Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇంట్లోనే ‘అందా’నికి మెరుగులు..!!

అది ఏలాగా అంటే.. ఎండలో తిరగటం, కాలుష్యం బారిన పడటం వల్ల చర్మం కమలడం, నల్లగా మారిపోవడం వంటి సమస్యలు సాధారణం. అయితే ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు సౌందర్య నిపుణుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కొన్ని ఫేషియల్స్ ను ఇంట్లోనే ఆప్లై చేసుకోవచ్చు
ముందుగా ముఖాన్ని మంచినీటితో కడిగి తర్వాత పాలలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి. ఆ పై 'ఎక్స్ ఫోలియేట్ స్ర్కబ్' క్రీముని మునివేళ్లతో రుద్దుతూ రాయాలి. క్రీము ఆరిపోయాక వేడినీటిలో ముంచి తీసిన బట్టతో దాన్ని తుడిచేయాలి.
అనంతరం, టేబుల్ స్ఫూన్ పెరుగులో టీ స్ఫూన్ తేనెను కలిపి ముఖానికి రాయాలి. పొడి చర్మం ఉన్నవారు తేనే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నావారు, కొద్ది నిమ్మరసం కలిపితే మేలు. మాస్క్ వేసుకున్న 20 నిమిషాలకి వేడి నీళ్లలో ముంచిన బట్టతో తుడుచుకోవాలి. ఇలా వారానికి ఓ సారి చేస్తే మీ ముఖం మరింత నిగారింపునిస్తుంది.



Click it and Unblock the Notifications











