Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చర్మం సౌందర్యానికి పాల మెరుపులు..!

వాతావరణ సమస్యలు, పోషకాల లేమి ఇలా కారణం ఏదైనా కొందిరి చర్మం నిర్జీవంగా ఉంటుంది. ఇలాంటి వారు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలల్లో చిటికెడు ఉప్పు వేసి రాత్రి పడుకొనే ముందు చేతులు, మెడ, ముఖం భాగాల్లో రాసుకొంటే చర్మానిక మెరుపు వస్తుంది. పాలల్లో గులాబి రేకుల మిశ్రమాన్ని కలిపినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
చర్మ కాంతి మెరుగుపడేందుకు: కొందరు రంగు తక్కువగా ఉన్నామని, మరికొందరు మునుపటి వర్ణం కోల్పోయామని తరచూ బాధపడుతుంటారు. ఇలాంటి వారు నానబెట్టిన మూడు బాదం గింజల్ని మిశ్రమంగా చేసుకొని పాలల్లో కలుపుకోవాలి. దీన్ని పడుకొనే ముందు ముఖం, మెడ కు రాసుకోవాలి.
పచ్చిశెనగపప్పును రాత్రంతా పాలల్లో నానబెట్టి మెత్తని పేస్టులా చేసి, అందులో కొద్దిగా పసుపు, రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలుపుకొని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మీ చాయ మెరుగుపడుతుంది.
ఓ టేబుల్ స్పూన్ పాలల్లో ఒక్కో చెంచా చొప్పున క్యారెట్, నారింజ రసం కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో మూడు చుక్కల తేనె వేసి కరిగే వరకూ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
పొడిచర్మానికి: కాలంతో పనిలేకుండా, కొందరి చర్మం పొడిబారుతుంది. ఇలాంటి వారు సెనగపిండిలో కొద్దిగా పసుపు, అరచెంచా నారింజ తొడిమపొడి, బాగా గిలకొట్టిన పెరుగు ఒక చెంచా, పాలు ఒక చెంచా వేసి బాగా కలపి, పదినిమిషాలు నానబెట్టి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒంటికి నలుగులా పెట్టుకొంటే ఈ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
మృదువైన చర్మం కోసం: పట్టులా జాలువారే చర్మం ఉంటే బాగుండని ప్రతి ఒక్కరూ కలలుగంటుంటారు. అలాంటి వారు చెంచా చొప్పున పుచ్చ, దోస, సొరకాయ గింజల్ని మొత్తగా పేస్ట్ చేసి దానికిలో చెంచా పాలు, చెంచా గులబీ నీరు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండ నేరుగా తగిలే చర్మం భాగాల్లో రాయాలి. దీని వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవడంతో పాటు కాంతివంతంగా ఉంటుంది. పాలల్లో కరిగించిన గంధం పొడిలో రెండు చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకొన్నా ఇదే ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











