Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
కోల్పోయిన మీ చర్మ కాంతిని తిరిగి పొందాలంటే..!?
కాలాన్ని బట్టి చర్మ తత్వ కూడా మారుతుంటుంది. దాంతో పాటు వాతావరణం ప్రభావంతో పాటు, కాలుష్యం, దుమ్ము, ధూళి చర్మాన్ని, శిరోజాలని ఎక్కువగా భాదిస్తుంది. ఈ చర్మం, శిరోజాల ప్రభావం కారణంగా ముఖం పై మొటిమలు, మచ్చలు ఏర్పడుతాయి. వీటితో పాటు చర్మం కాంతిహీనమై నిర్జీవంగా కనిపిస్తుంది. కోల్పోయిన అందాన్ని తిరిగి పొందేందుకు వంట ఇంట్లో ఉపయోగించే వస్తువులే చాలు అంటున్నారు సౌందర్య నిపుణులు.
అందంగా ఉండటానికి ఎన్నో రకరకాల క్రీములను వాడుతూ వుంటారు. మీరు అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు మీ చర్మం ఎలా వుందో గమనించండి. కలర్ ఎలాంటిదైనా మెరుపులీనుతూ ఉన్నదనుకోండి మీది ఆరోగ్యవంతమైన చర్మం లేదంటే డెడ్ స్కిన్ బాగా పేరుగుపోయిందని అర్థం. దీన్ని తొలగించాలంటే ఇంట్లో ఉండే నిమ్మకాయ, పుసుపు, మినపప్పు(సున్ని పిండి)పెసరపప్పు, తదిత వస్తువులను ఉపయోగించి ముఖాన్ని, చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

ముఖం కళకళలాడేందుకు సున్నిపిండి ఫేషియల్(సున్నిపిండి): అందాన్ని కాపాడే ముఖ్యమైన వస్తువు మినపప్పు. నీర్జీవంగా కనిపించే చర్మానికి యవ్వనాన్ని ఇచ్చేదే మినపప్పు. రెండు చెంచాలా మినపప్పు పిండిలో కొద్దిగా నీళ్ళు పోగి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆదేవిధంగా స్నానం చేసేటప్పుడు మినపప్పు(సున్నిపిండిని) చర్మానికి పూసి స్నానం చేస్తే చర్మం అందంగా యవ్వనంగా మెరిసిపోతుంది.

రోజ్ వాటర్-సున్నిపిండి(రోజ్ వాటర్): రెండు చెంచాల సున్నిపిండి పౌడర్ లో నాలుగు చెంచాల పాలు, రెండు చెంచాల రోజో వాటర్ కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది.

సున్నిపిండి-(పసుపు): పూర్వకాలం నుంచి నేటి వరకూ సాంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండూ శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక ప్రాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్ లో చిటికెడు పసుపు, కాస్త నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిన అరగంట సేపు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరిచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

మచ్చలు మాయం చేసే సున్నిపిండి(పాలు): చెంచా సున్నిపిండి, పెప్పర్ పౌడర్ చిటికెడు, ముల్తానీ మట్టి పాలుతో మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకొని ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మచ్చలు క్రమంగా మటుమాయం అయిపోతాయి.

జిడ్డు చర్మానికి (పెరుగు-నిమ్మరసం): సున్నిపిండికి పెరుగు కలిపిన చిక్కగా పేస్ట్ లా చేసి ఫేషియల్ వేసుకుంటే జిడ్డు తొలగి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్రలో మినపప్పు తీసుకొని అందులో మినుపపిండి, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది.

డల్ గా ఉన్న ముఖం కోసం(హెర్బల్): మినపపిండి(సున్నిపిండితో పాటు, తులసి, వేప ఆకుల పొడిని కలిపి, అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేయాలి. పదినిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు ముఖం కళకళలాడుతూ ప్రకాశవంతంగా మారుతుంది.



Click it and Unblock the Notifications