Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
పాలు-కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ తో చర్మం నిగనిగ..!

కుంకుమపువ్వు సౌందర్యానికి, ఆరోగ్యానికీ కూడా ఉపయోగిస్తుంది. కుంకుమపువ్వు చర్మపు వర్చస్సును, కాంతిని పెంచుతుంది. చర్మానికి మంచి రంగును కలిగించి, చర్మపు సౌందర్యానికి తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు. గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును,పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన.
చెంచా గంధం పొడిలో రెండు మూడే కుంకుమ పువ్వు రేకలు, కాసిన్ని పాలు, చేర్చి ముఖానికి పూత వేయాలి. అరగంటయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది. మొటిమల తాలూకు మచ్చలతో బాధపడేవారు రెండు రేకలను నలిపి ఆ పొడిలో చెంచా తేనె కలిపి పక్కన పెట్టాలి. కొద్దిసేపయ్యాక దానిలో రెండు చెంచాల పెరుగును చేర్చి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేస్తే క్రమంగా మచ్చలు మాయమవుతాయి.
పాలల్లో కుంకుమ పువ్వుని నానబెట్టి అరగంట తర్వాత ముఖం, మెడ, చేతులకు రాసుకోవాలి. చర్మం తడారిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల మేని కళ మెరుగవుతుంది. కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
అలానే పాలమీగడలో రెండు రేకలు, చిటికెడు పసుపు వేసి ముఖానికి పట్టించి చల్లటినీళ్లతో కడిగేసుకొంటే మృత చర్మం తొలగిపోతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన చర్మతత్వం. ఏ రకమైన చర్మతత్వానికైనా కానీ తగిన పోషణ అందించి కాంతిమంతంగా చేయడానికి కుంకుమ పువ్వు తోడ్పడుతుంది. ముంుద రోజు రాత్రి మూడు రేకల్ని నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజుకి ఆ నీళ్లు రంగు మారతాయి. అందులో చెంచా చొప్పున పాలు, పంచదార, రెండు చుక్కల ఆలివ్ నూనె కలుపుకొని ఒంటికి రాసుకోవాలి. అరగంటయ్యాక సబ్బుతో రుద్దకుండా చన్నీటితో స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తూ వన్నెలీనుతుంది.



Click it and Unblock the Notifications











