Latest Updates
-
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా?
తేనె...పాలుతో నిగారింపైన చర్మం..!

రోజూ ఉదయం పూట తేనెతో ముఖం, మెడను ఇరవై నిమిషాలు మర్దన చేసుకుని స్నానం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. కాంతిమంతంగా మారుతుంది.
కోడి గుడ్డు తెల్లసొనలో పావు చెంచా తేనె కలిపి గిలకొట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయాలి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, ముడతలు పోతాయి.
పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని మొఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని మొఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.
అదేవిధంగా అర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక గ్లాసు వేడి నీటిని, ఒకటి లేక రెండు టీ స్పూన్ తేనె కలిపి ఉదయానె పరగడుపుతో తాగినట్లైతే మేని మిలమిలలాడడమే కాకుండా, శరీరంలో వున్న క్రొవ్వు పదార్థాలు తగ్గి నాజూకుగా తయారవుతారు.
పచ్చిపాలలో తేనె కలిపి ఒంటికి రాయాలి. తర్వాత ముఖం మీద మాత్రం వలయాకారంలో మర్దన చేసి అరగంటయ్యాక స్నానం చేస్తే చర్మం కోమలంగా అవుతుంది. పాలు మాత్రమే కాదు పాలపొడిలో నీళ్ళు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి కడిగేసుకున్నా సరిపోతుంది.
రాత్రిపూట కొబ్బరి నూనె, ఇతార నూనెలు చర్మానికి రాయడం మంచిదే కానీ మేను రంగు మారిపోతుంది. అలాకాకుండా చిన్నారులకు వాడే నూనెలు రాస్తే మంచిది. అవి చర్మాన్ని సున్నితంగా మార్చుతాయి. విటమిన్ ‘ఇ’ ఉన్న నూనెలు శరీరానికి మరింత మేలు చేస్తాయి. పెసలను బరకగా పట్టించి సబ్బుకు బదులు సున్నిపిండిలా ఉపయోగించివచ్చు. అది చర్మం మీద మతకణాలను తొలగించి మేనును మృదువుగా చేస్తుంది.
బొప్పాయి కూడా శరీరానికి తేమనందిస్తుంది. చాయను ద్విగుణీకృతం చేస్తుంది. రాత్రిపూట గుజ్జుతో ముఖం, చేతులకు రాసి బాగా రుద్ది పావుగంటయ్యాక శుభ్రపరచుకోవాలి. స్నానానికి బాగా వేడినీళ్లు కాకుండా గోరు వెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో నాలుగు చెంచాలా కొబ్బరినూనె చేర్చితే చర్మం మీద జిడ్డు వదిలిపోతుంది. కాంతి మంతంగా మారుతుంది. మాయిశ్చరైజర్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కవగా రాసుకోవాలి. అలానే బాదం నూనె మిగతా వాటికంటే పలుచగా ఉంటుంది. ఈ కాలంలో ఇది సరైన ఎంపిక. ఈ నూనె త్వరగా చర్మంలోకి ఇంకిపోతుంది.
ఘాటైన క్లెన్సర్లు చర్మానికి హాని చేస్తాయి. బాదం పొడికి కాస్త వెన్న కలిపి రాత్రిళ్లు ఫేస్ వాష్ లా ఉపయోగిస్తే చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. చల్లటినీళ్ళతో ముఖం కడిగి తర్వాత గులాబీనీళ్లలో ముంచిన దూదితో చర్మాన్ని బాగా తుడవాలి. గులాబీనీరు మురికిని దూరం చేస్తుంది. ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. కమలాతొక్కల పొడికి తగినంత ఓట్ మీల్ పొడి కలిపి అందులో కాసిన్ని నీరు చేర్చి మర్ధన చేయాలి. ఇలా పదిరోజులకోసారి చేస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది.



Click it and Unblock the Notifications