Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
అధిక బరువుతో వచ్చే షుగర్ వ్యాధి...!

తాజా పరిశోధనలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ లో ప్రచురించారు. లెప్టిన్ అనేది ఒక హార్మోన్ అని అది శరీరం తీసుకున్న ఆహారాన్ని , చేసిన ఎనర్జీ వ్యయాన్ని సమతుల్యత చేస్తుందని, ఈ హార్మోను సహకరించకపోతే శరీరం లావెక్కిపోవటం, షుగర్ వ్యాధి ఏర్పడటం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లారిడా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్లు వెల్లడి చేశారు.
ఫ్రక్టోస్ అనేది తాజా పండ్లలో వున్నప్పటికి వాటిని తింటే సమస్య లేదని, అయితే స్వీటు తినుబండారాలలో కలిపే సాధారణ స్వీటనర్లు అయిన టేబుల్ షుగర్, ఫ్రక్టోస్ అధికంగా వుండే కార్న సిరప్ మొదలైనవాటి వలననే వ్యక్తులు అధిక బరువు సంతరించుకోడం, షుగర్ వ్యాధి పాలవటం జరుగుతోందని వారు తెలిపారు.
షుగర్ వ్యాధితో బాధపడే వారికి కాకర కాయ రసం ఇస్తే ఆ జబ్బు అదుపులోవుంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇందులో వ్యాధి నిరోధక గుణం ఉండటం మూలాన మధుమేహ రోగులకు ఈ రసం బాగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి రోజు ఉదయంవేళ పరకడుపున సేవిస్తుంటే డయాబెటిక్ వ్యాధి అదుపులోవుంటుంది.
కాకర కాయ రసాన్ని తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు: 3 లేదా 4 తాజా కాకర కాయలు, అరచెక్క నిమ్మకాయ, చిటికెడు ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు, రెండు టమాటాలు, చిన్న కీరకాయ ఒకటి.
ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే...కాకర కాయ, టమోటా, కీరకాయ మూడింటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయండి. ఇందులో ఒక గ్లాసు నీరు కలపండి. తెల్లటి గుడ్డలో ఈ మిశ్రమాన్ని వడగట్టండి. తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండి ప్రతి రోజు ఉదయం వేళ పరకడుపున తాగండి. ఇలా ప్రతి రోజు తాగితే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్త ప్రసరణలో కూడా ఈ రసం బాగా తోడ్పడుతుందని పరిశోధకులు చెపుతున్నారు.. దీంతోపాటు మధుమేహవ్యాధి కూడా అదుపులోవుంటుందంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications