Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే చాలు.. బరువు, పొట్ట మాయం!..గ్యాస్,అజీర్తి సమస్యలకు చెక్
బాలీవుడ్ నటి నేహా ధూపియా ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 45 ఏళ్ల వయసులోనూ ఆమె అంత ఫిట్ గా, యాక్టివ్ గా ఉండటానికి కారణం ఆమె తీసుకున్న 21 రోజుల ఛాలెంజ్.
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రిచా గంగాని పర్యవేక్షణలో నేహా ఈ ఛాలెంజ్ స్వీకరించారు. దీని ప్రధాన ఉద్దేశం కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదండోయ్.. అంతకంటే ముఖ్యంగా శరీరంలో మంట తగ్గించి, ఆరోగ్యాన్ని పునరుద్ధరించడమేనట.

ఈ ఛాలెంజ్ లో భాగంగా నేహా ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక ప్రత్యేకమైన హెర్బల్ డ్రింక్ తాగుతున్నారు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గి, రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర పడుతుందని, ఉదయం లేవగానే శరీరం ఎంతో తేలికగా అనిపిస్తుందని ఆమె తన అనుభవాన్ని షేర్ చేశారు.
ఆ మ్యాజిక్ డ్రింక్ తయారీ విధానం
మీరు కూడా నేహా ధూపియా లాంటి ఫలితాలను పొందాలనుకుంటే.. వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ పానీయాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఒక గిన్నె నీటిలో సోంపు, కొత్తిమీర లేదా థైమ్, జీలకర్ర, అల్లం వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ప్రయోజనాల కోసం ఇందులో కాస్త నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
ఈ డ్రింక్ ఎందుకంత పవర్ ఫుల్?
ఈ డ్రింక్ లో వాడే ప్రతి పదార్థం మన జీర్ణవ్యవస్థకు ఒక వరం లాంటిది. అవి ఎలా పని చేస్తాయో చూడండి.
సోంపు: సాధారణంగా మనం భోజనం తర్వాత సోంపు తింటాం. ఇది కేవలం నోటిని శుభ్రపరచడమే కాదు, ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో అసౌకర్యాన్ని, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.
జీలకర్ర: మన వంటింటి వైద్యంలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది పేగుల్లో జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమై, గ్యాస్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ కంట్రోల్ లోనూ సహాయపడతాయి.
అల్లం: అల్లంలో ఉండే జింజెరాల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం అద్భుతమైన ఔషధం. ఇది పేగు కండరాలను సడలించి, ఆహారం కడుపులో నిల్వ ఉండకుండా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫలితంగా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.
నిమ్మరసం: ఇందులో కలిపే నిమ్మరసం జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది. విటమిన్-సి శరీరంలోని మలినాలను శుభ్రం చేస్తుంది. అయితే రాత్రిపూట నిమ్మరసం పడని వారు దీనిని మినహాయించవచ్చు.
మీరు కూడా కడుపు ఉబ్బరం, అజీర్తి లేదా నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే నేహా ధూపియా సూచించిన ఈ చిట్కాను ఒకసారి ప్రయత్నించి చూడండి. అయితే ఏదైనా కొత్త డైట్ ప్రారంభించే ముందు డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











