Latest Updates
-
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.!
Vijaya Ekadashi 2025: మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖాలు రావాలంటే..ఫిబ్రవరి 24న ఈ పని చేయండి
సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి నాడు విజయ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ పవిత్రమైన తిథి రోజున విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. విష్ణువు ఆశీస్సులు పొందడానికి ఈ రోజు ఉపవాసం కూడా పాటిస్తారు. మత విశ్వాసం ప్రకారం విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించే వ్యక్తికి జీవితంలో ప్రతి కోరిక నెరవేరుతుంది. మోక్షం, శ్రేయస్సు, విజయం లభిస్తాయి..మానసిక స్థితి మెరుగుపడి, కష్టాలన్నీ తొలగిపోతాయి.
విజయ ఏకాదశి ఎప్పుడు
పంచాంగం ప్రకారం విజయ ఏకాదశి తిథి ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 1:45 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం ఏకాదశి ఫిబ్రవరి 24న వస్తుంది కాబట్టి విజయ ఏకాదశి ఉపవాసం ఫిబ్రవరి 24న మాత్రమే పాటించబడుతుంది. ఈ రోజున ఉపవాసం, దానధర్మాలు చేస్తారు.

విజయ ఏకాదశి ఉపవాసం ప్రత్యేకత
స్కంద పురాణంలో చెప్పినట్లుగా విజయ ఏకాదశి ఉపవాసం పాటించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా వ్యక్తి విజయం సాధిస్తాడు. ఈ ఏకాదశి నాడు శ్రీరాముడు కూడా ఉపవాసం ఉన్నాడు. శ్రీరాముడు సింధు నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు అక్కడ మార్గం ఆగిపోయింది. అక్కడ దల్భ్య మహర్షి ఆశ్రమం ఉంటుంది..రేపు విజయ ఏకాదశి, మీ సైన్యంతో కలిసి ఈ ఉపవాసం ఆచరించమని ముని రాముడికి సలహా ఇచ్చాడు. ఇది సముద్రాన్ని దాటి లంకను జయించడానికి ఒక సులభమైన పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పాడు. రాముడు, లక్ష్మణుడు, వారి సైన్యం ఈ ఉపవాసాన్ని పాటించి లంకను జయించారు. ఈ ఉపవాసం ఆధ్యాత్మిక, భౌతిక విజయానికి ముఖ్యమైనది.
ఈ వస్తువులను దానం చేయండి
విజయ ఏకాదశి రోజున పేదలకు డబ్బు, వస్త్రాలను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున బియ్యం, ఆహార ధాన్యాలు దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేసేవారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున బెల్లం దానం చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications