For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీనివాసుడికి శనివారమే ఎందుకు ప్రీతికరం ?

By Swathi
|

పురాణాలలో ఏయే వారాలలో ఏ దేవుని పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు. అంటే.. ఆదివారం సూర్యభగవానుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రమణ్యస్వామి, ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్పస్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. ఇలా ఒక్కో రోజుని ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడింది.

వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావడంతో.. ఆ రోజు ఆ దేవుడికి పూజలు, దర్శనాలు చేసుకుంటారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. ప్రతి భక్తుడు ఆ అలంకారప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తాడు. ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం ? ఆ రోజే ఏడుకొండల వాడిని పూజించాలా ? మిగిలిన రోజుల్లో శ్రీనివాసుడి కరుణాకటాక్షాలు పొందలేమా ?

venkateswara

సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం, శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావడం, వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం కావడం, ఆలయం నిర్మాణం చేయమని శ్ర్రీనివాసుడు తొండమాను చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావడంతో వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది.

అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసినది కూడా శనివారమే కావడం విశేషం. అంతేకాదు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడినది కూడా శనివారం అవడంతో శనివారానికి, శ్రీనివాసుడికి గట్టి బంధం ఏర్పడింది. అలాగే శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు కూడా శనివారం అవడంతో.. ఆ ఏడుకొండల స్వామి వేంకటేశ్వరునికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైనది. అందుకే ప్రతి భక్తుడూ శనివారమే.. ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటాడు.

Story first published: Saturday, January 16, 2016, 17:02 [IST]
Desktop Bottom Promotion