Latest Updates
-
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!
హైబీపీ ఉన్నవారికి అలర్ట్.. పరగడుపున పెరుగన్నం తింటే ఇన్ని లాభాలా.?
మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ, వడ ఇలా రకరకాల టిఫిన్స్ను ఇష్టపడుతుంటారు. కానీ ఉదయం అన్నం తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే పరగడుపున పెరుగన్నం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

భోజనం చివరిలో పెరుగు లేనిదే సంతృప్తి ఉండదు. ఇక వేసవిలో అయితే మజ్జిగ అదనం. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో పెరుగు తప్పనిసరి ఉంటుంది. కానీ పరగడుపన కూడా పెరుగన్నం తింటే ఎన్నో పోషకాలు అందుతాయి. ఉదయాన్నే పెరుగన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో ఇక్కడ చూద్దాం.
పరగడుపున పెరుగన్నం తీసుకోడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బాక్టీరియాను పెంచి జీర్ణక్రియ మెరుగయ్యేందుకు దోహదపడుతుంది.
ప్రతి రోజూ ఉదయాన్నే పెరుగన్నం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం లోపంతో బాధపడుతున్న వారు పెరుగు తీసుకోవడం ద్వారా ఆ లోపాన్ని అధిగమించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు పరగడుపున పెరుగన్నం తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే పెరుగన్నం ఎముకలను బలపరచడంతో పాటు కడుపు, శరీరాన్ని చల్లబరుస్తుంది.
పెరుగన్నం ఎలా తీసుకోవాలి
ముందు రోజు రాత్రి అన్నంలో పెరుగు కలిపి అందులో కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయను ముక్కలుగా చేసి కలపాలి. కొద్దిగా ఉప్పు, రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెరుగన్నంలో వేసి కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున తింటే శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి.
గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్న వారు నిల్వ ఉన్న, పుల్లగా ఉన్న పెరుగును తినకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. తాజా పెరుగు తీసుకోవాలి. పెరుగన్నంలో పండ్లు కలుపుకొని తింటే ఇంకా మంచిది.
అయితే పెరుగన్నాన్ని ఇష్టారీతిన తీసుకోకూడదు. ఇందులో చక్కెర కలిపి తీసుకోకూడదని గమనించాలి. పరిమిత మొత్తంలో తీసుకుంటూ ప్రతిరోజూ ఉదయాన్నే పెరుగన్నం తీసుకోవడం ద్వారా ఆయిల్ టిఫిన్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications