Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పాదాలపై కొంచెం శ్రద్ద పెట్టండి..

1. పచ్చిపాలు, శనగపిండి మీ పాదాలకు సరిపడా తీసుకోండి. ఈ రెండింటి మిశ్రమాన్ని పాదాలకు రోజూ పట్టించి, ఆరాక మామూలుగా కడిగేస్తే నల్లగా ఉన్న పాదాలు తెల్లబడతాయి.
2. ప్రతి రోజూ నిమ్మచెక్కతో పాదాలను రుద్దడం వల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.
3. పాదాలనూ, వేళ్ళ మద్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
4. కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
5. ఎత్తు మడమలు గల చెప్పులు వాడటం మంచిదికాదు.
6. మీ పాదాలకు మీ ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. రెండుమగ్గుల గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ అయిల్ వేసి ఒక వెడల్పాటి బకెట్లో పోసి అందులో మీ పాదాల్ని వుంచండి. నీళ్లవెచ్చదనం తగ్గిపోయిన తర్వాత మీ పాదాలకి మంచి మాయిశ్చరైజర్ రాసుకోచ్చు.
7. ప్రతిరోజూ స్నానం చేసేటపుడు కనీసం మూడు నిమిషాలైనా పాదాలకోసం కేటాయించండి. పాదాలను ప్యూమిన్ రాయితో రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది. ప్యూమిన్ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ కొని తెచ్చుకోవాలి. బ్రష్తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. స్నానం పూర్తయ్యాక వేళ్ల మధ్య, అరికాలు పూర్తిగా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ రాయాలి.



Click it and Unblock the Notifications











