Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
కొలెస్ట్రాల్ దూరం చేసే పోపుల పెట్టె....!

లవంగాలు: లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాడు .. విలువైన పోషకాలు ఉన్నాయి. మొటిమలు, రాష్లు, దద్దుర్లు... వంటి చర్మ సమస్యలకూ లవంగనూనె ఉపయోగపడుతుంది. ఇది దోమల్నీ దరిచేరనివ్వదు. అద్భుత ఔషధం! లవంగాల్లోని యుజెనాల్ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.
పసుపు: పసుపులో యాంటి ఆక్సిడెంట్ గుణాలు గల అత్యంత శక్తివంతమైన కుర్ కుమిన్ సమద్దిగా ఉంది. ఇది కణాల పెరుగదలకు దోహదం చేస్తుంది. కాబట్టి గాయాల అనంతరం కండరాలు కోలుకోవడానికి, కణజాలం పెరగడానికి తోడ్పడుతుంది. పసుపు నీరు, సున్నం, గుడ్డులోని తెల్ల సొన, వాముపొడి సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కండరాల నొప్పులకు, బెణుకులుకు పైపూత రాస్తే తగ్గిపోతాయి. ఒక చెంచా మెత్తని పసుపుతో పాలమీది మీగడ, గంధం పొడి,శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే నిగనిగలాడుతుంది.
జీలకర్ర: జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర - చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. భోజనం తరువాత జీలకర్ర నమిలితే దంతాలు పుచ్చిపోకుండా ఉండటమే కాకుండా అజీర్తి, మలబద్దకం తగ్గిపోతాయి. జీలకర్ర,పసుపు, గంధం సమపాళ్లలో కలిపి మొత్తగా నూరి రోజూ ముఖానికి రాసుకుంటే అందమైన మార్పును మీరే గమనించవచ్చు.
మిరియాలు: రుచికి ఘాటుగానూ, కారంగానూ ఉంటాయి. మిరియాలు ఏదో ఒకరకంగా తీసుకోవడం వల్ల ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం. శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. కండర నొప్పులు దూరం... జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే... గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.. గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి
ఆవాలు: చిటపటలాడే అవాలకు అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిలో మెగ్నీషియం , కాల్సియం , మాగనీస్ , జింక్ , ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ , ప్రోటీన్లు , పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. పంటి నొప్పి ఉన్న వాళ్లు కొద్దిగా అవాలు నమిలితే నొప్పి తగ్గుతుంది. అవాలు మెత్తగా నూరి గజ్జి, తామరకు పైపూతగా రాస్తే త్వరగా తగ్గిపోతాయి.
వెల్లుల్లి: ఘాటైన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్ నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగవుతంది. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది . రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర చుట్టం .. దానికన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అంతే కాకుండా పాదాలకు ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చి బాధ పెడుతుంటే వెల్లుల్లి రెబ్బను చిదిమి దాన్ని ఫంగస్ ఉన్నప్రాం తంలో రాసి అరగంట తరువాత కడగాలి. ఈ విధంగా పది రోజులు చేస్తే ఫంగస్ మటాష్.



Click it and Unblock the Notifications