Latest Updates
-
పిండి రుబ్బే పనిలేదు..అప్పటికప్పుడు ఐరన్, కాల్షియం నిండిన దూదిలాంటి మెత్తని రాగి ఇడ్లీ ..కొబ్బరి చట్నీతో కేక! -
పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం..మీ ఫ్రెండ్స్, బంధువులకు బెస్ట్ ఉగాది విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇలా.. -
Ugadi Pachadi Recipe: కేవలం పచ్చడి కాదు, దివ్యౌషధం..పక్కా కొలతలతో సంప్రదాయ ఉగాది పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా? -
ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే. -
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ! -
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే!
శివుడు పార్వతి ఎదుటే మోహినిపై ఎందుకు మోజుపడ్డాడు? వారిద్దరికీ జన్మించిన బిడ్డ ఎవరు?
మోహిని నాట్యం చూసి భస్మారుడు మైమరిచిపోతాడు. మోహిని ఎలా చేస్తే అలా చేస్తూ తన తలపైనే చెయ్యిపెట్టకుని చనిపోతాడు భస్మాసురుడు. అలా తన చావును తానే కొనితెచ్చుకుంటాడు భస్మాసురుడు.
శివపార్వతుల గురించి అందరికీ తెలిసిందే. వారి ప్రేమ ఎంతో పవిత్రం. శివుడు ఏకంగా తన శరీరంలో సగ భాగాన్ని పార్వతికే ఇచ్చాడు. అంత ప్రేమ వారిది. మరి ముక్కంటి మరో ఆమెపై మోజు పడ్డాడంటే నమ్మలేము. కానీ నమ్మక తప్పదు. శివుడు కూడా ఇతర అమ్మాయి మోజులో పడ్డాడు.
మోహిని అందం చూసి పరమశివుడు పరవశించాడు. దేవుళ్లు కూడా అలా చేస్తారా? అంటే కొన్ని కారణాల వల్ల, లోకకల్యాణార్థం దేవుళ్లు అలా చేస్తారు. భస్మాసురుడు మహాశివుడి ద్వారా ఒక వరం పొందుతాడు. తనకు ఎవరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు. అలాగే తను చెయ్యి పెడితే చాలు భస్మం కావాలని కోరుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో శివుడు కూడా ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.

భస్మాసురుడి దగ్గరకు వెళ్లి
దీంతో భస్మాసురుడు అన్ని లోకాలను వారిని గడగడలాడించాడు. సో.. దేవతలంతా ముక్కంటి దగ్గరకు వెళ్లారు. శివా నువ్వే మమ్మల్ని రక్షించాలని కోరాడు. శివుడు భస్మాసురుడి దగ్గరకు వెళ్లి బుజ్జగించాలని చూశాడు. శివుణ్ని కూడా భస్మం చెయ్యడానికి చెయ్యి ఎత్తాడు భస్మాసురుడు. వామ్మో.. ఇది ఏందో కొంచెం తేడాగా ఉందని అనుకున్నాడు శివుడు.

నన్నే భస్మం చేయాలనుకుంటాడా
వీనికి నేను వరం ఇస్తే నన్నే భస్మం చేయాలనుకుంటాడా అని అనుకున్నాడు. ఇక లాభం లేదు వీన్ని అంతం చెయ్యాల్సిందే అనుకున్నాడు. విష్ణు మూర్తి దగ్గరకి వెళ్లి ఆలోచించాడు. ఎలా అయినా సరే భస్మాసురుడిని అంతం చెయ్యాలనుకుంటున్నానని చెబుతాడు.

మోహినీ తన అందచందాలను చూపించి
భస్మాసురుడిని అంతం చేసేందుకు మహావిష్ణువే మోహినిగా అవతరిస్తాడు. పాల కడలి వల్ల రాక్షసులకే అమృతం అభిస్తుంది. మోహినీ తన అందచందాలను చూపించి అసురుల నుంచి అమృతాన్ని తీసుకొస్తుంది.
ఇక మోహినిని చూసిన భస్మాసురుడు ఆమెపై మోజు పడతాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. సరే, కానీ నాకు నాట్యం అంటే ఇష్టం. నేను అలా చేస్తే నువ్వు అలా చేస్తే పెళ్లి చేసుకుంటాం అంటుంది మోహిని.

భస్మారుడు మైమరిచిపోతాడు
ఇక మోహిని నాట్యం చూసి భస్మారుడు మైమరిచిపోతాడు. మోహిని ఎలా చేస్తే అలా చేస్తూ తన తలపైనే చెయ్యిపెట్టకుని చనిపోతాడు భస్మాసురుడు. అలా తన చావును తానే కొనితెచ్చుకుంటాడు భస్మాసురుడు. అంత వరకు శివుడు, విష్ణువు వేసుకున్న ప్లాన్ మొత్తం ఒకే అయిపోయింది. అయితే మళ్లీ శివుడు మోహిని అందాన్ని చూడాలనుకుంటాడు.

మోహిని అందంపై మోజుపడతాడు శివుడు
సరే అని విష్ణువు మోహినిగా వస్తాడు. మోహిని అందంపై మోజుపడతాడు శివుడు. మోహినిని తన కౌగిళ్లలోకి తీసుకుని బంధిస్తాడు. ఆమెతో రాసక్రీడ సాగిస్తాడు. దీంతో మోహినికి, శివుడికి శ్రీ ధర్మశాస్తా పుడతాడు. మహిషి సంహరణ కోసమే శివుడు అలా చేస్తాడు. లోక కల్యాణార్థం శివుడు చేసిన ఈ పనిని చూసిన గమనించిన పార్వతి కాస్త శివుడిపై అలుగుతుంది. కానీ తర్వాత మళ్లీ శివుడు అసలు విషయం చెప్పేసరికి అర్థం చేసుకుంటుంది.



Click it and Unblock the Notifications











