Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
శివరాత్రి నుంచి ఈ మూడు రాశుల వారి జీవితం మూడు పూలు ఆరు కాయలుగా మారుతుంది!
హిందూ మతంలో రాశి ఫలాలకు ప్రాముఖ్యత ఉంది. అలాగే మాస శివరాత్రికి కూడా అంతే ప్రత్యేకత ఉంది. ప్రతినెలా వచ్చే మాస శివరాత్రి రోజు భక్తులు ఉపవాసంతో ఉండడంతో పాటు ఆది దంపతులైన శివ పార్వతుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శివ పార్వతుల ఆశీస్సులు తమపై ఉంటాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర నెలలో వచ్చే మాస శివరాత్రి పలు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. మరీ ముఖ్యంగా మూడు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రానుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాస శివరాత్రి ఎప్పుడొస్తుంది అంటే
జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మార్గశిర నెలలో మాస శివరాత్రి డిసెంబర్ 29వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 30వ తేదీన ముగుస్తుంది. ఈ మాస శివరాత్రి తిథి డిసెంబర్ 29 తెల్లవారుజామున 3.32 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 30న ఉదయం 4:01 గంటలకు ముగుస్తుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈనెల 29వ తేదీన మాస శివరాత్రి జరుపుకోవాలని పండిత నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మాస శివరాత్రి పలు అదృష్ట యోగాలను పలు రాశుల వారికి తీసుకురానుంది. ఆ రాశులు ఏవంటే?

సింహ రాశి:
సింహ రాశి జాతకులకు ఈ మాస శివరాత్రి నుంచి దశ తిరగనుంది. వీరికి అనేక విధాలుగా ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెలలో భారీగా లభ్ది పొందుతారు. వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అంతే కాదు ప్రేమలో ఉన్న వ్యక్తుల ప్రేమ విజయవంతం అవుతుంది. అలాగే కోల్పోయినవన్నీ దక్కే అవకాశం ఉంటుంది.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ మాస శివరాత్రి నుంచి భారీగా ఆర్ధిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి సంపద, శ్రేయస్సుతో పాటు అనేక విధాలుగా ఆదాయం చేకూరనుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే కుటుంబంలోని సమస్యలన్నీ తీరిపోతాయి. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. అయితే ఈ రాశి వారు గంగాజలంతో నల్ల నువ్వులను కలిపి శివయ్యకు జలాభిషేకం చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుతారు.
మిధున రాశి:
ఈ మిథున రాశి జాతకులకు ఈ మాస శివరాత్రి నుంచి శుభఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ రాశి వారికి శివుడి విశేషమైన ఆశీస్సులు ఈ రాశి వారికి లభిస్తాయి. అలాగే ఈ రాశి వారు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఇల్లు లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు పెడతారు. సమాజంలో ఉత్తమమైన ప్రతిభను కనబరిచి మంచి గుర్తింపును తెచ్చుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications