Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ముఖ సౌందర్యానికి గులాబీ మెరుపులు..

సౌందర్య పోషణలోనూ గులాబీ నీళ్లది కీలకపాత్ర దానివల్ల చర్మం..నిగారింపు సంతరించుకోవడమే కాదు..అలసిన మేనికి స్వాంతననందిస్తుంది. గులాబీ రేకుల్నించి తయారుచేసినద్రవాన్ని సర్వ సాధారణంగా ప్రతి నిత్యం వాడుకోచ్చు.ఈ రోజఆయిల్ ని చర్మ సౌందర్యానికి, మేకప్ సామాగ్రిలోను చాలా ఎక్కువగా వాడతారు.
1. గులాబీ రేకుల్ని 4 చెంచాల గోరువెచ్చని పాలలో బాగా నలిపి, కొద్ది సేపు ఉంచిన తరువాత ముఖానికి రాసుకుని, అరగంట తరువాత స్నానం చేస్తే ముఖం ప్రకాశవంతంగా, తాజాగా ఉంటుంది.
2. గులాబీనీళ్లు పొడి చర్మతత్వం ఉన్న వారికి మంచి ప్రయోజనకారి. దీన్ని యాస్ట్రింజెంట్ గా ఉపయోగించడం వల్ల చర్మం మీద మురికి తొలగిపోయి..తేమ అందుతుంది.
3. రోజూ రాత్రిపూట పడుకునే ముందు ముఖం, కాళ్లు, చేతులకు ఈనీళ్లను పట్టిస్తే మర్నాటికి చర్మం తాజాగా తయారవుతుంది.
4. ఆయిల్ స్కిన్ కలవారికి రెండు టీస్పూన్ల టమోటో రసం, రెండు టీస్పూన్ల కీరదోసకాయ రసం తీసుకొని అందులో ఒక స్పూన్ రోజ్ వాటర్ ను కలపి ముఖానికి రాసుకొని 10-15నిమిషాలపాటు అలాగా ఉండి తర్వాత చల్లటి నీటితో కడుకొంటే ముఖంలో ఆయిల్ పోగొట్టి ఫ్రెష్ గా ఉంచుతుంది.
5. మేకప్ తొలగించుకున్న తర్వాత నీటితో ముఖం కడుగుతుంటారు కొందరు. దానికి బదులు గులాబీనీళ్లలో ముంచిన వస్త్రంతో తుడిస్తే చర్మం మీద జిడ్డు తొలగిపోతుంది.
6. సున్నిత చర్మతత్వం కలవారు బయటకు వెళ్లడానికి ముందు తర్వాత రోజ్ వాటర్ లో నానబెట్టిన వస్త్రంతో ముఖం, మెడ, చేతులను రుద్దితే సరిపోతుంది.
7.ముఖానికి రోజ్ వాటర్ పట్టించడం వల్ల నల్లమచ్చలు, మొటిమలు నియంత్రణలో ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తవు.



Click it and Unblock the Notifications