Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
చర్మం సౌందర్యానికి పాల మెరుపులు..!

వాతావరణ సమస్యలు, పోషకాల లేమి ఇలా కారణం ఏదైనా కొందిరి చర్మం నిర్జీవంగా ఉంటుంది. ఇలాంటి వారు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలల్లో చిటికెడు ఉప్పు వేసి రాత్రి పడుకొనే ముందు చేతులు, మెడ, ముఖం భాగాల్లో రాసుకొంటే చర్మానిక మెరుపు వస్తుంది. పాలల్లో గులాబి రేకుల మిశ్రమాన్ని కలిపినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
చర్మ కాంతి మెరుగుపడేందుకు: కొందరు రంగు తక్కువగా ఉన్నామని, మరికొందరు మునుపటి వర్ణం కోల్పోయామని తరచూ బాధపడుతుంటారు. ఇలాంటి వారు నానబెట్టిన మూడు బాదం గింజల్ని మిశ్రమంగా చేసుకొని పాలల్లో కలుపుకోవాలి. దీన్ని పడుకొనే ముందు ముఖం, మెడ కు రాసుకోవాలి.
పచ్చిశెనగపప్పును రాత్రంతా పాలల్లో నానబెట్టి మెత్తని పేస్టులా చేసి, అందులో కొద్దిగా పసుపు, రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలుపుకొని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మీ చాయ మెరుగుపడుతుంది.
ఓ టేబుల్ స్పూన్ పాలల్లో ఒక్కో చెంచా చొప్పున క్యారెట్, నారింజ రసం కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో మూడు చుక్కల తేనె వేసి కరిగే వరకూ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
పొడిచర్మానికి: కాలంతో పనిలేకుండా, కొందరి చర్మం పొడిబారుతుంది. ఇలాంటి వారు సెనగపిండిలో కొద్దిగా పసుపు, అరచెంచా నారింజ తొడిమపొడి, బాగా గిలకొట్టిన పెరుగు ఒక చెంచా, పాలు ఒక చెంచా వేసి బాగా కలపి, పదినిమిషాలు నానబెట్టి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒంటికి నలుగులా పెట్టుకొంటే ఈ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
మృదువైన చర్మం కోసం: పట్టులా జాలువారే చర్మం ఉంటే బాగుండని ప్రతి ఒక్కరూ కలలుగంటుంటారు. అలాంటి వారు చెంచా చొప్పున పుచ్చ, దోస, సొరకాయ గింజల్ని మొత్తగా పేస్ట్ చేసి దానికిలో చెంచా పాలు, చెంచా గులబీ నీరు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండ నేరుగా తగిలే చర్మం భాగాల్లో రాయాలి. దీని వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవడంతో పాటు కాంతివంతంగా ఉంటుంది. పాలల్లో కరిగించిన గంధం పొడిలో రెండు చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకొన్నా ఇదే ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications