పాదాలపై కొంచెం శ్రద్ద పెట్టండి..

Home Tips for Healthy Foot...!
మానవ శరీరంలో అందమైన ముఖము, చేతులు తరువాత ప్రధాన దృష్టి పడేదీ పాదాల మీదే..మన శరీర బరుబు మొత్తం మన పాదాల మీదే ఆధారపడిపడి ఉంది. కనుక పాదాలను మనము అశ్రద్ధ చేయకూడదు. పగిలిన పాదాలు, మడమలు చూడటానికి చాలా అసహ్యంగా కనబడతాయి. కనుక వాటిని మనం అందంగా నాజూగ్గా ఉండే విధంగా షేప్‌ ని చక్కగా ఎక్సర్‌ సైజులు చేయాలి. ఏ కాలంలో నైనా పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే శీతాకాలంలో కాలు మడమలపై పగుళ్లు ఏర్పడి చాలా భాదిస్తాయి. పాదాల అందం కోసం ఇంట్లోనే ఏం చేయాలో తెలుసుకుందాం:

1. పచ్చిపాలు, శనగపిండి మీ పాదాలకు సరిపడా తీసుకోండి. ఈ రెండింటి మిశ్రమాన్ని పాదాలకు రోజూ పట్టించి, ఆరాక మామూలుగా కడిగేస్తే నల్లగా ఉన్న పాదాలు తెల్లబడతాయి.
2. ప్రతి రోజూ నిమ్మచెక్కతో పాదాలను రుద్దడం వల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.
3. పాదాలనూ, వేళ్ళ మద్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
4. కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
5. ఎత్తు మడమలు గల చెప్పులు వాడటం మంచిదికాదు.
6. మీ పాదాలకు మీ ఇంట్లోనే పెడిక్యూర్‌ చేసుకోవచ్చు. రెండుమగ్గుల గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌, రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ అయిల్‌ వేసి ఒక వెడల్పాటి బకెట్‌లో పోసి అందులో మీ పాదాల్ని వుంచండి. నీళ్లవెచ్చదనం తగ్గిపోయిన తర్వాత మీ పాదాలకి మంచి మాయిశ్చరైజర్‌ రాసుకోచ్చు.
7. ప్రతిరోజూ స్నానం చేసేటపుడు కనీసం మూడు నిమిషాలైనా పాదాలకోసం కేటాయించండి. పాదాలను ప్యూమిన్ రాయితో రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది. ప్యూమిన్ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ కొని తెచ్చుకోవాలి. బ్రష్‌తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. స్నానం పూర్తయ్యాక వేళ్ల మధ్య, అరికాలు పూర్తిగా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ రాయాలి.

Story first published: Friday, February 10, 2012, 16:39 [IST]
Desktop Bottom Promotion