Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పౌడర్ల్లు.. క్రీములు వాడకుండా అందంగా..?

షాంపూలో వెనిగర్ను కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకల పట్టులాంటి నిఘారింపును సంతరించుకుంటాయి. స్నానం చేసే నీటిలో 6 నుంచి 8 చుక్కుల గంధపు నూనెను కలపితే చర్మ సంబంధిత వ్యాధులు దరికి చేరవు. చందనంతో తయారుకాబడిన నూనె కళ్లు మంటలను దూరం చేస్తుంది.
ఎండపెట్టిన నారింజ తొక్కల పొడిని రోజ్ వాటర్లో కలిపి ముఖానికి రాసుకుంటే మృతకణాలు పోయి చర్మం మెరుస్తుంటుంది. నిమ్మకాయరసం కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిరి పడితే బ్లాక్, వైట్ హెడ్స్ను నివారించవచ్చు. రోజ్ వాటర్ సహజసిద్ధమైన టోనర్, క్లెన్సర్లుగా పనిచేస్తుంది. బొప్పాయి గుజ్జు ముఖంపై మచ్చల్ని మాయం చేస్తుంది. కీరదోసకాయ రసం సన్టాన్ని పోగొట్టడమే కాకుండా యాస్ట్రింజెంట్గా కూడా పనిచేస్తుంది. నిగారింపు లేని, పొడి చర్మం గల వాళ్లు ఆల్మండ్ పేస్ట్, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుంది.
కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో తగినంత పుసుపును జోడించి ముఖానికి ఫేషియల్ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపు సంతరించుకుంటుంది.
మీగడ ముఖ సౌందర్యానికి దోహద పడుతుంది. తాజా మీగడను ప్రతిరోజు ముఖానికి రాయడం వల్ల చర్మ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాదు ముఖం పై వ్యాపించిన నల్లమచ్చలు, ముడతలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications











