అరటి(బనానా) ఫేస్ ప్యాక్ తో చర్మం సౌందర్యవృద్ధి...

Skin Care
అరటిపండు మనకు సహజ సిద్దంగా లభించే పండు. ఇందులో అనేక రకాల పోషక విలువలున్నాయి. ఇలాంటి పండుతో ఫేషియల్ చేసుకుంటే మీ ముఖారవిందం ఎంతో అందంగా తయారవుతుంది.

1. అరటి పండును పేస్ట్ గా చేసి, దానిలో కొంచెం కొబ్బరి నూనె గాని, అవిసనూనె గానీ కలిపి, కొంచెం తేనె కూడా కలిపి ఫేషియల్ క్రీమ్ గా వాడుకోవచ్చు. దీన్ని కాళ్లు చేతులకు కూడా పట్టించవచ్చు. చర్మసౌందర్యం వృద్ధి చెందుతుంది.

2. బాగా పండిన అరటి పండును పావు భాగం తీసుకుని మెత్తగా చిదిమి క్రీమ్ గా వచ్చే వరకు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పదిహీను లేదా ఇరవై నిమిషాల తర్వాత ముందుగా వేడి నీటితోను తరువాత చల్లటి నీటితోను కడగాలి. కడిగిన తర్వాత ముఖాన్ని స్వతహాగా ఆరనివ్వాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతితో మెరుస్తూ ఉండడంతో పాటు ముడుతలను కూడా నివారిస్తుంది.

3. ముదుగా ముఖాన్ని శుభ్రంగా కడుకున్న తరువాత అరటిపండు గుజ్జుని ముఖం అంతా సమానంగా పట్టించి ఐదు నిమిషాలపాటు అలానే వుంచుకోవాలి, మీది జిడ్డు చర్మం అయినా, ముఖం మీద నల్లటి మచ్చలు వున్నా, రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫేషియల్‌ స్టీమ్‌ తీసుకోవాలి. ఫేషియల్‌ స్టీమ్‌ వలన చర్మం మృదువుగా మారుతుంది.

4. అరటిపండు తొక్కతో ముఖం మీద తేలికగా రబ్‌ చేస్తూ చర్మంలో వున్న మృత కణాలను తొలగించుకోవాలి. మృతకణాల తొలగింపు అయిపోయిన తరువాత అరటి - కోకో బటర్‌ (మసాజ్‌ క్రీమ్‌) కలిపి మృదువుగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

5. బనానా పాక్‌ను ముఖానికి, మెడకి దట్టించి 15 నిమిషాలపాటు అలానే వుంచే యాలి, ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచుకుంటే ముఖం అందంగా కనబడుతుంది

Story first published: Friday, January 6, 2012, 15:38 [IST]
Desktop Bottom Promotion