Latest Updates
-
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026
పాలు-కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ తో చర్మం నిగనిగ..!

కుంకుమపువ్వు సౌందర్యానికి, ఆరోగ్యానికీ కూడా ఉపయోగిస్తుంది. కుంకుమపువ్వు చర్మపు వర్చస్సును, కాంతిని పెంచుతుంది. చర్మానికి మంచి రంగును కలిగించి, చర్మపు సౌందర్యానికి తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు. గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును,పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన.
చెంచా గంధం పొడిలో రెండు మూడే కుంకుమ పువ్వు రేకలు, కాసిన్ని పాలు, చేర్చి ముఖానికి పూత వేయాలి. అరగంటయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది. మొటిమల తాలూకు మచ్చలతో బాధపడేవారు రెండు రేకలను నలిపి ఆ పొడిలో చెంచా తేనె కలిపి పక్కన పెట్టాలి. కొద్దిసేపయ్యాక దానిలో రెండు చెంచాల పెరుగును చేర్చి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేస్తే క్రమంగా మచ్చలు మాయమవుతాయి.
పాలల్లో కుంకుమ పువ్వుని నానబెట్టి అరగంట తర్వాత ముఖం, మెడ, చేతులకు రాసుకోవాలి. చర్మం తడారిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల మేని కళ మెరుగవుతుంది. కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
అలానే పాలమీగడలో రెండు రేకలు, చిటికెడు పసుపు వేసి ముఖానికి పట్టించి చల్లటినీళ్లతో కడిగేసుకొంటే మృత చర్మం తొలగిపోతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన చర్మతత్వం. ఏ రకమైన చర్మతత్వానికైనా కానీ తగిన పోషణ అందించి కాంతిమంతంగా చేయడానికి కుంకుమ పువ్వు తోడ్పడుతుంది. ముంుద రోజు రాత్రి మూడు రేకల్ని నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజుకి ఆ నీళ్లు రంగు మారతాయి. అందులో చెంచా చొప్పున పాలు, పంచదార, రెండు చుక్కల ఆలివ్ నూనె కలుపుకొని ఒంటికి రాసుకోవాలి. అరగంటయ్యాక సబ్బుతో రుద్దకుండా చన్నీటితో స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తూ వన్నెలీనుతుంది.



Click it and Unblock the Notifications