Latest Updates
-
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.? -
ఆగ్రా ఫేమస్ పేఠా స్వీట్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.. -
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.!
చర్మం సౌందర్యానికి పాల మెరుపులు..!

వాతావరణ సమస్యలు, పోషకాల లేమి ఇలా కారణం ఏదైనా కొందిరి చర్మం నిర్జీవంగా ఉంటుంది. ఇలాంటి వారు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలల్లో చిటికెడు ఉప్పు వేసి రాత్రి పడుకొనే ముందు చేతులు, మెడ, ముఖం భాగాల్లో రాసుకొంటే చర్మానిక మెరుపు వస్తుంది. పాలల్లో గులాబి రేకుల మిశ్రమాన్ని కలిపినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
చర్మ కాంతి మెరుగుపడేందుకు: కొందరు రంగు తక్కువగా ఉన్నామని, మరికొందరు మునుపటి వర్ణం కోల్పోయామని తరచూ బాధపడుతుంటారు. ఇలాంటి వారు నానబెట్టిన మూడు బాదం గింజల్ని మిశ్రమంగా చేసుకొని పాలల్లో కలుపుకోవాలి. దీన్ని పడుకొనే ముందు ముఖం, మెడ కు రాసుకోవాలి.
పచ్చిశెనగపప్పును రాత్రంతా పాలల్లో నానబెట్టి మెత్తని పేస్టులా చేసి, అందులో కొద్దిగా పసుపు, రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలుపుకొని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మీ చాయ మెరుగుపడుతుంది.
ఓ టేబుల్ స్పూన్ పాలల్లో ఒక్కో చెంచా చొప్పున క్యారెట్, నారింజ రసం కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో మూడు చుక్కల తేనె వేసి కరిగే వరకూ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
పొడిచర్మానికి: కాలంతో పనిలేకుండా, కొందరి చర్మం పొడిబారుతుంది. ఇలాంటి వారు సెనగపిండిలో కొద్దిగా పసుపు, అరచెంచా నారింజ తొడిమపొడి, బాగా గిలకొట్టిన పెరుగు ఒక చెంచా, పాలు ఒక చెంచా వేసి బాగా కలపి, పదినిమిషాలు నానబెట్టి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒంటికి నలుగులా పెట్టుకొంటే ఈ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
మృదువైన చర్మం కోసం: పట్టులా జాలువారే చర్మం ఉంటే బాగుండని ప్రతి ఒక్కరూ కలలుగంటుంటారు. అలాంటి వారు చెంచా చొప్పున పుచ్చ, దోస, సొరకాయ గింజల్ని మొత్తగా పేస్ట్ చేసి దానికిలో చెంచా పాలు, చెంచా గులబీ నీరు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండ నేరుగా తగిలే చర్మం భాగాల్లో రాయాలి. దీని వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవడంతో పాటు కాంతివంతంగా ఉంటుంది. పాలల్లో కరిగించిన గంధం పొడిలో రెండు చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకొన్నా ఇదే ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications