Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
గురుపౌర్ణమి రోజున ఇలా చేస్తే చంద్ర దోశం పోతుంది..!
ఆషాఢ పౌర్ణమి గురుపౌర్ణమి ఆషాఢ మాసంలో శుక్లపక్ష పున్నమి రోజు జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 20వ తేదీ శనివారం గురుపౌర్ణమి మర్నాడు అంటే జూలై 21 తేదీ పౌర్ణమి స్నానం, దానాలు చేయాలి. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు నివాళులర్పిస్తారు.

పితృ తర్పణాలు విడిచి దానాలు చేస్తారు. సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం ఆషాడ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల పుణ్యం లభిస్తుంది. ఆ రోజున మహాభారతాన్ని మానవాళికి అందించిన వేదవ్యాసుడు జన్మదినోత్సవం. గురువు పట్ల కృతజ్ఞతలు తెలియజేయాలి. గురువు కోసం గౌరవించే సందర్భమే గురుపౌర్ణమి.
ఆషాఢ పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. ఆ రోజున పితృ తర్పణం రోజుగా కూడా పరిగణిస్తారు ఆ రోజు ఉపవాసముండి లక్ష్మీ స్తోత్రం లేదా కనకధారా స్తోత్రం పఠించండి. ఆ రోజు తామర పువ్వులు ఎర్ర గులాబీలు సమర్పించండి.
ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో కుదిరితే పవిత్ర నదిలో స్నానం చేయండి వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేసి ఆవు కాకి కుక్క మొదలైనవాటికి తినిపించండి. పౌర్ణమి రోజున చంద్రుడు పదహారు దశల్లో ఉదయిస్తాడు. చంద్రుణ్ని పూజించండి. పచ్చిపాలు, నువ్వులు నైవేద్యంగా ఇవ్వండి. దీని వల్ల చంద్రదోశం పోతుంది, తెల్లని వస్తువులు దానం చేయాలి. తెల్లని పువ్వులు, బియ్యం, పెరుగు, పాలు లాంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, తేజస్సు, కీర్తీ లభిస్తాయ్.
గురుపౌర్ణమి ఎలా వచ్చిందంటే ?
మహాభారత కావ్యాన్ని రాసిన మహర్షి జన్మదినాన్నే గురుపౌర్ణమిగా పరిగణిస్తాము. ఈ రోజుని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎవరికైనా సరే మొదటి గురువు తల్లి, తరువాత మనకు ఘ్నానాన్ని ప్రసాదించే వ్యక్తి గురువు అవుతారు. అలాంటి అనంత గురువులను గౌరవించడానికే గురు పౌర్ణమి వుంది. గు అంటే అంధకారం లేదా అఘ్నానం, రువు అంటే నిరోధించడం, లేదా నశింపజేయడం, లేక పారద్రోలుట అని అర్థం. అంటే గురువు అన్న పదానికి అఘ్నాానాన్ని నశింపజేయు అని అర్థం. కొత్త విషయాలను చెబుతూ ప్రోత్సహించి మంచి దారిలో పయనించేలా చేసే అందరు గురువులకు గురుపౌర్ణమి రోజున కృతఘ్నతలు తెలిపి వారిని గౌరవించాలి.
గమనిక :పైన ఇవ్వబడిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు పండితుల నుంచి సేకరించినవి, వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications