Latest Updates
-
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..!
వేసవి వేడిలో తిండి పదార్థాల జాగ్రత్తలు...!

ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ భూమిలో ఉన్న తేమంతా ఆవిరైపోయినట్లే, ద్రవాలన్నీ ఆవిరైపోతూ శరీరమంతా పొడిబారిపోతుంది. తిరిగి శరీరం తేమగా మారడానికి నీటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. వృక్షాలకూ మనిషికీ ఎంతో తేడా ఉంది. భూమితో అంటిపెట్టుకుని ఉండడం వల్ల వృక్షాలు ఎలాగోలా అవసరమైన పోషకాలు, ద్రవాలన్నీ అందుకుంటూనే ఉంటుంది. మనిషి అలా భూమితో కలిసి ఉండకపోవడం వల్ల అతని శరీరంలోని ద్రవాలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి.
అయితే వేసవిలో అంతా పొడిబారిపోతున్నా, తర్బూజా, కీరా లాంటి పళ్లల్లో నీరు ఉంటుంది. మామిడి పళ్లు తప్ప వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లను విరివిగా తీసుకోవాలి. పండ్లలో ఉండే ఈ నీరు శరీరాన్ని చల్లబరచడానికి బాగా తోడ్పడతాయి. గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మామిడి పండ్లే వేడి చేస్తాయి. కానీ మామిడి కాయలు శరీరానికి చలువ చేస్తాయి. ఆ మాటకొస్తే ఎక్కువ శక్తి నిచ్చేవి ఏవైనా శరీరానికి వేడి చేస్తాయి. అందుకే మామిడి పండ్లను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే శరీర సంరక్షణ తో పాటు వేసవిలో చర్మం, జుట్టు విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.
1. నిమ్మరసం వేసవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటితో గానీ, మజ్జిగతో గానీ కలిపి తీసుకోవడం మేలు.
2. ద్రాక్షపండ్లు, ద్రాక్షరసం, తేనె కలిపిన నీళ్లు తాగవచ్చు. అలాగే పావు చెంచా మోతాదులో గంధం రసాన్ని నీళ్లలో కలుపుకుని తాగినా శరీరం చల్లబడుతుంది.
3. పెరుగుకు వేడి చేసే గుణం ఉంది. అందుకే ఒక భాగం పెరుగు, మూడు భాగాలు నీళ్లు కలిపి చిలికి మజ్జిగ చేసుకుని తాగడం మేలు.
4. ఉల్లిపాయలో సగభాగాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి మరగించి తాగితే శరీరం చల్లబడుతుంది. అవసరమైతే అందులో బెల్లం గానీ, చక్కెరగానీ కలిపి తీసుకోవచ్చు.
5. వేసవిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మాంసాహారం, చిక్కుడు దాన్యాలు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం వినియోగం బాగా తగ్గించాలి.
6. ఉసిరికాయ పొడిని ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా నీళ్లలో కలుపుకుని తాగితే చలువ చేస్తుంది.
7. ఎండు ద్రాక్ష, క ర్బూజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉండదు.



Click it and Unblock the Notifications