వరస్వామి పేరుతోనే ఉంటాయి. శ్రీనివాస్, వెంకటేష్, వెంకటేశ్వరరావు ఇలా స్వామి పేర్లు పిల్లలకు పెడుతుంటారు మన పెద్దలు. కొన్ని వందల ఏళ్లుగా ఇలానే పేర్లు పెట్టబడుతున్నాయి.
తిరుమలలో ఏడుకొండలపై కొలువైన వెంకటేశ్వరుడిని దర్శించుకోడానికి ప్రపంచం నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది తిరుమలకు వెళ్తుంటారు. జీవితంలో ఒక్కసారి అయినా శ్రీవారి దర్శనం చేసుకుంటే చాలు జన్మ ధన్యమైపోతుందని భక్తులు పరితపిస్తారు. ఒక్క హిందువులు మాత్రమే కాదండోయ్..అనేక ఇతర మతాలకు చెందిన అనేకమంది ఇష్టదైవం కూడా వెంకటేశ్వరస్వామినే.
తాజాగా కాకినాడ జిల్లాలోని తునిమండలంలోని ఎస్ అన్నవరం గ్రామంలో 150 కేజీల పులిహారలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు. ధనుర్మాసం సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. గోవింద నామాలు జపిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో పులిహోరలో దర్శనమిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం చెందారు.

ధనుర్మాస ఉత్సవాలు ఎస్.అన్నవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అధ్యంతం రమణీయంగా కొనసాగుతున్నాయి. ఏడాదికి ఒకసారి జరుగు ఈధనుర్మాస ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న భక్తులకు శ్రీవారితో పాటు శ్రీ గోదాదేవి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని అర్చకులు తెలిపారు.



Click it and Unblock the Notifications











