చిన్న వయసులోనే మరణించడానికి వెనక రహస్యమేముందంటే..!

మనషి 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే పూర్తిగా 100 ఏళ్లు బతుకుతారు. కొంతమంది 80 సంవత్సరాలకే చనిపోతారు, కొందరు 70 మరికందరు 50 ఏళ్లకే కళ్లు మూస్తున్నారు. దీనికి గల కారణమేంటి, ఎందుకు అందరూ 100 సంవత్సరాలు బ్రతకడం లేదు. అటు అనారగ్య సమస్యలు పక్కనబెడితే దీనికి ప్రత్యేక కారణాలు వున్నాయని హిందూ శాస్త్రం పండితులు చెబుతున్నారు. దీనికి పూర్తి సమాధానం మహాభారతంలోని పంచమవేదంలో వుంది. మహాభారతంలో లేనటువంటిది లేదు, ప్రపంచంలో వున్నదంతా మహాభారతంలో వుంది. మహాభారతంలో కేవలం కౌరవులూ, పాండవులూ మాత్రమే కాకుండా వేదాలు, ఉపనిషత్తులు, విష్ణు సహస్రనామాలు, ఇలా ఎన్నో వున్నాయ్. మహాభారదతో యముడు విదురిడిగా జన్మిస్తాడు. దృతరాష్ట్ర మహారాజు ఒక సారి విదురుడిని, ఎందుకు మానవులు పూర్తిగా వంద సంవత్సరాలు బ్రతకడం లేదని అంటాడు.

why-a-person-dies-in-early-age-according-to-hindu-sastra

ఎదుటివారు ఎదిగిపోతున్నాడనే ఈర్శ్య, అతనికి డబ్బు వుంది, వాళ్లకు బంగారం వుంది, నాకేమీ లేవు అని వారిపై ఈర్శ్యపడుతుంటారు. ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించి వీరి ఎదుగుదలను విడిచిపెడతారు. కొంతమంది ఎప్పుడూ ఎదుటివారి గురించి ఆలోచిస్తూ వుంటారు. చితి ప్రాణం లేని శరీరాన్ని మాత్రమే కాల్చివేస్తుంది. చింత బ్రతికున్న శరీరాన్ని కూడా కాల్చివేస్తుంది. ఎదుటివారిని చూసి ఈర్శ్య పడ్డం ద్వారా మన ఆయుశ్వు తగ్గిపోతుంది. అతిగా మాట్లాడ్డం వల్ల కూడా ఆయుశ్వు తగ్గిపోతుంది. అతిగా మాట్లాడినప్పుడు ఉచ్ఛాస నిశ్వాసలు ఎక్కువగా తీసుకుంటాము. ఆయుశ్వు సంవత్సరాలను బట్టి వుండదు, ఉచ్వాస నిశ్వాసను బట్టి వుంటుంది. ఎక్కువగా గాలి పీల్చుకొని గాలి వదిలేస్తే మన ఆయుర్ధాయం తగ్గిపోతుంది. కుక్క ఎక్కువగా గాలి పీల్చుకోవడం వల్ల త్వరగా అది త్వరగా మరణిస్తుంది.

మనము కూడా ఊపిరిని చాలా తీసుకొని వదిలేస్లే త్వరగా మరణిస్తాం. హిమాలయాల్లో ఎంతో మంది యోగలు 200 ఏళ్ల వరకు బ్రతుకుతారు. దీనికి కారణం వాళ్లు శ్వాస మీద ధ్యాస పెట్టడమే. శ్వాస మీద ధ్యాస పెట్టి ఊపిరిని గట్టిగా తీసుకొని నెమ్మదిగా ఓంకారం జపిస్తూ వదుల్తారు కాబట్టి వాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు. ఎక్కువ గాలిని పిల్చుకొని ఎక్కువ వదిలేస్తాం కాబట్టి ఆయుశ్వు తగ్గిపోతుంది. ఎంత మాట్లాడాలో అంత మాత్రమే ఎక్కువగా మాట్లాడ్డం కూడా మంచిది కాదు. నోరు వుంది కదా అని విపరీతంగా మాట్లాడితే పదిమందిలో చులకన అయిపోతాం.

why-a-person-dies-in-early-age-according-to-hindu-sastra

దానం చేయకపోతే కూడా ఆయుశ్వు క్షీనిస్తుంది. దానం చేయడం వల్ల కర్మ నశిస్తుంది. కాస్త అన్నదానం చేయడం వల్ల వాళ్లు వచ్చి ఆశీర్వదిస్తారు అప్పుడు కర్మ నశించి ఆయుశ్వు పెరుగుతుంది. బ్రహ్మణుల నుంచి ఆశీర్వాదం పొందినా సరే ఆయుశ్వు పెరుగుతుంది. మనము ఎవరికైనా వస్త్ర దానం చేసినా, గోదానం చేసినా, భూదానం చేసినా కర్మ క్షీణిస్తుంది, ఆయుష్షు పెరుగుతుంది. దానం చేయకుండా మన భార్యా బిడ్డలే బాగుండాలని అనుకుంటే మన ఆశుష్శే తగ్గుతుంది. భూమి మీదకు వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాము, వెళ్లేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్లము. కాబట్టి పండగలప్పుడు బ్రహ్మణులకు, పేదలకు దానం చేయాలి. క్రోదం ఎక్కువగా వుండడం వల్ల కూడా ఆయుశ్షు తగ్గుతుంది. తన కోపమే తన శత్రువు అని పెద్దలు అన్నారు కాబట్టి కోపాన్ని కూడా తగ్గించుకోవాలి. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగి అనరోగ్యం పాలవుతాము.

Story first published: Sunday, June 30, 2024, 15:39 [IST]
Desktop Bottom Promotion