Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
వేసవి వేడిలో తిండి పదార్థాల జాగ్రత్తలు...!

ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ భూమిలో ఉన్న తేమంతా ఆవిరైపోయినట్లే, ద్రవాలన్నీ ఆవిరైపోతూ శరీరమంతా పొడిబారిపోతుంది. తిరిగి శరీరం తేమగా మారడానికి నీటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. వృక్షాలకూ మనిషికీ ఎంతో తేడా ఉంది. భూమితో అంటిపెట్టుకుని ఉండడం వల్ల వృక్షాలు ఎలాగోలా అవసరమైన పోషకాలు, ద్రవాలన్నీ అందుకుంటూనే ఉంటుంది. మనిషి అలా భూమితో కలిసి ఉండకపోవడం వల్ల అతని శరీరంలోని ద్రవాలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి.
అయితే వేసవిలో అంతా పొడిబారిపోతున్నా, తర్బూజా, కీరా లాంటి పళ్లల్లో నీరు ఉంటుంది. మామిడి పళ్లు తప్ప వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లను విరివిగా తీసుకోవాలి. పండ్లలో ఉండే ఈ నీరు శరీరాన్ని చల్లబరచడానికి బాగా తోడ్పడతాయి. గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మామిడి పండ్లే వేడి చేస్తాయి. కానీ మామిడి కాయలు శరీరానికి చలువ చేస్తాయి. ఆ మాటకొస్తే ఎక్కువ శక్తి నిచ్చేవి ఏవైనా శరీరానికి వేడి చేస్తాయి. అందుకే మామిడి పండ్లను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే శరీర సంరక్షణ తో పాటు వేసవిలో చర్మం, జుట్టు విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.
1. నిమ్మరసం వేసవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటితో గానీ, మజ్జిగతో గానీ కలిపి తీసుకోవడం మేలు.
2. ద్రాక్షపండ్లు, ద్రాక్షరసం, తేనె కలిపిన నీళ్లు తాగవచ్చు. అలాగే పావు చెంచా మోతాదులో గంధం రసాన్ని నీళ్లలో కలుపుకుని తాగినా శరీరం చల్లబడుతుంది.
3. పెరుగుకు వేడి చేసే గుణం ఉంది. అందుకే ఒక భాగం పెరుగు, మూడు భాగాలు నీళ్లు కలిపి చిలికి మజ్జిగ చేసుకుని తాగడం మేలు.
4. ఉల్లిపాయలో సగభాగాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి మరగించి తాగితే శరీరం చల్లబడుతుంది. అవసరమైతే అందులో బెల్లం గానీ, చక్కెరగానీ కలిపి తీసుకోవచ్చు.
5. వేసవిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మాంసాహారం, చిక్కుడు దాన్యాలు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం వినియోగం బాగా తగ్గించాలి.
6. ఉసిరికాయ పొడిని ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా నీళ్లలో కలుపుకుని తాగితే చలువ చేస్తుంది.
7. ఎండు ద్రాక్ష, క ర్బూజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉండదు.



Click it and Unblock the Notifications