Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
చర్మంపై పేరుకొన్న మృతకణాలను తొలగించాలంటే...!

గుడ్డులోని తెల్లసొనకు మొక్కజొన్న పిండి కలిపి ముఖం, మెడకు పూతలా వేయాలి. తేమ ఆరాక కడిగితే చాలు మృతకణాలు తొలగిపోతాయి. పనిలో పనిగా మురికి, జిడ్డూ వదిలి చర్మం శుభ్రపడుతుంది. బిగుతుగా ఉంటుంది.
జిడ్డు చర్మతత్వం ఉన్న వారు తరచూ చర్మాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. లేదంటే మృతచర్మం పేరుకుంటుంది. రెండు చెంచాల నిమ్మరసంలో తేనె, కొన్ని నీళ్లు, రెండు చెంచాల ముల్తానీమట్టి కలిపి పూతలా వేసుకోవాలి. అది ఆరాక శుభ్రపరచుకుంటే మార్పు ఉంటుంది.
చిన్న కప్పులో కొద్దిగా రాళ్ల ఉప్పు ఆలివ్ నూనె తీసుకుని బాగా కలపాలి. బరకగా ఉన్న ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరానికి రుద్దుకోవాలి. పంచదార, ఆలివ్ నూనె కలిపి కూడా రాసుకోవచ్చు. మృతకణాలు తొలగిపోయి..చర్మం కాంతివంతగా మారుతుంది. మృదుత్వాన్నీ సంతరించుకుంటుంది. ఇలా వారానికోసారి చేసుకోవాలి.
అరకప్పు కన్నా కొద్దిగా తక్కువగా ఆలివ్ నూనె తీసుకుని అందులో నాలుగైదు బాదం పప్పుల్ని బరకగా పొడిచేసి కలపాలి. ఈ నూనెను ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
నల్లని వలయాలను దూరం చేసే టీ బ్యాగులను మృతకణాలు తొలగించేందుకూ వాడుకోవచ్చు. స్నానికి ముందు ఆ ఒకటిరెండు టీబ్యాగుల్ని తీసుకుని చర్మంపై సున్నితంగా రడ్డుకోవాలి. అలాగే వారానికి రెండుసార్లు ఏం చేయాలంటే..అరకప్పు పెరుగులో రెండు చెంచాలా తేనె కలిపి ముఖానికి రాసుకుని బాగా రుద్దాలి. కాసేపయ్యాక దూదితో తుడుచుకుని గోరువెచ్చిన నీళ్లతో కడిగేసుకోవాలి. చర్మం శుభ్రపడుతుంది ప్రకాశవంతంగా మారుతుంది.
మృతకణాలను తొలగించడంలో ఆలస్యం చేయడం వల్ల చర్మం కాంతి విహీనంగా మారుతుంది. దానికి తోడు మంచినీళ్లు ఎక్కువగా తీసుకోకపోయినా తేమనందించే క్రీంలు రాసుకోకపోయినా చర్మం మరింత పొడిబారుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే...ఒక కప్పు ఓట్ మీల్ కు రెండు చెంచాల తేనె, పెరుగు, గుడ్డులోని తెల్లసొన, అరకప్పు గోరువెచ్చటి నీళ్లు కలిపి రెండు గంటలు నాననివ్వాలి. ఆ తర్వాత ముఖానికి పూతలా వేసి క్రమపద్దతిలో మర్దనుచేయాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చాలు. మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications