మధుమేహాన్ని పారద్రోలేందుకు ద్రాక్ష తినండి!

By B N Sharma

Black Grapes cure Diabetes
మధుమేహ రోగులకు శుభవార్త...! అదేంటంటే మధుమేహ వ్యాధిని పారద్రోలేందుకు ద్రాక్షను సేవిస్తుంటే మధుమేహం మటుమాయమౌతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ద్రాక్షపండ్లను సేవిస్తుంటే అధిక రక్తపోటు క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని పారద్రోలుతుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు.

తొలుత తాము ఎలుకలపై పరిశోధించి వాటికి పచ్చ, ఎరుపు, నలుపు రంగు కలిగిన ద్రాక్షపండ్లతో పాటు అమెరికాకు చెందిన అత్యధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. వీటితోపాటు మరికొన్ని ఎలుకలకు కేవలం కొవ్వు, చక్కెర శాతం ఎక్కువగానున్న ఆహారాన్ని ఇచ్చామని, మూడు నెలల తర్వాత వీటిని పరీక్షిస్తే ద్రాక్షపండ్లు ఇచ్చిన ఎలుకల్లో రక్తపోటు, గుండెకు సంబంధించిన జబ్బులు ఏ మాత్రం లేదని తమ పరిశోధనల్లో తేలినట్లు వారు పేర్కొన్నారు.

నల్లద్రాక్ష పుల్లగా వుండటం చేత ఇప్పటికే చాలామంది డయాబెటిక్ రోగులు ప్రతిదినం వారు తాగే పండ్లరసాలలో ద్రాక్ష రసాన్ని కూడా చేరుస్తుంటారు. సహజ సిద్ధమైన ద్రాక్షపండు డయాబెటీస్ రోగులకే కాదు ఇతరులకు కూడా ప్రతి రోజూ ఒక గ్లాసు రసంగా తీసుకుంటే అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలుండగలవని పరిశోధకులు చెపుతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, September 15, 2011, 11:13 [IST]
Desktop Bottom Promotion