Latest Updates
-
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో..
చర్మంపై పేరుకొన్న మృతకణాలను తొలగించాలంటే...!

గుడ్డులోని తెల్లసొనకు మొక్కజొన్న పిండి కలిపి ముఖం, మెడకు పూతలా వేయాలి. తేమ ఆరాక కడిగితే చాలు మృతకణాలు తొలగిపోతాయి. పనిలో పనిగా మురికి, జిడ్డూ వదిలి చర్మం శుభ్రపడుతుంది. బిగుతుగా ఉంటుంది.
జిడ్డు చర్మతత్వం ఉన్న వారు తరచూ చర్మాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. లేదంటే మృతచర్మం పేరుకుంటుంది. రెండు చెంచాల నిమ్మరసంలో తేనె, కొన్ని నీళ్లు, రెండు చెంచాల ముల్తానీమట్టి కలిపి పూతలా వేసుకోవాలి. అది ఆరాక శుభ్రపరచుకుంటే మార్పు ఉంటుంది.
చిన్న కప్పులో కొద్దిగా రాళ్ల ఉప్పు ఆలివ్ నూనె తీసుకుని బాగా కలపాలి. బరకగా ఉన్న ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరానికి రుద్దుకోవాలి. పంచదార, ఆలివ్ నూనె కలిపి కూడా రాసుకోవచ్చు. మృతకణాలు తొలగిపోయి..చర్మం కాంతివంతగా మారుతుంది. మృదుత్వాన్నీ సంతరించుకుంటుంది. ఇలా వారానికోసారి చేసుకోవాలి.
అరకప్పు కన్నా కొద్దిగా తక్కువగా ఆలివ్ నూనె తీసుకుని అందులో నాలుగైదు బాదం పప్పుల్ని బరకగా పొడిచేసి కలపాలి. ఈ నూనెను ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
నల్లని వలయాలను దూరం చేసే టీ బ్యాగులను మృతకణాలు తొలగించేందుకూ వాడుకోవచ్చు. స్నానికి ముందు ఆ ఒకటిరెండు టీబ్యాగుల్ని తీసుకుని చర్మంపై సున్నితంగా రడ్డుకోవాలి. అలాగే వారానికి రెండుసార్లు ఏం చేయాలంటే..అరకప్పు పెరుగులో రెండు చెంచాలా తేనె కలిపి ముఖానికి రాసుకుని బాగా రుద్దాలి. కాసేపయ్యాక దూదితో తుడుచుకుని గోరువెచ్చిన నీళ్లతో కడిగేసుకోవాలి. చర్మం శుభ్రపడుతుంది ప్రకాశవంతంగా మారుతుంది.
మృతకణాలను తొలగించడంలో ఆలస్యం చేయడం వల్ల చర్మం కాంతి విహీనంగా మారుతుంది. దానికి తోడు మంచినీళ్లు ఎక్కువగా తీసుకోకపోయినా తేమనందించే క్రీంలు రాసుకోకపోయినా చర్మం మరింత పొడిబారుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే...ఒక కప్పు ఓట్ మీల్ కు రెండు చెంచాల తేనె, పెరుగు, గుడ్డులోని తెల్లసొన, అరకప్పు గోరువెచ్చటి నీళ్లు కలిపి రెండు గంటలు నాననివ్వాలి. ఆ తర్వాత ముఖానికి పూతలా వేసి క్రమపద్దతిలో మర్దనుచేయాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చాలు. మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











