Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ముఖంపై నల్లమచ్చలు తొలగి..చక్కని రూపం మీ సొంతం....!

బంగాళాదుంప ముక్కల్ని తీసుకుని ముఖం రుద్దుకున్నా...మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, వైట్ హెడ్స్ లాంటివి దూరమవుతాయి. అలాగే దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని అందులో చెంచా పొడిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి నల్లమచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా మచ్చలున్న చోట నిత్యం రాస్తుంటే మార్పు కనిపిస్తుంది.
తాజా మెంతి ఆకులు తీసుకొని, వాటిని మెత్తగా రుబ్బి రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేయడం వల్ల నల్లమచ్చలు దూరమవుతాయి. అలాగే గుప్పెడు మెంతి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి ఆ డికాషన్ చల్లారాక ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.
గ్రీన్ టీ లో దూది ముంచి మచ్చలపై రోజూ రాసుకున్నా కూడా...సమస్య పరిష్కారమవుతుంది. వంటనూనె, నిమ్మరసం చెంచా చొప్పులన తీసుకొని మచ్చలున్న ప్రాంతంలో సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిసాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు.
మునగ ఆకుల్ని గుప్పెడు తీసుకుని మెత్తగా నూరి అందులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. మచ్చలతో పాటు..అధిక జిడ్డూ తొలగిపోతుంది. రెండు కప్పుల నీరు తీసుకుని నాలుగు చెంచాల ఎప్సంసాల్ట్ వేసి గంట తర్వాత అందులో దూదిని ముంచి మచ్చలపై బాగా రుద్దాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.
ఒక టీ స్పూన్ గోరువెచ్చని పాలని తీసుకుని అందులో కాటన్ను ముంచి దాన్ని మోహంపై మెల్లిగా రుద్దుండి. ఇలా చేసి ఒక పదిహేను నిముషాలు ఆరనివ్వండి.తరువాత చల్లని నీటితో మోహాన్ని కడగేసుకోవాలి. నాలుగు చెంచాల పచ్చిపాలలో రెండు చెంచాల నిమ్మరసం కలపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత దూదితో శుబ్రంగా తుడిచేసుకుంటే సరిపోతుంది. మరో సని కూడా చేయవచ్చు. చందనం పొడి, పసుపు సమపాళ్లో తీసుకొని నీటితో ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి తడారాక కడిగేయాలి. ఇలా చేస్తు నల్లమచ్చలు, మృతకణాలు క్రమంగా తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications