Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పగిలిన పాదాలకు చికిత్స!

కాలిపగుళ్ళకు నివారణ ఎలా?
-కాలిపగుళ్ళ చర్మం గట్టిపడి ఎండిపోయి వుంటుంది. దీనిని ప్రతి స్నానం లోను రుద్దుడు రాయి లేదా ప్యూమైస్ స్టోన్ తో గట్టిగా రుద్ది మృత చర్మ కణాలను తొలగించండి. మడమల వద్ద మొత్తటి చర్మం వుండేలా చూడండి. మడమ భాగం చక్కటి తేమ లేదా మెత్తగా వుండేలా చూడండి. దీనికిగాను మంచిక్రీములు వాడాలి. పగులకూడదంటే దానికి క్రీము తప్పక రాయాలి. చర్మం ఎండిపోకుండా వీలైతే షూ ధరించండి. సాక్స్ వేసే ముందు బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ రాయండి. ఇది చర్మంలో తేమను వుంచుతుంది.
-మీ పాదాలను ఉప్పు వేసిన వేడి నీటిలో ప్రతి రోజు కనీసం 20 నిమిషాలపాటు వుంచండి. చర్మ రోగాలకు ఇది చక్కటి పరిష్కారం కాగలదు. కాలిని కొంత సేపు రుద్దుడు రాయితో రుద్దండి. సాక్స్ వేసుకొని పడుకోండి.
-రోజ్ వాటర్ ను గ్లిజరిన్ తో కలపండి. దీనిని కాటన్ తో పగిలిన భాగాలకు చక్కగా ప్రతి రోజూ రాయండి. ఈ విధంగా 15 రోజులు చేస్తే మంచి ఫలితాలు కనపడతాయి.
-పగుళ్ళు అధికం కాకుండా వుండాలంటే షూస్ వేసుకోవాలి. చర్మం పొడిబారకుండా ఎప్పుడూ తేమ కలిగి వుంటుంది.
-రోజంతా శరీరానికవసరమైన అధిక నీటిని తాగండి. చర్మానికి లోపలి నుండి కూడా తేమ లభిస్తుంది.
-బాగా పండిన అరటి పండు గుజ్జులో కొద్ది చుక్కలు గ్లిజరిన్ కలపండి. ఆ మిశ్రమాన్ని పగిలిన పాదాల మడమలకు రాయండి.
పై చిట్కాలు ఉపయోగించి మీ పాదాలను సున్నితంగా అందంగా వుండేలా చూసుకోండి.



Click it and Unblock the Notifications











