Just In
- 3 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 4 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- 7 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 9 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
శివుడు పార్వతి ఎదుటే మోహినిపై ఎందుకు మోజుపడ్డాడు? వారిద్దరికీ జన్మించిన బిడ్డ ఎవరు?
మోహిని నాట్యం చూసి భస్మారుడు మైమరిచిపోతాడు. మోహిని ఎలా చేస్తే అలా చేస్తూ తన తలపైనే చెయ్యిపెట్టకుని చనిపోతాడు భస్మాసురుడు. అలా తన చావును తానే కొనితెచ్చుకుంటాడు భస్మాసురుడు.
శివపార్వతుల గురించి అందరికీ తెలిసిందే. వారి ప్రేమ ఎంతో పవిత్రం. శివుడు ఏకంగా తన శరీరంలో సగ భాగాన్ని పార్వతికే ఇచ్చాడు. అంత ప్రేమ వారిది. మరి ముక్కంటి మరో ఆమెపై మోజు పడ్డాడంటే నమ్మలేము. కానీ నమ్మక తప్పదు. శివుడు కూడా ఇతర అమ్మాయి మోజులో పడ్డాడు.
మోహిని అందం చూసి పరమశివుడు పరవశించాడు. దేవుళ్లు కూడా అలా చేస్తారా? అంటే కొన్ని కారణాల వల్ల, లోకకల్యాణార్థం దేవుళ్లు అలా చేస్తారు. భస్మాసురుడు మహాశివుడి ద్వారా ఒక వరం పొందుతాడు. తనకు ఎవరి చేతిలో మరణం ఉండకూడదని కోరుతాడు. అలాగే తను చెయ్యి పెడితే చాలు భస్మం కావాలని కోరుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో శివుడు కూడా ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.
భస్మాసురుడి దగ్గరకు వెళ్లి
దీంతో భస్మాసురుడు అన్ని లోకాలను వారిని గడగడలాడించాడు. సో.. దేవతలంతా ముక్కంటి దగ్గరకు వెళ్లారు. శివా నువ్వే మమ్మల్ని రక్షించాలని కోరాడు. శివుడు భస్మాసురుడి దగ్గరకు వెళ్లి బుజ్జగించాలని చూశాడు. శివుణ్ని కూడా భస్మం చెయ్యడానికి చెయ్యి ఎత్తాడు భస్మాసురుడు. వామ్మో.. ఇది ఏందో కొంచెం తేడాగా ఉందని అనుకున్నాడు శివుడు.
నన్నే భస్మం చేయాలనుకుంటాడా
వీనికి నేను వరం ఇస్తే నన్నే భస్మం చేయాలనుకుంటాడా అని అనుకున్నాడు. ఇక లాభం లేదు వీన్ని అంతం చెయ్యాల్సిందే అనుకున్నాడు. విష్ణు మూర్తి దగ్గరకి వెళ్లి ఆలోచించాడు. ఎలా అయినా సరే భస్మాసురుడిని అంతం చెయ్యాలనుకుంటున్నానని చెబుతాడు.
మోహినీ తన అందచందాలను చూపించి
భస్మాసురుడిని అంతం చేసేందుకు మహావిష్ణువే మోహినిగా అవతరిస్తాడు. పాల కడలి వల్ల రాక్షసులకే అమృతం అభిస్తుంది. మోహినీ తన అందచందాలను చూపించి అసురుల నుంచి అమృతాన్ని తీసుకొస్తుంది.
ఇక మోహినిని చూసిన భస్మాసురుడు ఆమెపై మోజు పడతాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. సరే, కానీ నాకు నాట్యం అంటే ఇష్టం. నేను అలా చేస్తే నువ్వు అలా చేస్తే పెళ్లి చేసుకుంటాం అంటుంది మోహిని.
భస్మారుడు మైమరిచిపోతాడు
ఇక మోహిని నాట్యం చూసి భస్మారుడు మైమరిచిపోతాడు. మోహిని ఎలా చేస్తే అలా చేస్తూ తన తలపైనే చెయ్యిపెట్టకుని చనిపోతాడు భస్మాసురుడు. అలా తన చావును తానే కొనితెచ్చుకుంటాడు భస్మాసురుడు. అంత వరకు శివుడు, విష్ణువు వేసుకున్న ప్లాన్ మొత్తం ఒకే అయిపోయింది. అయితే మళ్లీ శివుడు మోహిని అందాన్ని చూడాలనుకుంటాడు.
మోహిని అందంపై మోజుపడతాడు శివుడు
సరే అని విష్ణువు మోహినిగా వస్తాడు. మోహిని అందంపై మోజుపడతాడు శివుడు. మోహినిని తన కౌగిళ్లలోకి తీసుకుని బంధిస్తాడు. ఆమెతో రాసక్రీడ సాగిస్తాడు. దీంతో మోహినికి, శివుడికి శ్రీ ధర్మశాస్తా పుడతాడు. మహిషి సంహరణ కోసమే శివుడు అలా చేస్తాడు. లోక కల్యాణార్థం శివుడు చేసిన ఈ పనిని చూసిన గమనించిన పార్వతి కాస్త శివుడిపై అలుగుతుంది. కానీ తర్వాత మళ్లీ శివుడు అసలు విషయం చెప్పేసరికి అర్థం చేసుకుంటుంది.