Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ముఖంపై నల్లమచ్చలు తొలగి..చక్కని రూపం మీ సొంతం....!

బంగాళాదుంప ముక్కల్ని తీసుకుని ముఖం రుద్దుకున్నా...మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, వైట్ హెడ్స్ లాంటివి దూరమవుతాయి. అలాగే దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని అందులో చెంచా పొడిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి నల్లమచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా మచ్చలున్న చోట నిత్యం రాస్తుంటే మార్పు కనిపిస్తుంది.
తాజా మెంతి ఆకులు తీసుకొని, వాటిని మెత్తగా రుబ్బి రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేయడం వల్ల నల్లమచ్చలు దూరమవుతాయి. అలాగే గుప్పెడు మెంతి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి ఆ డికాషన్ చల్లారాక ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.
గ్రీన్ టీ లో దూది ముంచి మచ్చలపై రోజూ రాసుకున్నా కూడా...సమస్య పరిష్కారమవుతుంది. వంటనూనె, నిమ్మరసం చెంచా చొప్పులన తీసుకొని మచ్చలున్న ప్రాంతంలో సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిసాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు.
మునగ ఆకుల్ని గుప్పెడు తీసుకుని మెత్తగా నూరి అందులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. మచ్చలతో పాటు..అధిక జిడ్డూ తొలగిపోతుంది. రెండు కప్పుల నీరు తీసుకుని నాలుగు చెంచాల ఎప్సంసాల్ట్ వేసి గంట తర్వాత అందులో దూదిని ముంచి మచ్చలపై బాగా రుద్దాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.
ఒక టీ స్పూన్ గోరువెచ్చని పాలని తీసుకుని అందులో కాటన్ను ముంచి దాన్ని మోహంపై మెల్లిగా రుద్దుండి. ఇలా చేసి ఒక పదిహేను నిముషాలు ఆరనివ్వండి.తరువాత చల్లని నీటితో మోహాన్ని కడగేసుకోవాలి. నాలుగు చెంచాల పచ్చిపాలలో రెండు చెంచాల నిమ్మరసం కలపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత దూదితో శుబ్రంగా తుడిచేసుకుంటే సరిపోతుంది. మరో సని కూడా చేయవచ్చు. చందనం పొడి, పసుపు సమపాళ్లో తీసుకొని నీటితో ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి తడారాక కడిగేయాలి. ఇలా చేస్తు నల్లమచ్చలు, మృతకణాలు క్రమంగా తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications