Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పాదాల పగుళ్లుకు సలభమైన...చక్కటి చిట్కాలు..!

1. గోరువెచ్చని నీరు తీసుకొని అందులో నిమ్మరసం కొన్ని చుక్కలు చేర్చి మీ పాదాలను 5-10నిమిషాలపాటు అందులో ముంచాలి(పాదాలు పూర్తిగా మునిగేటట్లు చేయాలి). తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి ఆపై మాయిశ్చరైజర్ రాసి తర్వాత నిద్రకు ఉపక్రమించాలి.
2. గోరువెచ్చని నీటిలో తేలికపాటి షాంపూను కొన్ని చుక్కలను వేసి, అందులో మీ పాదాలను కొద్దిసేపు నానే విధంగా చూసుకోవాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ (సున్నితమైనటువంటి రాయి)తో రుద్ది శుభ్రపరుచుకొంటే చర్మం మీద ఉండే పొడిబారిన, రఫ్ గా ఉన్న కణాలు తొలగిపోయి పాదాలను సున్నితంగా, నునుపుగా మారుతాయి. షాంపూతో శుభ్రం చేసుకొన్న తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ లేదా నూనెను రాయడం మర్చిపోకండి.
3. ప్రతిరోజూ స్నానం చేసినప్పుడు ప్యూమిస్ స్టోన్ తో కాలి మడమలను రుద్దితే పగుళ్లు సులభంగా పోగొట్టవచ్చు.
4. పాదాల పగుళ్లకు పొడి చర్మం కూడా ఒక ప్రధాన కారణమే. కాబట్టి పాదాల చర్మం ఎప్పుడూ తడిగా ఉండేట్లు చూసుకోవాలి. అందుకోసం ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజలర్ రాయాలి.
5. పాదాల పగుళ్లకు తేనె కూడా బాగా పనిచేస్తుంది. కొదిగా గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల తేనె, మరికొన్ని చుక్కల నిమ్మరసం కలిపి అందులో పాదాలను 10-15నిమిషాల పాటు నాననిచ్చి తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రం చేసి మాయిశ్చరైజర్ లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే పాదాల పగుళ్లు పోయి కోమలమౌనటువంటి పాదాలు మీ సొంతం అవుతాయి.
6. గోరువెచ్చని నీళ్లలో బేకింగ్ సోడా రెంచు చెంచాలు వేసి అందులో పాదాలు నాన్చి శుభ్రం చేస్తే మృతకణాలు తొలగిపోయి. పాదాలు సున్నితంగా తయారవుతాయి. ఇది ఒకరకంగా సహజసిద్దమైనటువంటి ఔషదంలా పనిచేసి కాలుకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి.



Click it and Unblock the Notifications











