పసుపుతో మిలమిల మెరిసే పాదాలు...!

Body Care
ఆరోగ్యమైన జీవనం కోసం పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మొత్తం అందంలో పాదాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా నీటిలోని మురికి, సబ్బుల్లోని ఘాటైన రసాయనాలు చర్మానిక హాని చేస్తాయి. ఆ ప్రభావం పడకుండా ఈ క్రింది చిట్కాలతో పాదాలను అందంగా ఆరోగ్యంగా ఉంచవచ్చు.

పసుపు శుభానికి ప్రతీక. ''ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ' అని మన కవులు రాశారు. అందం, ఆరోగ్యం కూడా. ఏ పనిలోనైనా పసుపుదే ప్రథమస్థానం. స్త్రీలకి, పసుపుకి అనుబంధం వున్నదన్న సత్యం జగమెరిగినదే. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.

1. తరచూ పాదాలు ఇన్ఫెక్షణ సమస్యతో బాధపడేవారు నీటికి, రసాయనాలకు దూరంగా ఉండాలి. వీరికి కొన్ని రకాల సబ్బులు, సంబంధిత ద్రవ్యాలు పడువు. దుస్తులు ఉతికే సబ్బులకు, మురికి నీళ్లకు తరచూ నీటిలో పనిచేయడానికి దూరంగా ఉండాలి.

2. గట్టిగా కాకుండా మెత్తని చెప్పులు వేసుకోవడం అలావటు చేసుకోవాలి. మురికి, బురద నీళ్లలో తిరిగినప్పుడు గోరువెచ్చనిటి నీళ్లతో పాదాలను శుభ్రంగా కడగాలి. దాంతో ఫంగల్ ఇన్ ఫెక్షణ్ భాదించదు. కాటన్ సాక్సులు వాడటం మంచిది. వాటి వల్ల పాదాలకు చల్లదనం. పగుళ్లు దూరమవుతాయి.

3. పసుపు చర్మానికి మంచి ఔషదం. ఒక టీస్సూన్ కొబ్బరి నూనెలో పసుపు కలిపి రాస్తే పాదాల సమస్యలు తగ్గుతాయి. మంచినీళ్లు, ఆకు కూరలు, పండ్లు, పప్పుదాన్యాలు, ఎండుఫలాలు బాగా తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

4. నువ్వుల నూనెలో తేనెమైనం, వేపాకుల పొడితో పాటు కలబండ గుజ్జు కలిపితే పాదాలకు మంచి మృదుత్వం వస్తుంది. ఆలివ్ నూనెలో చిటికెడు పసుపు కలిపి రాస్తే ఫలితం ఉంటుంది. పెట్రోలియం జెల్లీలో కలబంద, వేప, పసుపు కలిపి రాయవచ్చు.

5. కొబ్బరి నూనెలో చిటికెడు కర్పూరం, పసుపు వేపపొడి కలిపి రాసినా ఇన్ ఫెక్షన్, సొరియాసిస్, పాదాల వాపులు తగ్గుతాయి.

6. పాదాలను రొజూ గోరువెచ్చని నీటిలో శుభ్రపరచుకోవాలి. పాదాలను పూర్తిగా తడి ఆరనివ్వాలి, ముఖ్యంగా వేళ్ళ మధ్య.

7. పాదాలకి సరిగ్గా సరిపడే బూట్లను వాడాలి. బూటు లోపల వెళ్ళకు సరిపడా ఖాళీ ఉండాలి.

8. రోజూ పాదాలకు (వేళ్ళ మధ్య తప్ప) మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలా రాయడం వల్ల పగుళ్ళను నివారించవచ్చు. వేళ్ళ మధ్య మాయిశ్చరైజర్ రాయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

9. ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిముషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.

10. కరక్కాయచూర్ణం, పసుపు కలిపి కాళ్ళకు పూసినట్లయితే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి. కాళ్లునల్లగా మారడం, పాచిపట్టడం (నీటిలోనానితే) తగ్గుతుంది.

Story first published: Thursday, April 19, 2012, 18:02 [IST]
Desktop Bottom Promotion