Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Yogini Ekadashi 2020 : ఈరోజున 88 వేల మంది బ్రాహ్మాణులకు ఆహారం ఇవ్వడంతో సమానమట...!
యోగిని ఏకాదశి 17వ తేదీ రాబోతోంది. ఈ సందర్భంగా యోగిని వ్రత కథతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
హిందూ ధర్మం ప్రకారం యోగిని ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఇది జూన్ నెలలో 17వ తేదీన వచ్చింది. ఈ పండుగ రోజున ఉపవాస దీక్ష చేస్తే 88 వేల మంది బ్రాహ్మాణులకు ఆహారం ఇవ్వడానికి సమానం అని పురాణాలు చెబుతున్నాయి.

ఇంతకీ యోగిని ఏకాదశి నాడు ఏ దేవుడిని పూజించాలి.. ఏ సమయంలో పూజ చేయాలి. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతతో పాటు ఉపవాస దీక్ష ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

యోగిని ఏకాదశి తేదీ
హిందూ పంచాంగం ప్రకారం, క్రిష్ణ పక్షం యొక్క ఏకాదశిని యోగిని ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ యోగిని ఈ సంవత్సరం జూన్ నెలలో 17వ తేదీన వచ్చింది.

యోగిని ఏకాదశి ఉపవాసం
అయితే ఈ యోగిని ఏకాదశిని రెండురోజుల పాటు జరుపుకుంటారు. 16వ తేదీన ఉదయం 05:40 నుండి మొదలై 17వ తేదీ ఉదయం 7 గంటల 50 నిమిషాలకు ముగుస్తుంది.

పూజా విధానం..
- యోగిని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.
- స్నానం చేసిన తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి.
- ముందుగా మీ ఇంటిని శుభ్రపరచుకోవాలి.
- అన్నిటికంటే ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి.
- తర్వాత విష్ణువు విగ్రహం లేదా చిత్రపటం ఎదుట దీపం వెలిగించాలి.
- విష్ణువు ఆరాధనలో తులసి ఆకులను వాడాలి.
- ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో కూడా విష్ణుమూర్తి ముందు దీపం వెలిగించాలి.
- విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
- మీ స్తోమతకు తగ్గట్టు బ్రాహ్మాణులకు లేదా పేదలకు ఆహారాన్ని అందివ్వాలి.
- అలాగే ఆర్థిక సహాయం కూడా చేయొచ్చు.
- ఈ పవిత్రమైన తక్కువ ఆహారం తీసుకోవాలి.
- పవిత్రమైన వస్త్రాలు ధరించాలి.
- స్వామి వారిని ఇంట్లో పూజించిన తర్వాత, మర్రిచెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేయాలి.
- మాంసాహారం జోలికి అస్సలు పోకూడదు.

ఉపవాసం ఎప్పుడు ముగించాలంటే..
మీరు చేపట్టిన ఉపవాస దీక్షను సూర్యాస్తమయం తర్వాత విరమించాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయానికి ఉపవాసాన్ని విరమించకూడదు. దీని వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ లభిస్తాయి.

యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం ఓ పూల తోటలో హేమ్ అనే తోటమాలి ఉన్నాడు. తను పనిలో పడిపోయి ఒక తప్పు చేస్తాడు. దీంతో ఆ వ్యక్తి శాపగ్రస్తుడవుతాడు. ఈ కారణంగా అతనికి కుష్టు వ్యాధి వస్తుంది. అతడిని చూసిన ఒక సాధువు యోగిని ఏకాదశి నాడు ఉపవాసం చేయమని సూచిస్తాడు. ఆ సాధువు చెప్పినట్టు దీక్ష చేయడంతో అతని కుష్టువ్యాధి నయమైందనీ.. అందుకే యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు 88 వేల మంది బ్రాహ్మాణులకు ఆహారం ఇచ్చినంత సమానమని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే మోక్షం కూడా లభిస్తుందట.




Click it and Unblock the Notifications