Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వేసవి వేడిలో తిండి పదార్థాల జాగ్రత్తలు...!

ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ భూమిలో ఉన్న తేమంతా ఆవిరైపోయినట్లే, ద్రవాలన్నీ ఆవిరైపోతూ శరీరమంతా పొడిబారిపోతుంది. తిరిగి శరీరం తేమగా మారడానికి నీటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. వృక్షాలకూ మనిషికీ ఎంతో తేడా ఉంది. భూమితో అంటిపెట్టుకుని ఉండడం వల్ల వృక్షాలు ఎలాగోలా అవసరమైన పోషకాలు, ద్రవాలన్నీ అందుకుంటూనే ఉంటుంది. మనిషి అలా భూమితో కలిసి ఉండకపోవడం వల్ల అతని శరీరంలోని ద్రవాలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి.
అయితే వేసవిలో అంతా పొడిబారిపోతున్నా, తర్బూజా, కీరా లాంటి పళ్లల్లో నీరు ఉంటుంది. మామిడి పళ్లు తప్ప వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లను విరివిగా తీసుకోవాలి. పండ్లలో ఉండే ఈ నీరు శరీరాన్ని చల్లబరచడానికి బాగా తోడ్పడతాయి. గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మామిడి పండ్లే వేడి చేస్తాయి. కానీ మామిడి కాయలు శరీరానికి చలువ చేస్తాయి. ఆ మాటకొస్తే ఎక్కువ శక్తి నిచ్చేవి ఏవైనా శరీరానికి వేడి చేస్తాయి. అందుకే మామిడి పండ్లను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే శరీర సంరక్షణ తో పాటు వేసవిలో చర్మం, జుట్టు విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.
1. నిమ్మరసం వేసవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటితో గానీ, మజ్జిగతో గానీ కలిపి తీసుకోవడం మేలు.
2. ద్రాక్షపండ్లు, ద్రాక్షరసం, తేనె కలిపిన నీళ్లు తాగవచ్చు. అలాగే పావు చెంచా మోతాదులో గంధం రసాన్ని నీళ్లలో కలుపుకుని తాగినా శరీరం చల్లబడుతుంది.
3. పెరుగుకు వేడి చేసే గుణం ఉంది. అందుకే ఒక భాగం పెరుగు, మూడు భాగాలు నీళ్లు కలిపి చిలికి మజ్జిగ చేసుకుని తాగడం మేలు.
4. ఉల్లిపాయలో సగభాగాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి మరగించి తాగితే శరీరం చల్లబడుతుంది. అవసరమైతే అందులో బెల్లం గానీ, చక్కెరగానీ కలిపి తీసుకోవచ్చు.
5. వేసవిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మాంసాహారం, చిక్కుడు దాన్యాలు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం వినియోగం బాగా తగ్గించాలి.
6. ఉసిరికాయ పొడిని ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా నీళ్లలో కలుపుకుని తాగితే చలువ చేస్తుంది.
7. ఎండు ద్రాక్ష, క ర్బూజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉండదు.



Click it and Unblock the Notifications