Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
క్యాబేజి తో చక్కటి ముఖ సౌందర్యం...!

క్యాబేజీ వంటకంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన చర్మానికి క్యాబేజీ రసం రాస్తే బాగా పనిచేస్తుంది. అయితే క్యాబేజీని పచ్చిగా నేరుగా ముఖంపై పూయకూడదు. దీని వాడకానికి కొన్ని పద్ధతులు పాటించాలి...
ప్రతిరోజూ ఉడికించిన క్యాబేజీ తరుగును గుజ్జులా చేసి అందులో దూదిని ముంచి ముఖంపై నెమ్మదిగా మర్దనా చేస్తూ రాసి, పది నిమిషాల తరువాత కడిగేస్తే ముఖంపై పేరుకున్న నలుపు తగ్గుతుంది. క్యాబేజీరి నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉడికించి తర్వాత ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకొంటే చర్మం చాలా సున్నితంగా మరియు యవ్వనంగా కనబడుతారు.
క్యాబేజిని ఆకులను తీసుకొని మిక్సర్ వేసి జ్యూస్ చేసుకోవాలి. రెండు చెంచాల క్యాబేజీ జ్యూస్ లో చిటికెడు ఈస్ట్ కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి బాగా పట్టించాలి. తర్వాత అరగంట సేపు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంలోని డస్ట్ ను తొలగించి ముఖం ప్రకాశవంతంగా తయారయ్యేలా చేస్తుంది.
క్యాబేజీ తరుగును నీళ్లల్లో ఐదు నిమిషాల పాటు ఉడికించి ఆ నీటిని కూడా వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా తేనె కలిపితే మరింత మంచి ఫలితం లభిస్తుంది. క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే ముడతలు కనిపించవు.
ఒక స్పూన్ క్యాబేజీ గుజ్జులో రెండు స్పూన్ల కోడిగుడ్డు తెల్లసొన, ఒక స్పూను సోయాపిండి, ఒక స్పూను తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక కడిగేస్తే ముఖానికి మెరుపు రావడంతో పాటు ముడతలు కూడా తగ్గుతాయి.
క్యాబేజి ఆకులను ముద్దలా చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.



Click it and Unblock the Notifications