Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
అరటి(బనానా) ఫేస్ ప్యాక్ తో చర్మం సౌందర్యవృద్ధి...

1. అరటి పండును పేస్ట్ గా చేసి, దానిలో కొంచెం కొబ్బరి నూనె గాని, అవిసనూనె గానీ కలిపి, కొంచెం తేనె కూడా కలిపి ఫేషియల్ క్రీమ్ గా వాడుకోవచ్చు. దీన్ని కాళ్లు చేతులకు కూడా పట్టించవచ్చు. చర్మసౌందర్యం వృద్ధి చెందుతుంది.
2. బాగా పండిన అరటి పండును పావు భాగం తీసుకుని మెత్తగా చిదిమి క్రీమ్ గా వచ్చే వరకు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పదిహీను లేదా ఇరవై నిమిషాల తర్వాత ముందుగా వేడి నీటితోను తరువాత చల్లటి నీటితోను కడగాలి. కడిగిన తర్వాత ముఖాన్ని స్వతహాగా ఆరనివ్వాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతితో మెరుస్తూ ఉండడంతో పాటు ముడుతలను కూడా నివారిస్తుంది.
3. ముదుగా ముఖాన్ని శుభ్రంగా కడుకున్న తరువాత అరటిపండు గుజ్జుని ముఖం అంతా సమానంగా పట్టించి ఐదు నిమిషాలపాటు అలానే వుంచుకోవాలి, మీది జిడ్డు చర్మం అయినా, ముఖం మీద నల్లటి మచ్చలు వున్నా, రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫేషియల్ స్టీమ్ తీసుకోవాలి. ఫేషియల్ స్టీమ్ వలన చర్మం మృదువుగా మారుతుంది.
4. అరటిపండు తొక్కతో ముఖం మీద తేలికగా రబ్ చేస్తూ చర్మంలో వున్న మృత కణాలను తొలగించుకోవాలి. మృతకణాల తొలగింపు అయిపోయిన తరువాత అరటి - కోకో బటర్ (మసాజ్ క్రీమ్) కలిపి మృదువుగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
5. బనానా పాక్ను ముఖానికి, మెడకి దట్టించి 15 నిమిషాలపాటు అలానే వుంచే యాలి, ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకొని మెత్తటి టవల్తో తుడుచుకుంటే ముఖం అందంగా కనబడుతుంది



Click it and Unblock the Notifications