ఇంట్లోనే ‘అందా’నికి మెరుగులు..!!

Facial
తమ ముఖారబిందాన్ని మరింత కాంతివంతంగా తీర్చిదిద్దుకునేందుకు పలువరు మహిళలు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొద్ది పాటి అవగాహన కలిగి ఉంటే, మహిళలు తమ సౌందర్యానికి తామే మెరుగులు దిద్దుకోవచ్చు.

అది ఏలాగా అంటే.. ఎండలో తిరగటం, కాలుష్యం బారిన పడటం వల్ల చర్మం కమలడం, నల్లగా మారిపోవడం వంటి సమస్యలు సాధారణం. అయితే ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు సౌందర్య నిపుణుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కొన్ని ఫేషియల్స్ ను ఇంట్లోనే ఆప్లై చేసుకోవచ్చు

ముందుగా ముఖాన్ని మంచినీటితో కడిగి తర్వాత పాలలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి. ఆ పై 'ఎక్స్ ఫోలియేట్ స్ర్కబ్' క్రీముని మునివేళ్లతో రుద్దుతూ రాయాలి. క్రీము ఆరిపోయాక వేడినీటిలో ముంచి తీసిన బట్టతో దాన్ని తుడిచేయాలి.

అనంతరం, టేబుల్ స్ఫూన్ పెరుగులో టీ స్ఫూన్ తేనెను కలిపి ముఖానికి రాయాలి. పొడి చర్మం ఉన్నవారు తేనే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నావారు, కొద్ది నిమ్మరసం కలిపితే మేలు. మాస్క్ వేసుకున్న 20 నిమిషాలకి వేడి నీళ్లలో ముంచిన బట్టతో తుడుచుకోవాలి. ఇలా వారానికి ఓ సారి చేస్తే మీ ముఖం మరింత నిగారింపునిస్తుంది.

Story first published: Sunday, August 21, 2011, 12:40 [IST]
Desktop Bottom Promotion