Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఇంట్లోనే ‘అందా’నికి మెరుగులు..!!

అది ఏలాగా అంటే.. ఎండలో తిరగటం, కాలుష్యం బారిన పడటం వల్ల చర్మం కమలడం, నల్లగా మారిపోవడం వంటి సమస్యలు సాధారణం. అయితే ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు సౌందర్య నిపుణుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కొన్ని ఫేషియల్స్ ను ఇంట్లోనే ఆప్లై చేసుకోవచ్చు
ముందుగా ముఖాన్ని మంచినీటితో కడిగి తర్వాత పాలలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి. ఆ పై 'ఎక్స్ ఫోలియేట్ స్ర్కబ్' క్రీముని మునివేళ్లతో రుద్దుతూ రాయాలి. క్రీము ఆరిపోయాక వేడినీటిలో ముంచి తీసిన బట్టతో దాన్ని తుడిచేయాలి.
అనంతరం, టేబుల్ స్ఫూన్ పెరుగులో టీ స్ఫూన్ తేనెను కలిపి ముఖానికి రాయాలి. పొడి చర్మం ఉన్నవారు తేనే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నావారు, కొద్ది నిమ్మరసం కలిపితే మేలు. మాస్క్ వేసుకున్న 20 నిమిషాలకి వేడి నీళ్లలో ముంచిన బట్టతో తుడుచుకోవాలి. ఇలా వారానికి ఓ సారి చేస్తే మీ ముఖం మరింత నిగారింపునిస్తుంది.



Click it and Unblock the Notifications