Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
చర్మం సౌందర్యానికి పాల మెరుపులు..!

వాతావరణ సమస్యలు, పోషకాల లేమి ఇలా కారణం ఏదైనా కొందిరి చర్మం నిర్జీవంగా ఉంటుంది. ఇలాంటి వారు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలల్లో చిటికెడు ఉప్పు వేసి రాత్రి పడుకొనే ముందు చేతులు, మెడ, ముఖం భాగాల్లో రాసుకొంటే చర్మానిక మెరుపు వస్తుంది. పాలల్లో గులాబి రేకుల మిశ్రమాన్ని కలిపినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
చర్మ కాంతి మెరుగుపడేందుకు: కొందరు రంగు తక్కువగా ఉన్నామని, మరికొందరు మునుపటి వర్ణం కోల్పోయామని తరచూ బాధపడుతుంటారు. ఇలాంటి వారు నానబెట్టిన మూడు బాదం గింజల్ని మిశ్రమంగా చేసుకొని పాలల్లో కలుపుకోవాలి. దీన్ని పడుకొనే ముందు ముఖం, మెడ కు రాసుకోవాలి.
పచ్చిశెనగపప్పును రాత్రంతా పాలల్లో నానబెట్టి మెత్తని పేస్టులా చేసి, అందులో కొద్దిగా పసుపు, రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలుపుకొని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మీ చాయ మెరుగుపడుతుంది.
ఓ టేబుల్ స్పూన్ పాలల్లో ఒక్కో చెంచా చొప్పున క్యారెట్, నారింజ రసం కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో మూడు చుక్కల తేనె వేసి కరిగే వరకూ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
పొడిచర్మానికి: కాలంతో పనిలేకుండా, కొందరి చర్మం పొడిబారుతుంది. ఇలాంటి వారు సెనగపిండిలో కొద్దిగా పసుపు, అరచెంచా నారింజ తొడిమపొడి, బాగా గిలకొట్టిన పెరుగు ఒక చెంచా, పాలు ఒక చెంచా వేసి బాగా కలపి, పదినిమిషాలు నానబెట్టి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒంటికి నలుగులా పెట్టుకొంటే ఈ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
మృదువైన చర్మం కోసం: పట్టులా జాలువారే చర్మం ఉంటే బాగుండని ప్రతి ఒక్కరూ కలలుగంటుంటారు. అలాంటి వారు చెంచా చొప్పున పుచ్చ, దోస, సొరకాయ గింజల్ని మొత్తగా పేస్ట్ చేసి దానికిలో చెంచా పాలు, చెంచా గులబీ నీరు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండ నేరుగా తగిలే చర్మం భాగాల్లో రాయాలి. దీని వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవడంతో పాటు కాంతివంతంగా ఉంటుంది. పాలల్లో కరిగించిన గంధం పొడిలో రెండు చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకొన్నా ఇదే ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications