పగిలిన పాదాలకు చికిత్స!

By B N Sharma

Tips To Cure Cracked Heels
కాలిపగుళ్ళు ఎంతో బాధిస్తాయి. సరిగ్గా వైద్యం చేయకపోతే వాటి బాధ మరింత అధికంగా వుంటుంది. పాదాలు చూడటానికి ఎంతో అసహ్యంగా వుంటాయి. చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. రోజు రోజుకు పగుళ్ళు అధికం అయి బ్లీడింగ్, పెయిన్ రావటం కూడా జరుగుతుంది. పగుళ్లు అధికంగా లోతైతే, ఇక మానేటందుకు కూడా అధిక సమయం తీసుకుంటుంది. ప్రత్యేకించి శీతా కాలంలో వీటికి తగ్గ వైద్యం వెంటనే చేస్తూ వుండాలి. రాత్రి పడుకునే ముందు పగిలిన పాదాలకు మంచి క్రీములు రాయాలి.

కాలిపగుళ్ళకు నివారణ ఎలా?
-కాలిపగుళ్ళ చర్మం గట్టిపడి ఎండిపోయి వుంటుంది. దీనిని ప్రతి స్నానం లోను రుద్దుడు రాయి లేదా ప్యూమైస్ స్టోన్ తో గట్టిగా రుద్ది మృత చర్మ కణాలను తొలగించండి. మడమల వద్ద మొత్తటి చర్మం వుండేలా చూడండి. మడమ భాగం చక్కటి తేమ లేదా మెత్తగా వుండేలా చూడండి. దీనికిగాను మంచిక్రీములు వాడాలి. పగులకూడదంటే దానికి క్రీము తప్పక రాయాలి. చర్మం ఎండిపోకుండా వీలైతే షూ ధరించండి. సాక్స్ వేసే ముందు బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ రాయండి. ఇది చర్మంలో తేమను వుంచుతుంది.

-మీ పాదాలను ఉప్పు వేసిన వేడి నీటిలో ప్రతి రోజు కనీసం 20 నిమిషాలపాటు వుంచండి. చర్మ రోగాలకు ఇది చక్కటి పరిష్కారం కాగలదు. కాలిని కొంత సేపు రుద్దుడు రాయితో రుద్దండి. సాక్స్ వేసుకొని పడుకోండి.

-రోజ్ వాటర్ ను గ్లిజరిన్ తో కలపండి. దీనిని కాటన్ తో పగిలిన భాగాలకు చక్కగా ప్రతి రోజూ రాయండి. ఈ విధంగా 15 రోజులు చేస్తే మంచి ఫలితాలు కనపడతాయి.

-పగుళ్ళు అధికం కాకుండా వుండాలంటే షూస్ వేసుకోవాలి. చర్మం పొడిబారకుండా ఎప్పుడూ తేమ కలిగి వుంటుంది.

-రోజంతా శరీరానికవసరమైన అధిక నీటిని తాగండి. చర్మానికి లోపలి నుండి కూడా తేమ లభిస్తుంది.

-బాగా పండిన అరటి పండు గుజ్జులో కొద్ది చుక్కలు గ్లిజరిన్ కలపండి. ఆ మిశ్రమాన్ని పగిలిన పాదాల మడమలకు రాయండి.

పై చిట్కాలు ఉపయోగించి మీ పాదాలను సున్నితంగా అందంగా వుండేలా చూసుకోండి.

Story first published: Friday, September 16, 2011, 11:50 [IST]
Desktop Bottom Promotion