Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Right way to eat fruits: పండ్ల పూర్తి ప్రయోజనం కావాలా? అయితే ఇలాగే తినాలి!
పండ్లను ప్రకృతి మనకు ప్రసాదించిన అమృత ఫలాలుగా పరిగణిస్తుంటాం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాల గని అయిన పండ్లను రోజూ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ పండ్లను ఎలా తినాలి అనేది చాలామందికి తెలియదు. పండ్ల పూర్తి ప్రయోజనాలను పొందాలంటే వాటిని తిని పద్ధతి తెలుసుకోవం కూడా చాలా ముఖ్యం.సాధారణంగా చాలామంది పండ్లను ముక్కలుగా కోసి, ప్లేట్ లో అందంగా సర్దుకుని తింటారు. కానీ ఇలా చేయడం వల్ల వాటిలోని అసలైన సత్వాన్ని కోల్పోతున్నారని మీకు తెలుసా?
పండ్లను కోసిన వెంటనే అవి గాలి, వెలుతురు, వేడికి గురవుతాయి. దీనివల్ల వాటిలోని పోషకాలు వేగంగా నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తికి కీలకమైన విటమిన్ C..గాలి సోకిన వెంటనే ఆవిరైపోతుంది. జింక్, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాల విలువ కూడా తగ్గిపోతుంది. పండ్లను కోయడం వల్ల వాటి శ్వాసక్రియ రేటు అనూహ్యంగా పెరుగుతుంది. దీనివల్ల వాటిలోని సహజమైన తీపిదనం తగ్గి, రుచి, వాసన మారిపోతాయి. పండ్లు త్వరగా పాడైపోవడానికి కూడా ఇదే కారణం. ఫలితంగా మీరు పండ్లను తిన్నా వాటి సంపూర్ణ ప్రయోజనం శరీరానికి అందదని నిపుణులు తెలిపారు.

కొరికి తినండి ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి
ఆపిల్, జామ, సపోటా, స్ట్రాబెర్రీ వంటి కొన్ని పండ్లను తొక్క తీయాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రంగా కడిగి నేరుగా పళ్లతో కొరికి తిన్నప్పుడే అసలైన లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తొక్కతో పాటు తినడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్, పీచుపదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. పండ్లను కొరికి తినడం వల్ల దంతాలు సహజంగా శుభ్రపడి, చిగుళ్లు బలపడతాయి. శరీరంలో జీవక్రియ వేగవంతమై రోజంతా యాక్టివ్ గా,హెల్తీగా ఉంటారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-పండ్లను కోసి తిన్నా లేదా కొరికి తిన్నా.. తినడానికి ముందు శుభ్రంగా వాటిని కడగడం మాత్రం మర్చిపోకూడదు. లేకుంటే లేని రోగాలను మనలో నోట్లో పెట్టుకున్నట్లు అవుతుంది.
-దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ వంటి మందపాటి తొక్క ఉండే పండ్లను మాత్రం కచ్చితంగా ముక్కలుగా కోసుకుని తినాలి.
-కోసిన పండ్లను ఎప్పుడూ ఎక్కువసేపు గాలికి వదిలేయకండి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. ఇకపై పండ్లను తినేటప్పుడు ఈ చిన్న మార్పులు చేసి, వాటి పూర్తి ప్రయోజనాలను పొందండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











