Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు...?

ఈ సమస్యతో బాధపడుతున్న వారు మాటిమాటికీ తినడం కాకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకొనేలా ధ్యాసను నియంత్రించుకోవాలి. కడుపు నిండిన భావన కలగగానే ఆపేయాలి. అంతే కాదు హడావుడిగా కాకుండా నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమివ్వాలి. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలకు తావివ్వకుండా చూసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం వల్ల మేలు చేసే హార్మోన్లు శరీరంలోకి విడుదలవుతాయి. అంతే కాదు ఎక్కువ ఆహారం తీసుకోవడానికి కారణమయ్యే ఒత్తిడి, కుంగుబాటుతో పోరాడే శక్తి ఈ హార్మోన్ల సొంతం. ఆకలి అనిపించినప్పుడు అదే పనిగా కాఫీలు, నూనె పదార్థాల వైపు మొగ్గు చూపితే రకరకాల అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశముంటుంది. ఇవి తీసుకోవాలనిపించినప్పుడు వాటికి బదులుగా గోరువచ్చటి నీళ్లు.. లేదా అందులో నిమ్మరసం, కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది.
జంక్ ఫుడ్, వేపుళ్ల వంటివి తినాలనిపించినప్పుడు వాటికి ప్రత్యామ్నాయ పదార్థాలు ఎంచుకోవాలి. పేస్ట్రీకి బదులు తియ్యని మామిడి పండు ముక్కలకు ప్రాధాన్యమిస్తే సరి. అంతే కాదు కెలొరీలు లభించని ఈ పండు వల్ల ఊబకాయం సమస్యా ఉండదు. అదే సమయంలో కూరగాయ ముక్కల పైన ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే బాగుంటుంది.
తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు పండ్ల ముక్కలు, బ్రెడ్డు.. వంటి వాటి మీద తేనె చేర్చి తింటే సహజ చక్కెర్లు శరీరానికి అందే అవకాశం ఉంటుంది. ఆహారం తినేటప్పుడు చాలా మంది హడావుడిగా నమలకుండానే మింగేస్తుంటారు. దానికి బదులుగా ఎక్కువ సమయం నమిలి మింగితే కాస్త ఎక్కువ ఆహారం తీసుకొనే అవకాశం ఉంటుంది. చాలా సేటి వరకూ తినాలన్న భావన కలగదు.
చాలా మంది దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతుంటారు. కానీ అరగంటకోసారి గ్లాసు నీళ్లు తాగుతుంటే ఆకలి ఉండదు. ఏదైనా తినాలన్న ఆలోచన కలగదు. అలానే భోజనానికి ముందు గ్లాసు నీళ్లు తాగితే తక్కువ తీసుకొనే ఆవకాశం ఉంటుంది. మధ్యలో కూడా తాగితే త్వరగా కడుపు నిండుతుంది. అధికాహారం తీసుకున్నామన్న భావన ఉండదు.
ఆహారం తీసుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి అల్పాహారం తినడానికి ప్రాధాన్యమివ్వాలి. దీని వల్ల ఎప్పుడూ తింటున్నామన్న భావన కలుగుతుంది. ఉద్యోగినులు పనిమధ్యలో చిరుతిళ్లు వంటివి ఎక్కువ తీసుకొనే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఎండు ఫలాలు, ఉడికించిన మొక్కజొన్న గింజల, తృణధాన్యాలు, మొలకలు వంటివి తాలింపు పెట్టి తీసుకొంటే రుచికరంగా తినొచ్చు. ఎక్కువ తీసుకొన్నా ఇబ్బంది ఉండదు.
ఆకలి లేకపోయినా తినాలనే ఆలోచనలు కలిగినప్పుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. కుంటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం, ప్రకృతిలో సేదతీరడం, ఆత్మీయులతో కబుర్లు చెప్పుకోవడం వంటి చిన్నపాటి నియమాలు మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications











