Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ముఖంపై నల్లమచ్చలు తొలగి..చక్కని రూపం మీ సొంతం....!

బంగాళాదుంప ముక్కల్ని తీసుకుని ముఖం రుద్దుకున్నా...మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, వైట్ హెడ్స్ లాంటివి దూరమవుతాయి. అలాగే దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని అందులో చెంచా పొడిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి నల్లమచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా మచ్చలున్న చోట నిత్యం రాస్తుంటే మార్పు కనిపిస్తుంది.
తాజా మెంతి ఆకులు తీసుకొని, వాటిని మెత్తగా రుబ్బి రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేయడం వల్ల నల్లమచ్చలు దూరమవుతాయి. అలాగే గుప్పెడు మెంతి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి ఆ డికాషన్ చల్లారాక ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.
గ్రీన్ టీ లో దూది ముంచి మచ్చలపై రోజూ రాసుకున్నా కూడా...సమస్య పరిష్కారమవుతుంది. వంటనూనె, నిమ్మరసం చెంచా చొప్పులన తీసుకొని మచ్చలున్న ప్రాంతంలో సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిసాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు.
మునగ ఆకుల్ని గుప్పెడు తీసుకుని మెత్తగా నూరి అందులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. మచ్చలతో పాటు..అధిక జిడ్డూ తొలగిపోతుంది. రెండు కప్పుల నీరు తీసుకుని నాలుగు చెంచాల ఎప్సంసాల్ట్ వేసి గంట తర్వాత అందులో దూదిని ముంచి మచ్చలపై బాగా రుద్దాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.
ఒక టీ స్పూన్ గోరువెచ్చని పాలని తీసుకుని అందులో కాటన్ను ముంచి దాన్ని మోహంపై మెల్లిగా రుద్దుండి. ఇలా చేసి ఒక పదిహేను నిముషాలు ఆరనివ్వండి.తరువాత చల్లని నీటితో మోహాన్ని కడగేసుకోవాలి. నాలుగు చెంచాల పచ్చిపాలలో రెండు చెంచాల నిమ్మరసం కలపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత దూదితో శుబ్రంగా తుడిచేసుకుంటే సరిపోతుంది. మరో సని కూడా చేయవచ్చు. చందనం పొడి, పసుపు సమపాళ్లో తీసుకొని నీటితో ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి తడారాక కడిగేయాలి. ఇలా చేస్తు నల్లమచ్చలు, మృతకణాలు క్రమంగా తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications











