తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు...?

How to Satisfy Your Hunger Without Eating Too Much
ఆకలి లేకున్నా... కొందరు అదే పనిగా ఆహారం మీద ధ్యాస పెడుతుంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలే కాదు మానసిక ఇబ్బందులూ తలెత్తుతాయి. ఇందుకు కారణాలేమైనా సరే కొద్దిపాటి జాగ్రత్తలతో పరిష్కారం సూచిస్తున్నారు నిపుణులు

ఈ సమస్యతో బాధపడుతున్న వారు మాటిమాటికీ తినడం కాకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకొనేలా ధ్యాసను నియంత్రించుకోవాలి. కడుపు నిండిన భావన కలగగానే ఆపేయాలి. అంతే కాదు హడావుడిగా కాకుండా నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమివ్వాలి. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలకు తావివ్వకుండా చూసుకోవాలి.

ప్రతిరోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం వల్ల మేలు చేసే హార్మోన్లు శరీరంలోకి విడుదలవుతాయి. అంతే కాదు ఎక్కువ ఆహారం తీసుకోవడానికి కారణమయ్యే ఒత్తిడి, కుంగుబాటుతో పోరాడే శక్తి ఈ హార్మోన్ల సొంతం. ఆకలి అనిపించినప్పుడు అదే పనిగా కాఫీలు, నూనె పదార్థాల వైపు మొగ్గు చూపితే రకరకాల అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశముంటుంది. ఇవి తీసుకోవాలనిపించినప్పుడు వాటికి బదులుగా గోరువచ్చటి నీళ్లు.. లేదా అందులో నిమ్మరసం, కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది.

జంక్ ఫుడ్, వేపుళ్ల వంటివి తినాలనిపించినప్పుడు వాటికి ప్రత్యామ్నాయ పదార్థాలు ఎంచుకోవాలి. పేస్ట్రీకి బదులు తియ్యని మామిడి పండు ముక్కలకు ప్రాధాన్యమిస్తే సరి. అంతే కాదు కెలొరీలు లభించని ఈ పండు వల్ల ఊబకాయం సమస్యా ఉండదు. అదే సమయంలో కూరగాయ ముక్కల పైన ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే బాగుంటుంది.

తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు పండ్ల ముక్కలు, బ్రెడ్డు.. వంటి వాటి మీద తేనె చేర్చి తింటే సహజ చక్కెర్లు శరీరానికి అందే అవకాశం ఉంటుంది. ఆహారం తినేటప్పుడు చాలా మంది హడావుడిగా నమలకుండానే మింగేస్తుంటారు. దానికి బదులుగా ఎక్కువ సమయం నమిలి మింగితే కాస్త ఎక్కువ ఆహారం తీసుకొనే అవకాశం ఉంటుంది. చాలా సేటి వరకూ తినాలన్న భావన కలగదు.

చాలా మంది దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతుంటారు. కానీ అరగంటకోసారి గ్లాసు నీళ్లు తాగుతుంటే ఆకలి ఉండదు. ఏదైనా తినాలన్న ఆలోచన కలగదు. అలానే భోజనానికి ముందు గ్లాసు నీళ్లు తాగితే తక్కువ తీసుకొనే ఆవకాశం ఉంటుంది. మధ్యలో కూడా తాగితే త్వరగా కడుపు నిండుతుంది. అధికాహారం తీసుకున్నామన్న భావన ఉండదు.

ఆహారం తీసుకోవడానికి మధ్య మధ్యలో కొద్దిపాటి అల్పాహారం తినడానికి ప్రాధాన్యమివ్వాలి. దీని వల్ల ఎప్పుడూ తింటున్నామన్న భావన కలుగుతుంది. ఉద్యోగినులు పనిమధ్యలో చిరుతిళ్లు వంటివి ఎక్కువ తీసుకొనే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఎండు ఫలాలు, ఉడికించిన మొక్కజొన్న గింజల, తృణధాన్యాలు, మొలకలు వంటివి తాలింపు పెట్టి తీసుకొంటే రుచికరంగా తినొచ్చు. ఎక్కువ తీసుకొన్నా ఇబ్బంది ఉండదు.

ఆకలి లేకపోయినా తినాలనే ఆలోచనలు కలిగినప్పుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. కుంటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం, ప్రకృతిలో సేదతీరడం, ఆత్మీయులతో కబుర్లు చెప్పుకోవడం వంటి చిన్నపాటి నియమాలు మేలు చేస్తాయి.

Story first published: Wednesday, July 4, 2012, 15:59 [IST]
Desktop Bottom Promotion