ప్రతి 5 గురిలో ...ఒకరికి షుగర్... !

By B N Sharma

One in 5 Indians Have Diabetes!
భారతీయులలో నగరాలలో నివసించే వారిలో ప్రతి అయిదుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి, రక్తపోటు వున్నట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్ర లో దీని ప్రభావం మరింత ఆందోళన కలిగించేదిగా వుండి. అక్కడి నగర వాసులలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ రెండు వ్యాధులు వున్నట్లు వెల్లడయింది.

ఈ సర్వే 'స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్' అనే పధకంలో చేశారు. దేశం మొత్తంగా చూస్తే 60 శాతమని, మహారాష్ట్రలో ఈ జంట వ్యాధుల ప్రభావం 67 శాతంగా కూడా వుందని సర్వేలో తేలింది.ఈ పరిశోధనలో సుమారు 16,000 మందిని నగరాలలో వున్నవారిని 8 రాష్ట్రాలలో మూడు సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు. ఈ వ్యాధులు రెండూ నియంత్రణ లేనివిగా వున్నాయని, ప్రజలు వారి షుగర్ స్ధాయిలను స్వయంగా నియంత్రించుకోవడం లేదని పరిశోధనా టీముకు నాయకత్వం వహించిన డా. శశాంక్ తెలిపారు.

ఈ రెండు వ్యాధులూ నియంత్రణ లేకుండా పెరిగిపోవటానికి అధిక బరువు, మాంసాహారం తినటం కారణాలుగా వారు పేర్కొన్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, November 8, 2011, 16:15 [IST]
Desktop Bottom Promotion