Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
డయాబెటీస్ ప్రాధమిక లక్షణాలు ఎలా వుంటాయి?

డయాబెటీస్ వ్యాధి వున్న వారికి శరీరంలోని ఈ పానిక్రియాస్ గ్రంధి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. లేదా ఉన్న ఇన్సులిన్ సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు. ఈ కారణంగా శరీరంలో షుగర్ నిల్వలు పెరిగిపోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పెరిగి జీవప్రక్రియ లోపించి శరీరంలోని ప్రధాన అవయవాల చర్యలు సమర్ధత కోల్పోతాయి. ఈ పరిస్ధితిని కనుక వైద్యం చేయకుండా అలానే వదిలేస్తే, డయాబెటీస్ వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. గుండె వ్యాధులు, కండ్లకు చూపు మందగించటం, కిడ్నీలు విఫలమవటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. కనుక డయాబెటీస్ రోగులు ఒక సారి రోగ నిర్ధారణ జరిగిన తర్వాత తగినంత జాగ్రత్తలు ఆహార పరంగా, వైద్య పరంగా తీసుకోవాలి.
డయాబెటీస్ రెండు రకాలుగా వస్తుంది. మొదటిది టైప్ 1. దీనికి ఇన్సులిన్ తీసుకోవడమే మార్గము. ఇది పిల్లలలో వచ్చే వ్యాధి. ప్రారంభంలోని పాన్ క్రియాటిక్ సెల్స్ నష్టం అయి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కనుక వీరికి ఇన్సులిన్ ఎక్కించడమే చేయాలి. లక్షణాలు ఎలావుంటాయంటే, రక్తంలో, మూత్రంలో షుగర్ లెవెల్ పెరగడం, తరచుగా మూత్రం పోయడం, ఆకలి, దాహం, బరువు తగ్గటం, బలహీనం, అలసట, భావోద్రేకాలు, వికారం, వాంతులు మొదలైనవి.
టైప్ 2 డయాబెటీస్ - వీరికి ఇన్సులిన్ ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి లేదా అధిక బరువున్న వారికి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు, దాహం, మూత్రం అధికంగా పోయటం, అలసట, చికాకు, వికారం, చర్మంపై ఇన్ ఫెక్షన్, చూపు మందగించడం, పొడిచర్మం, చర్మం చురుక్కు మనటంగా వుంటాయి. డయాబెటీస్ రోగ నిర్ధారణ జరిగిన వెంటనే రోగి తన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తీపి పదార్ధాలు తినటం తగ్గించాలి. తియ్యటి పండ్లు, పాలిష్ పట్టిన రైస్ తో తయారు చేసిన తెల్లని అన్నం, కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే ఆహారాలు తినరాదు. తగిన పరీక్షలు చేయించుకుంటూ రక్తంలోని గ్లూకోజ్ నిల్వలను నియంత్రించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications