Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
ప్రకాశవంతంగా మెరిసేటి చర్మ కోసం కిచెన్ సెల్ఫ్ చిట్కాలు...!

1. చిన్న బౌల్ లోనికి జీలకర్ర పొడి, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ ముఖానికి అప్లై చేయాలి. దీన్ని పది నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
2. ఒక చిన్న బౌల్ లో ఒక చెంచా తేనె, ఒక చెంచా గ్లిజరిన్, రెండు చెంచాల నిమ్మరసం తీసుకొని మూడా బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ఆరిన కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం బ్లీచ్ అయ్యి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
3. బాగా పండిన టమోటో ముక్కలు మరియు తేనె బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
4. ఒక గిన్నెలో ముల్తానీ మట్టి, సాండిల్ వుడ్ పౌడర్, మరియు కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిల్ స్కిన్ కలవారికి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చర్మంలో అధికంగా ఉన్న ఆయిల్ ను తొలగింస్తుంది. అలాగే చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది.
5. ఒక బౌల్ లో గంధం పొడి, నిమ్మరసం, దోసకాయ పేస్ట్, పసుపు మరియు నిమ్మరసం వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిర్జీవంగా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతంగా తయారైయ్యేలా చేస్తుంది.
6. చిన్న గిన్నెలో రెండు చెంచాల శెనగ పిండి, చిటికెడు పసుపు, నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మంచి నీళ్ళు కడిగేసుకోవాలి. ఇది పొడి చర్మానకి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.
7. మీరు రోజూ తాజా పెరుగును ముఖానికి, మెడకు అప్లై చేసుకొంటే ముఖం బేబీ సాప్ట్ చర్మలా మెరిసిపోతుంది.
8. ప్రతి రోజూ స్నానం చేసుకొనే ముందు కొద్దిగా ఆయిల్ లో ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి, కాళ్ళు, చేతులకు పట్టించి ఓ పది, పదిహేను నిమిషాల తర్వాత స్నానం చేసుకొంటే మీ చర్మం సున్నితంగా తయారవుతుంది.
9. క్యాస్ట్రాల్ ఆయిల్ ను ముఖం, మెడకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంపై ముడతలు, గీతలు తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
10. ఆయిల్ చర్మం కలవారు ఒక చెంచా పెరుగు, అర చెంచా పసుపు, ఒక చెంచా సాండిల్ వుండ్ పౌడర్ కలపి ముఖం, మెడకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో ఆయిల్ తొలగింపబడి మీ చర్మాన్ని చైతన్యవంతంగా మార్చుతుంది..



Click it and Unblock the Notifications











