Latest Updates
-
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు...?

ఈ సమస్యతో బాధపడుతున్న వారు మాటిమాటికీ తినడం కాకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకొనేలా ధ్యాసను నియంత్రించుకోవాలి. కడుపు నిండిన భావన కలగగానే ఆపేయాలి. అంతే కాదు హడావుడిగా కాకుండా నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమివ్వాలి. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలకు తావివ్వకుండా చూసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం వల్ల మేలు చేసే హార్మోన్లు శరీరంలోకి విడుదలవుతాయి. అంతే కాదు ఎక్కువ ఆహారం తీసుకోవడానికి కారణమయ్యే ఒత్తిడి, కుంగుబాటుతో పోరాడే శక్తి ఈ హార్మోన్ల సొంతం. ఆకలి అనిపించినప్పుడు అదే పనిగా కాఫీలు, నూనె పదార్థాల వైపు మొగ్గు చూపితే రకరకాల అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశముంటుంది. ఇవి తీసుకోవాలనిపించినప్పుడు వాటికి బదులుగా గోరువచ్చటి నీళ్లు.. లేదా అందులో నిమ్మరసం, కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది.
జంక్ ఫుడ్, వేపుళ్ల వంటివి తినాలనిపించినప్పుడు వాటికి ప్రత్యామ్నాయ పదార్థాలు ఎంచుకోవాలి. పేస్ట్రీకి బదులు తియ్యని మామిడి పండు ముక్కలకు ప్రాధాన్యమిస్తే సరి. అంతే కాదు కెలొరీలు లభించని ఈ పండు వల్ల ఊబకాయం సమస్యా ఉండదు. అదే సమయంలో కూరగాయ ముక్కల పైన ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే బాగుంటుంది.
తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు పండ్ల ముక్కలు, బ్రెడ్డు.. వంటి వాటి మీద తేనె చేర్చి తింటే సహజ చక్కెర్లు శరీరానికి అందే అవకాశం ఉంటుంది. ఆహారం తినేటప్పుడు చాలా మంది హడావుడిగా నమలకుండానే మింగేస్తుంటారు. దానికి బదులుగా ఎక్కువ సమయం నమిలి మింగితే కాస్త ఎక్కువ ఆహారం తీసుకొనే అవకాశం ఉంటుంది. చాలా సేటి వరకూ తినాలన్న భావన కలగదు.
చాలా మంది దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతుంటారు. కానీ అరగంటకోసారి గ్లాసు నీళ్లు తాగుతుంటే ఆకలి ఉండదు. ఏదైనా తినాలన్న ఆలోచన కలగదు. అలానే భోజనానికి ముందు గ్లాసు నీళ్లు తాగితే తక్కువ తీసుకొనే ఆవకాశం ఉంటుంది. మధ్యలో కూడా తాగితే త్వరగా కడుపు నిండుతుంది. అధికాహారం తీసుకున్నామన్న భావన ఉండదు.
ఆహారం తీసుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి అల్పాహారం తినడానికి ప్రాధాన్యమివ్వాలి. దీని వల్ల ఎప్పుడూ తింటున్నామన్న భావన కలుగుతుంది. ఉద్యోగినులు పనిమధ్యలో చిరుతిళ్లు వంటివి ఎక్కువ తీసుకొనే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఎండు ఫలాలు, ఉడికించిన మొక్కజొన్న గింజల, తృణధాన్యాలు, మొలకలు వంటివి తాలింపు పెట్టి తీసుకొంటే రుచికరంగా తినొచ్చు. ఎక్కువ తీసుకొన్నా ఇబ్బంది ఉండదు.
ఆకలి లేకపోయినా తినాలనే ఆలోచనలు కలిగినప్పుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. కుంటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం, ప్రకృతిలో సేదతీరడం, ఆత్మీయులతో కబుర్లు చెప్పుకోవడం వంటి చిన్నపాటి నియమాలు మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications