చర్మం నునుపుదేలి కోమలంగా ఉండాలంటే..

Skin Care
1. పావుకప్పు పెసరపప్పులో అయిదారు బాదం పప్పులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయానే నీటిని వంపి బాదం పప్పు పొట్టుతీసి రెండిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే చర్మం నునుపుదేలి కోమలంగా ఉంటుంది.

2. కీరా చెక్కు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి (ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజుల వరకూ వాడుకోవచ్చు).

3. పావుకప్పు పెసరపప్పులో అయిదారు బాదం పప్పులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదాయాన్నే నీటిని పంపి బాదం పప్పు పొట్టుతీసి రెండిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే చర్మం నునుపుదేలికోమలంగా ఉంటుంది.

4. ఒక టీ స్పూన్ బాదమ్ ఆయిల్‌లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి మాస్క్ వేసుకుని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం నునుపుదేలి అందంగా మెరుస్తూ ఉంటుంది.

5. వేపాకులపొడి, పసుపుపొడి, కరక్కాయపొడి, పుదీనా కొత్తిమీర పొడిలను తీసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడికి కొంచెం పెరుగు కలిపి. దీనిని ప్రతిరోజూ, చర్మానికి , ముఖానికి రాసుకుని స్నానం చేయడం వలన చర్మం నునుపుగా కాంతివంతంగా ఉంటుంది.

Story first published: Thursday, January 5, 2012, 15:39 [IST]
Desktop Bottom Promotion