Just In
- 1 hr ago నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- 2 hrs ago వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- 4 hrs ago Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- 6 hrs ago Hanuman Jayanti 2024: హనుమ జయంతి నాడు 3 శుభయోగాలు, హనుమంతిడి అనుగ్రహంతో ఈ 5 రాశులకి విజయం, ధన లాభం
పౌడర్ల్లు.. క్రీములు వాడకుండా అందంగా..?
షాంపూలో వెనిగర్ను కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకల పట్టులాంటి నిఘారింపును సంతరించుకుంటాయి. స్నానం చేసే నీటిలో 6 నుంచి 8 చుక్కుల గంధపు నూనెను కలపితే చర్మ సంబంధిత వ్యాధులు దరికి చేరవు. చందనంతో తయారుకాబడిన నూనె కళ్లు మంటలను దూరం చేస్తుంది.
ఎండపెట్టిన నారింజ తొక్కల పొడిని రోజ్ వాటర్లో కలిపి ముఖానికి రాసుకుంటే మృతకణాలు పోయి చర్మం మెరుస్తుంటుంది. నిమ్మకాయరసం కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిరి పడితే బ్లాక్, వైట్ హెడ్స్ను నివారించవచ్చు. రోజ్ వాటర్ సహజసిద్ధమైన టోనర్, క్లెన్సర్లుగా పనిచేస్తుంది. బొప్పాయి గుజ్జు ముఖంపై మచ్చల్ని మాయం చేస్తుంది. కీరదోసకాయ రసం సన్టాన్ని పోగొట్టడమే కాకుండా యాస్ట్రింజెంట్గా కూడా పనిచేస్తుంది. నిగారింపు లేని, పొడి చర్మం గల వాళ్లు ఆల్మండ్ పేస్ట్, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుంది.
కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో తగినంత పుసుపును జోడించి ముఖానికి ఫేషియల్ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపు సంతరించుకుంటుంది.
మీగడ ముఖ సౌందర్యానికి దోహద పడుతుంది. తాజా మీగడను ప్రతిరోజు ముఖానికి రాయడం వల్ల చర్మ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాదు ముఖం పై వ్యాపించిన నల్లమచ్చలు, ముడతలు తొలగిపోతాయి.