Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
దుర్వాసనకు దూరంగా..అందానికి, ఆరోగ్యానికి దగ్గరగా...!

1. యాంటీ బ్యాక్టీరియా సబ్బుతో స్నానం చేస్తే ఎలాంటి బెడదా ఉండదు అనుకుంటారు కానీ ప్రతిరోజూ ఇలాంటి సబ్బుతో స్నానం చేస్తే శరీరంపై ఉన్న క్రిములను తొలగించడం కష్ట మవుతుంది. దీనివల్ల ఒంటిపై దుమ్ము పేరుకుపోయి చర్మానికి నల్లనిరంగు వస్తుంది. కనుక యాంటీ బ్యాక్టీరియా సబ్బుల వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి.
2. కూల్ కూల్ గా : శరీరమంతా స్వేదరంధ్రాలు ఉంటాయి కాబట్టి మనం తాగిన నీరు చెమట రూపంలో విడుదలవుతూనే ఉంటుంది. పెదవులు, జననాంగాల్లో తప్పించి మిగతా భాగమంతా శ్వేదరంధ్రాలుంటాయి. సాధారణంగా చెమట పట్టడం అంటే శరీరం తనని తాను చల్లబరుచుకోవడమే. కాని అధిక మొత్తంలో చెమట విడుదలవుతే శరీరంలో నీరు తగ్గిపోతుంది. నీరుతగ్గిపోయినప్పుడే మనలో చికాకు మొదవలవుతుంది. కాబట్టి ప్రతి గంటకి తప్పనిసరిగా నీరు తీసుకోవడం మరవకూడదు. అప్పుడు శరీరమే కాదు మనసూ చల్లబడుతుంది. నీరు కేవలం చల్లదనాన్నే కాదు ఆరోగ్యాన్నీ ఇస్తుంది.
3. ఆహారం: సాధారణ స్వేదం కంటే ఎక్కువగా ఉన్నా, దుర్వాసన ఆహారపదార్థాలు కనుక కారణం అవుతుంటే అంటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. కెఫైన్ ఉండే పదార్థాల్ని, ఘాటైన వాసన ఉండే వెల్లుల్లి, ఉల్లిని తినడం తగ్గించాలి.
4. కాఫీ, టీలను తాగడం తగ్గించాలి. సాధారణంగా చెమట దుర్గందాన్ని వెద జల్లుతుందనుకుంటారు. కానీ శరీరం మీద ఉన్న బ్యాక్టీరియాతో స్వేదం చేరినప్పుడు వాసన వస్తుంది. కాబట్టి శరీరం మడతల్లో పౌడర్లు, డియోడ్రెంట్లు ఉపయోగిస్తుండాలి. వీటిని పాటించడంతో పాటు ఆకుకూరలు, సలాడ్స్ అధికంగా తీసుకుంటూ ఉండాలి. ప్రతీరోజూ రెండుసార్లు స్నానం చేయడంతో పాటు వీలనైన్ని సార్లు ముఖాన్ని చేతులు, మెడని చల్లని నీటితో కడుక్కుంటూ ఉండాలి.
5. దుస్తులు: వీలైనంతవరుకు కాటన్ వస్త్రాలనే ధరించాలి. స్వేదా న్ని పీల్చని, ఎక్కువ చెమటకు కారణమయ్యే సిల్కు దుస్తులకు దూరంగా ఉండాలి.
6. షూస్: లెదర్వంటి సహజ సిద్ధ మైన మెటీరియల్స్తో తయారు చేసే షూస్ని, ఇతర పాదరక్షలు ధరించడం వల్ల పాదాల్లో చెమట తగ్గుతుంది. షూస్లోని చెమట రాత్రికి రాత్రి ఆరిపోయే అవకాశం ఉండదు. మళ్లీ తెల్లారగానే వాటిని ధరిస్తే దుర్వాసన ఎక్కువవుతుంది. కాటన్, ఊల్ సాక్స్ పాదాల్ని పొడిగా ఉంచుతాయి. ఇవి తేమను పీల్చే గుణాన్ని కలిగి ఉంటాయి. వ్యా యామం చేసే సమయంలో ఎధ్లెటిక్స్ సాక్స్ బాగా పనిచేస్తాయి. వీటిని ఏ రోజు ధరించినవి ఆరోజు శుభ్రంచేసుకుని మళ్లీ వాడాలి.
7. స్నానం చేసే ముందు నీటిలో ఒక నిమ్మకాయ పిండుకుని స్నానం చేస్తే ఆ రోజంతా తాజాగా ఉంటుంది. స్నానం తర్వాత పాదాల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. సూక్ష్మక్రిములు వేళ్ల సందుల నడుమ జీవిస్తుంటాయి. స్వేదాన్ని పీల్చగలిగిన ఫుడ్ పౌడర్స్ ని ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.
8. పడుకునే ముందు స్వేదం ఎక్కువగా అలుముకునే అరచేతులు, పాదాల్లో యాంటీ పరిస్పిరెంట్స్ రాసుకుంటూ ఉండాలి. డియోడరెంట్స్ను ఉపయోగించేవారు ఎక్కువ సేపు తాజాగా ఉంచే వాటిని కొనుక్కోండి. అయితే వీటి ఘాడత తక్కువగా ఉండాలి.
9. యోగా, ధ్యానం వంటి విశ్రాంతి ఇచ్చే విధానాలను పాటించాలి. వీటివల్ల ఒత్తిడిని నియంత్రించుకునే అవకాశం కలుగుతుంది.
10. ఇవన్నీ కేవలం మనిషిని తాజాగా ఉంచడమే కాదు అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఉపయోగపడుతాయి.



Click it and Unblock the Notifications