Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
శనిదోషంతో ఇబ్బంది పడుతున్నారా?.. నివారణకు ఎలాంటి పనులు చేయాలంటే?
జాతకంలో శని దోషం కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు. ఏ పని తలపెట్టినా అది పూర్తవదు. శనిదోషం వల్ల కలిగే పరిణామాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి. అయితే శని దోషం నివారించడానికి గల మార్గాలు, మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనిదోషం అంటే ఏంటి?
నవ గ్రహాల్లో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శని గ్రహాన్ని కర్మ ప్రదాత అని కూడా పిలుస్తారు. శని చాలా మందగస్థుడు. నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాడు. ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి శనీశ్వరుడు సుమారు రెండున్నర ఏళ్ళు తీసుకుంటాడు. ఈ సమయంలో శని ఎవరి జాతకంలో అయితే ఉంటాడో.. ఆ జాతకస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. శని దోషంలో రెండు రకాల దోషాలు ఉంటాయి. అర్ధాష్టమ శని, ఏలినాటి శని. అర్ధాష్టమ శని రెండున్నర ఏళ్లు ఉంటుంది. అదే ఏలినాటి శని సుమారు ఎనిమిదేళ్ల పాటు ఉంటుందని జాతక నిపుణులు చెబుతుంటారు. శనిదోషం ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత మంచి పనులు చేయాలని చెబుతుంటారు.

శని దోషాన్ని ఎలా నివారించాలి:
శనిదోషం వచ్చిందంటే.. శని ఆ జాతకంలో నుంచి వెళ్లేంత వరకు ఆ దోషం పోదు. కాకపోతే కొన్ని నివారణ మార్గాల ద్వారా మనం దోషానికి సంబంధించిన ప్రభావాన్ని కొంతమేర తగ్గించొచ్చు. అందుకోసం కొన్ని మంత్రాలకు పఠిస్తే ప్రయోజనం చేకూరుతుంది. 'ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్., ఉర్వారుక్ మివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మా మృతాత్' అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఫలితం చేకూరే అవకాశముంది.
ఎలాంటి పనులు చేయాలి:
శని దోషం పోవాలంటే మంత్రాలను పఠించడంతో పాటు కొన్ని రకాల పనులు చేయాల్సి ఉంటుంది. శనివారం రోజున దాన ధర్మాలు నిర్వహిస్తే శనీశ్వరుడు ఆశీస్సులు లభిస్తాయి. నల్ల వస్తువులు, నల్ల ఉసిరి, నల్ల నువ్వులు, ఆవాలు, నల్ల నువ్వుల నూనె, ఇనుప వస్తువులను దానం చేయడం ద్వారా.. శని దోషం చాలా వరకు తొలిగే అవకాశముంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలు కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుల సహాయాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











